-
నీట్లో మెరిట్ రాదేమోనని ఆత్మహత్య
ఇంద్రవెల్లి: నీట్ పరీక్షలో మెరిట్ రాదేమోననే బెంగతో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఏ మాయికుంటలో చోటు చే సుకుంది. కుటుంబ సభ్యులు, ఎస్సై దుబ్బాక సునీల్ తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన కాగ్నే డిగంబర్, గీత దంపతుల కుమారుడు సనత్కుమార్(17) ఆదివారం నీట్కు హాజరయ్యాడు. పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తానో లేదోనని ఇంట్లో ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. మధ్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో తన గది లో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. గమనించిన డిగంబర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వాహనాలు సిద్ధం
● ఎన్నికల సిబ్బంది, సామగ్రి రవాణాకు ఆర్టీఏ ఏర్పాట్లు ● మూడు నియోజకవర్గాల్లో సిబ్బందికి బస్సులు ● దివ్యాంగ ఓటర్ల తరలింపునకు ఆటోలుమంచిర్యాలరూరల్(హాజీపూర్): ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది, సామగ్రిని తరలించేందుకు ఆర్టీఏ వాహనాలు సిద్ధం చేసింది. ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో గ్రామ, మండల స్థాయిలో ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు, సామగ్రి తరలింపునకు బస్సులు, కార్లు సమకూరుస్తోంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ ఆదేశాల మేరకు జిల్లా రవాణా శాఖ అధికారి(డీటీఓ) సంతోష్కుమార్ ఆధ్వర్యంలో రవాణా శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. దివ్యాంగ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి తీసుకెళ్లడానికి ఆటోలు సమకూరుస్తున్నారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకర్గాల్లో 98రూట్లకు అనుగుణంగా అధికారులు వాహనాలు ఏర్పాటు చేశారు. ఈ నెల 12, 13వ తేదీల్లో వాటిని వినియోగించుకుంటారు. ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వర్తించే ఉన్నతాధికారుల కోసం అవసరమైన 100 కార్లను సమకూర్చారు. ఎన్నికల కోడ్ అమలు నుంచి ఎన్నికల పరిశీలనకు కేటాయించిన రూట్లలో కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో.. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. జిల్లాలో మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్ ఉన్నాయి. ఎన్నికల ఉద్యోగులు, సిబ్బందితోపాటు సామగ్రి తరలింపునకు 214 వాహనాలు సిద్ధం చేశారు. ● దివ్యాంగులు పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేలా విస్తృత ఏర్పాట్లు చేశారు. అచేతన స్థితిలో ఉన్న వృద్ధులు, ది వ్యాంగులు ఓటు వేసేందుకు ఇంటి నుంచి వ చ్చి ఓటు వేసిన తర్వాత వెళ్లడానికి ఆటోలు అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటివరకు 492 ఆటోలు అవసరమని గుర్తించి సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు 150 ఆటోలు, గ్రామీణ ప్రాంతాలకు 350 ఆటోల వరకు కేటాయించి పోలింగ్ కేంద్రాల వారీగా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. -
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
● పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ చెన్నూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని పెద్దపల్లి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. సోమవారం రాత్రి చెన్నూర్ పట్టణంలోని జలాల్ పెట్రోల్ బంక్ నుంచి ప్రధాన రహదారులు, వ్యాపార సముదాయాల్లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డలకు రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఆరు నెలలైన అడ్రస్ లేదన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాంలాల్గిల్డా, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఆదరించండి బెల్లంపల్లి: పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని సింగరేణి కార్మికులు ఆదరించాలని పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. సోమవారం మందమర్రి ఏరియా శాంతిఖని గని ఆవరణలో నిర్వహించిన గేట్మీటింగ్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ప్రజా, కార్మి క సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల్లో మరిన్ని కొత్త హామీలు ఇవ్వడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆగర్భ శ్రీమంతుడై న కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణతో తలపడుతున్న తా ను సాధారణ వ్యక్తినని పేర్కొన్నారు. బెల్లంపల్లి మండలం బుధాకలాన్ గ్రామానికి వెళ్లి ఉపాధి హా మీ కూలీలు, బెల్లంపల్లి కాంటా చౌరస్తా, బజారు ఏ రియా ప్రాంతంలో ప్రచారం చేసి పుర ప్రజలు, కూ రగాయల వ్యాపారులతో ముచ్చటించారు. ఈ కా ర్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జెడ్పీ వైస్ చైర్మన్ టి.సత్యనారాయణ, బీఆర్ఎస్, టీ బీజీకేఎస్ నాయకులు కొప్పుల లక్ష్మణ్, గణేష్, బడికెల సంపత్, మేడిపల్లి సంపత్, బడికెల రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
ఈ ప్రాంత అభివృద్ధికి కృషిఎంపీగా గెలిచాక పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్న మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. సింగరేణి కార్మికుల సంక్షేమం, రైల్వే, రహదారులు, బసంత్నగర్ ఎయిర్పోర్టు, పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాను. స్థానిక యువత ఉపాధికి కృషి చేస్తాను. ఇక్కడి అభివృద్ధే ధ్యేయంగా పార్లమెంట్లో గళమెత్తుతాను. నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా. సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి అవకాశాలు కల్పించడమే సామాజిక న్యాయమా..?’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతుడిగా ఉన్న కార్పొరేట్ కంపెనీ సీఈవోకు, భూగర్భ గని కార్మికుడిగా పని చేసిన తనకు మధ్య ఉన్న పోటీలో ప్రజలు ఎటువైపు ఉంటారో ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ దళిత వర్గాల్లో మాదిగ, ఇతర ఉప కులాలను మోసం చేసిందని విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కొప్పుల ఈశ్వర్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కార్మిక ఉద్యమాలు చేశాం మేం పుట్టింది.. పెరిగింది.. జీవిస్తోంది కార్మిక నేపథ్యంలోనే. నక్సల్స్ కాలం నుంచే సింగరేణి కార్మి కు ల కోసం ఎన్నో పోరాటాలు చేశాం. గనుల్లో ప్ర మాదాలు జరిగితే కొట్లాడినం. పరిహారం, వేతనా లు, బోనస్, సౌకర్యాల పెంపు కోసం ఉద్యమాలు చే శాం. 45రోజుల సమ్మె నుంచి తెలంగాణ ఉద్య మం దాకా కార్మిక క్షేత్రంలోనే ఉన్నాం. అనేక పోరా టాలతో కార్మికులకు పరిహారం, వేతనాలు, సౌకర్యాలు మెరుగయ్యాయి. ఇవేమీ వారికి తెలియదు. పెద్దపల్లి ప్రాంత ప్రజలు ఐదుసార్లు ఆ కుటుంబం నుంచే ఎంపీగా గెలిపించారు. వెంకటస్వామి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడూ ఈ ప్రాంతానికి ఏం చేయలేదు. పరిశ్రమలు ఇతర చోట్ల స్థాపించి ఇక్కడి యువతకు అన్యాయం చేస్తున్నారు. అధికారమే ఆ కుటుంబం పరమావధి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే ‘గడ్డం’ కుటుంబం అధికారమే పరమావధిగా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇలా తరచూ పార్టీలు మారారు. బీజేపీలో చేరినప్పుడు కాంగ్రెస్ వాదిగా ఉన్న గడ్డం వెంకటస్వామి ఆత్మ ఘోషించి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉంటారో లేదోనని ఇప్పటికే ప్రచారం మొదలైంది. పెద్దపల్లి పరిధిలో తాత నుంచి మనవడి దాకా పోటీలో ఉంటున్నారు. ఇ క్కడ ఎన్నో ఏళ్లుగా జెండా మోసే పార్టీ కార్యకర్తలు, నాయకులు, విద్యావంతులకు రాజకీయ అవకాశాలు రాకుండా దెబ్బతీస్తున్నారు. తాజాగా ‘కాకా’ మనవడంటూ ఇక్కడి ప్రజలపై ఓ బడా పారిశ్రామికవేత్తను తెచ్చి రుద్దుతున్నారు. అధికారమే లక్ష్యంగా, నిబద్ధత లేని వారికి ఓటు వేయాలా..? అని ప్రశ్నిస్తున్నా. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటే.. సింగరేణి ప్రైవేటీకరణ, కార్మికుల కష్టాలు తీర్చని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటే. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీల అభ్యర్థులు సహకరించుకుంటున్నారు. కేంద్రం ఇవ్వాల్సిన ఐటీఐఆర్, బయ్యా రం ఉక్కు పరిశ్రమ, నవోదయ స్కూళ్లు ఏవీ ఇవ్వలేదు. తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపారు. ప్రధాని మోదీ ప్రైవేటీకరణ చేయబోమని చెప్పి సింగరేణిలో ఐదు బొగ్గు బ్లాక్లు వేలం వేశారు. కార్మికులకు ఆదాయ పన్ను మినహాయింపు ఇవ్వలేదు. తెలంగాణ కోసమే పుట్టిన బీఆర్ఎస్ ఎంపీలు ఉంటేనే సింగరేణిని కాపాడువచ్చని ప్రజలను కోరుతున్నా. -
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
దండేపల్లి: ఎండల తీవ్రత పెరుగుతుండడంతో జిల్లాలో భూగర్భ జల మట్టం మరింత లోతుకు పడిపోతోంది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో భూగర్భ జలశాఖ నివేదిక ప్రకారం భూగర్భ నీటిస్థాయి 6.26 మీటర్లు ఉండగా, రెండు నెలల్లో అంటే మార్చి, ఏప్రిల్ నెలల్లో 7.58 మీటర్ల లోతుకు పడిపోయింది. ఈ యేడాది జిల్లాలో ఫిబ్రవరి నెలాఖరు నుంచే నీటిమట్టం లోతుకు పడిపోవడంతో, యాసంగిలో వ్యవసాయబావులు, బోర్ల కింద పంటలు సాగు చేసిన రైతులు సాగునీటికి ఇబ్బందులు పడ్డారు. పంటలు చేతికచ్చే సమయంలో సాగునీటి కొరత ఏర్పడడంతో పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ బావుల్లో పూడిక తీయించి నీటి మట్టాన్ని పెంచుకునేందుకు కొందరు రైతులు భగీరథ ప్రయత్నాలు చేశారు. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మార్చిలో ఎండలు మండిపోయాయి. దీంతో భూగర్భ నీటి మట్టాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుత మే నెల ప్రారంభంలోనే జిల్లాలో 45 డిగ్రీల సెల్సియస్కుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడికి జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు భూగర్భ జలాలు మరితం దిగువకు పడిపోయయి. వర్షాలు కురవక.. జిల్లాలో 2023 వానకాలంలో సాధారణ వర్షపాతం 1070.2 మిల్లీమీటర్లకు గాను 1051.1 మిల్లీమీటర్లు నమోదైంది. సాధారణం కంటే 2 శాతం తక్కువగా కురిసింది. దీనికితోడు వేసవికి ముందు నుంచే ఎండల తీవ్రత పెరిగిపోవడం, సాగునీటి ప్రాజెక్టుల్లోను నీటి మట్టాలు భారీగా పడిపోవడంతో భూగర్భజలాలు వేగంగా పడిపోతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ప్రస్తుతం 6.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. దీంతో దండేపల్లి మండలం వెల్లనూర్ వరకు నిలిచి ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ పూర్తిగా తగ్గిపోవడంతో గోదావరి తీరాన్ని ఆనుకుని ఉన్న మంచినీటి బావుల్లో నీళ్లు అడుగంటుతున్నాయి. మూడు నెలలుగా పడిపోతున్న వైనం..మూడు నెలలుగా జిల్లాలో భూగర్భ జలాల తీరు..(లోతు..మీటర్లలో) మాసం భూగర్భ జలాల లభ్యత ఫిబ్రవరి 6.26 మీటర్లు మార్చి 6.96 మీటర్లు ఏప్రిల్ 7.58 మీటర్లు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement