కోరుట్ల: మన దేశ క్రికెట్ జట్టు వరల్డ్ కప్ ఫైనల్కు చేరిన విషయం తెలిసిందే. ఆదివారం కప్ గెలవాలని ఆశిస్తూ కోరుట్ల మండలం అయిలాపూర్కు చెందిన స్వర్ణకారుడు తుమ్మనపల్లి నరేశ్ బంగారు బుల్లి వరల్డ్ కప్ను రూపొందించాడు. నరేశ్ తయారు చేసిన బుల్లి ప్రపంచ కప్ కేవలం 0.90 మిల్లీ గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. క్రికెట్పై అభిమానంతో ప్రపంచ కప్ నమూనాలో బంగారు బుల్లి వరల్డ్ కప్ తయారు చేసిన అతడిని క్రికెట్ అభిమానులు అభినందించారు.
నరేశ్
బంగారు
వరల్డ్ కప్