-
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
● జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతిపెంచికల్పేట్: కేంద్ర ప్రభుత్వం ఆదివాసీల హ క్కుల జోలికొస్తే ఊరుకునేది లేదని జెడ్పీ మాజీ చైర్మన్ సిడాం గణపతి అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ఆదివాసీ, దళిత సంఘాల నా యకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం, గతంలో రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్ర భుత్వాలు ఆదివాసీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయ్యాయన్నారు. ఆదివా సీల అభివృద్ధికి ఏర్పాటు చేసిన ఐటీడీఏలను నిర్వీర్యం చేయడంతో పాటు ఆదివాసీలు ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూములను లాక్కున్నాయని ఆరోపించారు. ఆదివాసీలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు వారిని అడవుల నుంచి తరిమికొట్టేలా కార్పొరేట్ కంపెనీలకు కొమ్ముకాస్తున్నాయన్నారు. ఎన్నికల్లో ఆదివాసీలు కాంగ్రెస్ పక్షాన నిలబడి ఆదివాసీ సమాజం, రిజర్వేషన్లపైన వ్యాఖ్య లు చేస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఓటుతో బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రాజ్యాంగాన్ని కాపాడాలని వినతి పత్రం అందజేశారు. లహాన్రాజ్, కడాల నారా యణ, రాంటెంకి సురేష్, పెద్దు సుధాకర్, సిడాం తిరుపతి, భక్తు రాంచందర్, భుజంగరావు, శంకర్, అశోక్, రాజన్న, భాస్కర్ పాల్గొన్నారు. -
బాల్యవివాహాలను నియంత్రించాలి
ఆసిఫాబాద్అర్బన్: జిల్లాలో బాల్య వివాహాల నియంత్రణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ, వయోవృద్ధుల, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి భాస్కర్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో బాల్య వివాహాల నియంత్రణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలు సామాజిక సమస్య అని, సమాజ చైతన్యంతోనే నిర్మూలించవచ్చన్నారు. జిల్లాలో అనుసంబంధ శాఖలన్నీ సమన్వయంతో పని చేయడం ద్వారా బాల్య వివాహాల నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేసి బాల్య వివాహల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఆశ కార్యకర్తలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్వో తుకారాం, బాలల సంక్షేమ సమితి చైర్మన్ వెంకటస్వామి, డీఈవో అశోక్, డీపీవో సురేష్బాబు, బాలల సంక్షేమ సమితి సభ్యులు దశరథ్, సమీర్ ఉల్లాఖాన్, ఐకేపీ ఏపీడీ రామకృష్ణ, కార్మికశాఖ కమిషనర్ మాజర్ ఉన్నిసాభేగం, డీసీపీవో మహేష్, బాలరక్ష భవన్ సిబ్బంది, జిల్లా మహిళా సాధికారిత సిబ్బంది, సఖీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. -
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
కౌటాల: బీఆర్ఎస్తోనే గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని బీఆర్ఎస్ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 14 ఏళ్ల పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్క శంకర్, నాగపూరే బండు, చారి గోవింద్రావు, మంగేశ్, శంకర్, నాందేవ్, తదితరులు పాల్గొన్నారు. -
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఆదిలాబాద్ జిల్లాలో..● అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ బీఆర్ఎస్ అభ్యర్థి రామన్నపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం ఆయనే ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జీగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నియోజకవర్గంలో పార్టీని మరింత పటిష్టం చేయాలని అధిష్టానం ఆలోచించినప్పటికీ చేరికల విషయంలో కాంగ్రెస్ అసమ్మతి నాయకులు సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిలకు భంగపాటు ఎదురైంది. అయినప్పటికీ తాజాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా ప్రచారం చేస్తామని వారు ప్రకటించారు. ఇక బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పటి మాదిరి ఓట్లను గడించాలని ఎమ్మెల్యే శంకర్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే. ● బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా అనిల్ జాదవ్ బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై గెలుపొందారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ మూడో స్థానంలో నిలిచారు. ఆయనే నియోజకవర్గ ఇన్చార్జీగా కొనసాగుతున్నారు. కాగా బీఆర్ఎస్కు చెందిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, డాక్టర్ వన్నెల అశోక్ ఇటీవల కాంగ్రెస్లో చేరారు. ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కుకు మంచి మెజార్టీ ఇప్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో..● నిర్మల్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీహరిరావు ఇక్కడ మూడో స్థానంలో నిలిచారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇక్కడ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం మాజీ మంత్రి ఐకే రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. కొంత మంది ద్వితీయ శ్రేణి నాయకులు కూడా హస్తం గూటికి చేరారు. కాగా బీజేపీలోకి జెడ్పీ మాజీ చైర్పర్సన్ శోభ సత్యనారాయణ గౌడ్ దంపతులు చేరారు. బీజేఎల్పీ నేతగా ఉన్న మహేశ్వర్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల నాటి ప్రభావం ఈ నియోజకవర్గంలో తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. దీంతో ఆయన ప్రచారంలో వేగం పెంచారు. ● ముధోల్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డిపై గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి నారాయణరావు పటేల్ మూడో స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల తర్వాత ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో భారీగా మార్పులు చోటుచేసుకున్నాయి. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిలు కాంగ్రెస్లో చేరారు. ఇక్కడ ముథోల్ బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్కు ప్రతిష్టాత్మకంగా మారింది. తన ప్రత్యర్థులంతా కాంగ్రెస్లో కలవడంతో ఇప్పుడు ఆయన ఈ ఎన్నికలను సవాలుగా తీసుకోవాల్సిన పరిస్థితి. ● ఖానాపూర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు బీఆర్ఎస్ అభ్యర్థి భుక్యా జాన్సన్ నాయక్పై గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి రాథోడ్ రమేశ్ మూడో స్థానంలో నిలిచారు. ఇక్కడ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పైడిపల్లి రవీందర్రావు ఇటీవలే కాంగ్రెస్లో చేరారు. కాగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన ఏకై క నియోజకవర్గం ఇదే. దీంతో ఈ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మంచి మెజార్టీ తీసుకురావాల్సిన బాధ్యత ఎమ్మెల్యే బొజ్జుపై ఉంది.సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ సెగ్మెంట్లో పార్టీ గెలుపు ఒక లెక్క అయితే.. తమ నియోజకవర్గంలో అభ్యర్థికి అత్యధిక ఓట్లు సాధించడం మరో లెక్క. ఎమ్మెల్యేలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది. దీంతో తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఆదరించినట్టే ఇప్పుడు తమ పార్టీకి వెన్నంటి నిలుస్తారా.. లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయోనని ఆలోచన చేస్తున్నారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ప్రధానంగా అధికార కాంగ్రెస్లో చేరికలు పెరిగాయి. ఆ ప్రభావం ఏ విధంగా ఉంటుందనేది ఈ ఎన్నికల్లో స్పష్టం కానుంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో.. ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్నాయక్పై గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి మూడో స్థానంలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దగా మార్పులు చేర్పులు జరగలేదు. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి సక్కుకు ఇక్కడినుంచి మంచి మెజార్టీ కల్పించిన పక్షంలో అది ఉపయుక్తంగా ఉంటుందనేది పార్టీ భావన. ఈ నేపథ్యంలో కోవ లక్ష్మి మరింత శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిర్పూర్ ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి పాల్వాయి హరీశ్బాబు బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్పపై గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కోనప్ప కాంగ్రెస్ లో చేరగా ఇక్కడ ఆ పార్టీ పటిష్టమైంది. బీఆర్ఎస్ మరో నేత అరిగెల నాగేశ్వర్రావు కూడా హస్తం గూటికి చేరారు. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే హరీష్బాబు పార్టీ అభ్యర్థి నగేశ్కు మంచి మెజార్టీ సాధించేందుకు గట్టిగా కృషి చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
న్యూస్రీల్
నేడు రౌండ్ టేబుల్ సమావేశం ఆసిఫాబాద్అర్బన్: ప్రజాస్వామ్య పరిరక్షణకు నేడు సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ జనసమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి బాబన్న మంగళవారం ఒక ప్రకటనలో తెలి పారు. సమావేశానికి ముఖ్య అతిథిగా టీజేఎ స్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. సమావేశానికి ప్ర జాస్వామికవాదులు, ప్రజా సంఘాల నేతలు, అభ్యుదయవాదులు అధికసంఖ్యలో హా జరై విజయవంతం చేయాలని కోరారు. ‘బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం’ ఆసిఫాబాద్అర్బన్: బీజేపీతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని ఎమ్మార్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి రేగుంట మహేష్ అన్నారు. మంగళవారం మండలంలోని బాబాపూర్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ తరపున ఎన్నిల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగానికి రక్షణ కవచం నరేంద్రమోదీ అని, రిజర్వేషన్లు కాపాడుతున్న పార్టీ బీజేపీ అని అన్నారు. మాదిగలకు వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తున్న రేవంత్రెడ్డికి రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఇరిగినాల సురేష్, ఇగురపు శ్రీకాంత్, సిద్దార్థ, లింగయ్య, లక్ష్మి, కమల, పోషక్క పాల్గొన్నారు. ‘అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తా’జన్నారం: దేశాభివృద్ధి, నరేంద్రమోదీని మూ డోసారి ప్రధాని చేయడం కోసం ఆదరించి త నను గెలిపిస్తే అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తానని ఆదిలాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి గెడం నగేశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో మాజీ ఎంపీ రాథోద్ రమేశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, కార్యకర్తలతో ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. పొనకల్ వారసంతలో ప్రచారం చేసి ప్ర జలను ఓట్లు అభ్యర్థించారు. అనంతరం మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశంలో మా ట్లాడుతూ బూత్ స్థాయిలో కార్యకర్తలు ఓటర్ల ను కలిసి బీజేపీ ఓట్లు పడేలా కృషి చేయాలని అన్నారు. నాయకులు, కార్యకర్తలు ఎన్నికలు పూర్తయ్యే వరకు కష్టపడాలని కోరారు. మధుసూదన్రావు, శంకరయ్య పాల్గొన్నారు. పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలి ఆసిఫాబాద్: లోకసభ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉ ద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్ట ర్ వెంకటేశ్ దోత్రే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 3 నుండి 8 వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలని, జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయంతో పాటు కాగజ్నగర్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలేటేషన్ కేంద్రాల్లో పోస్టల్ బ్యాలెట్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బుధవారం చివరి రోజు కావడంతో ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement