-
మతతత్వ శక్తులను ఓడించండి
ఖమ్మం వన్టౌన్: మతతత్వ, ఫాసిస్ట్ శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా, రాహుల్ ప్రధాని పదవిని సైతం వదులుకున్నారన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రఘురాంరెడ్డి కుటుంబం ప్రజలందరికీ తెలుసునని, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాకే అధినాయకత్వం ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత పోతినేని మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకుని మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నామని కూనంనేని వెల్లడించగా, భువనగిరి తప్ప మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్కు మద్దతు ఉంటుందని సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనది ఖమ్మం జిల్లానేనని.. ప్రజలు, ప్రభుత్వ అవసరాల కోసం ఏళ్ల క్రితమే తమ భూములు ఇచ్చామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
హామీలు అమలు చేస్తే..రాజీనామా చేస్తా..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఖమ్మం: ‘వందరోజుల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి.. మళ్లీ వచ్చే ఆగస్టు 15 తేదీలోగా చేస్తానని రేవంత్రెడ్డి నయా నాటకం మొదలుపెట్టిండు. మిస్టర్ రేవంత్రెడ్డి ఆగస్టు 15వ తారీఖులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా? నువ్వు పార్టీ రద్దు చేసుకుంటవా అని రేవంత్రెడ్డి నన్ను అంటున్నడు. ఖమ్మం నుంచి మళ్లీ చెబుతున్నా. నేను సవాల్ను స్వీకరిస్తున్నా.ఇచ్చిన మాట ప్రకారం వడ్డీతో సహా రూ.39వేల కోట్లు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా? ఈనెల 26న ఉదయం 10గంటలకు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వద్దకు వస్తా, నువ్వు రా. అక్కడ బాండ్ పేపర్పై రాసి ప్రమాణం చేయి. నువ్వు అమలు చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేస్తా. మళ్లీ పోటీ కూడా చేయను. అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా’అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.బుధవారం సంగారెడ్డిలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి తీరును విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్రెడ్డిది పూటకోసారి మాట మార్చడం ఆయన నైజం అన్నారు. రేవంత్ తొండి రాజకీయం చేస్తున్నారన్నారు.ఆరు గ్యారంటీలు, 13 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నానని సోనియా సంతకాలతో బాండు పేపర్లు రాయించి పంపిణీ చేశారని. రాహుల్, ప్రియాంకగాం«దీలతో ప్రకటన చేయించారని గుర్తు చేశారు. 120 రోజులు గడుస్తున్నా, హామీలు అమలు చేయకుండా ఇప్పుడు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్మేలా లేక దేవుడిని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గార్యంటీల అమలుకు శాసనసభ తొలి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, మడమ తిప్పారని, రూ.2లక్షల రుణమాఫీకి విధివిధానాలనే ఖరారు చేయలేదని, మరోమారు గడువు పెడుతున్న రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకం కింద ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న సాయం 4 నెలలుగా ఇవ్వకుండా ఒక్కో మహిళకు రూ.పది వేల బాకీ పడ్డారని, కల్యాణలక్ష్మి లబి్ధదారులకు తులం బంగారం, రైతుభరోసా సాయం ఎకరానికి రూ.15 వేలు, వరికి క్వింటాల్కు రూ.500 బోనస్, పెంచిన పింఛన్లు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, నిరుద్యోగభృతి నెలకు రూ.4 వేలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఎం, సీపీఐ ఎందుకు ఊడిగం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయా పార్టీల నేతలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు. -
బాలారిష్టాలు దాటని హబ్
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ హబ్లో రకరకాల కొరతతో తరచూ పరీక్షలు నిలిచిపోతున్నాయి. రసాయనాల కొరత, యంత్రాల్లో లోపాలతో ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో సిబ్బందికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి శాంపిళ్లు తీసుకొస్తున్నా లక్ష్యం మేరకు పరీక్షలు జరగడం లేదు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ నెలకొల్పారు. తొలుత 57 రకాల పరీక్షలు నిర్వహించగా క్రమంగా వాటి సంఖ్య పెంచడంతో ప్రస్తుతం 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ కొంత కాలంగా టెస్టులకు రసాయనాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్ని పరీక్షలు జరగడం లేదు. ఇటీవల రసాయనాల సరఫరా పూర్తిగా నిలిచిపోగా కొన్ని రోజుల పాటు పరీక్షలే నిలిచిపోయాయి. దీంతో అధికారులు మహబూబాబాద్, వరంగల్ ఆస్పత్రుల నుంచిరసాయనాలు తెప్పించి పని కానిచ్చేశారు. ఇదే పరిస్థితి తరచుగా ఎదురవుతుండడంతో అవసరమైన పరీక్షలు జరగక సామాన్యులు మళ్లీ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. తొలినాళ్లలో మంచి స్పందన డయాగ్నస్టిక్ హబ్కు తొలి నాళ్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో 57 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం అదనంగా మరో 77 రకాల పరీక్షలను గత ఏడాది ప్రభుత్వం చేర్చింది. ఇలా 134రకాల పరీక్షలు చేయాల్సి ఉన్నా ఖమ్మం హబ్లో సగానికి కంటే తక్కువ పరీక్షలే జరుగుతున్నాయి. తరచూ రసాయనాల కొరత, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, యంత్రాల మరమ్మతులు వంటి కారణాలతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సాధారణంగా హబ్లో ప్రతీ గంటకు 1,520 పరీక్షలు చేస్తారు. ఇందులో కెమిస్ట్రీ అనలైజర్ మిషన్ ద్వారా 1,200, ఇమ్యునో అనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా గంటకు వంద పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆ స్థాయిలో జరగడంలేదు. 45 ఆస్పత్రుల నుండి శాంపిళ్లు జిల్లాలోని 45 ప్రభుత్వ ఆస్పత్రుల నుండి ఖమ్మం పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్కు నిత్యం శాంపిల్స్ వస్తుంటాయి. పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో సేకరించిన శాంపిళ్లను వాహనాల్లో ఇక్కడకు తీసుకొస్తారు. ఇందుకోసం ఐదు రూట్లలో వాహనాలు తిరుగుతుంటాయి. అనంతరం హబ్లో పరీక్షలు చేసి 24గంటల్లోగా బాధ్యుల సెల్ఫోన్కు రిపోర్టు పంపిస్తారు. కానీ కొంత కాలంగా అనుకున్న స్థాయిలో పరీక్షలు జరగకపోగా... అవసరమైన వారు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సివస్తోంది. ప్రస్తుతం హబ్లో సీబీపీ, గర్భిణులకు నిర్వహించే కోయోగ్లేషన్ టెస్టులు, ఇతర అవసరమైన టెస్టులు అందుబాటులో లేవని సమాచారం. అన్ని పరీక్షలు జరిగేలా చర్యలు డయాగ్నస్టిక్ హబ్లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రసాయనాల కొరతతో అప్పుడప్పుడు కొంత ఏర్పడుతుండడంతో ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హబ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగేలా చూస్తున్నాం. డాక్టర్ బి.అమర్సింగ్, ఆర్ఎంఓ, ఖమ్మం జనరల్ ఆస్పత్రి తరచుగా పరీక్షలకు అంతరాయాలు పేరుకు 134 పరీక్షలు.. అందేవి అంతంతే ఖమ్మం డయాగ్నస్టిక్ హబ్లో రసాయనాల లేమితో ఇక్కట్లు సిబ్బంది కొరత, యంత్రాల మరమ్మతులతో ఇంకొంత సమస్య -
గులాబీకి సవాల్..
ఖమ్మం లోక్సభ ఎన్నిక బీఆర్ఎస్కు సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించడం ఎదురీతకు కారణమవుతోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఇక్కడ విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సర్వశక్తులొడ్డుతున్నా ఫలితం ఎలా ఉండబోతోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంనాడు అధికారంలో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. దీంతో 1,68,065 ఓట్ల మెజార్టీతో నామ విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నాడు 14.74 శాతం ఓట్ల వ్యత్యాసం వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధి ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 5,18,194 ఓట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో నామాకు 49,265 ఓట్లు మాత్రమే అదనంగా నమోదయ్యాయి. ఇప్పుడు భారీ వ్యత్యాసం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్తో పాటు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థులకు 7,33,293 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తద్వారా కాంగ్రెస్ కూటమి 2,65,654 ఓట్ల మెజార్టీని సాధించినట్లయింది. ఈ గణాంకాలను పరిశీలిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది. ఖమ్మం లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎదురీత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు ఆ పార్టీతో పోలిస్తే ‘కారు’కు 2.65 లక్షల ఓట్ల వ్యత్యాసం ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపోనని ఉత్కంఠపట్టు దొరికేది ఎక్కడ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజకవర్గంలో 49,381 ఓట్ల మెజార్టీ, పాలేరులో 56,650 మెజార్టీ, సత్తుపల్లిలో 19,440 ఓట్లు, మధిరలో 35,452 ఓట్ల మెజార్టీ, వైరాలో 33,045 ఓట్లు, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 42,781 ఓట్ల మెజార్టీ, అశ్వారావుపేటలో 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ అభ్య ర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక పోయారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీ రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ పరిధిలో ఎలా ఓట్లు దక్కించుకోవాలి, ఎక్కడ పట్టు దొరుకుతుందనే లెక్కల్లో బీఆర్ఎస్ నేతలు మునిగితేలుతున్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు.. నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖమ్మం 1,36,016 86,635 పాలేరు 1,27,820 71,170 సత్తుపల్లి 1,11,245 91,805 మధిర 1,08,970 73,518 వైరా 93,913 60,868 కొత్తగూడెం (సీపీఐ) 80,336 37,555 అశ్వారావుపేట 74,993 46,088 మొత్తం 7,33,293 4,67,639 -
కలెక్టర్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం క్రైం/ఖమ్మం మయూరిసెంటర్: ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 938వ ర్యాంక్ సాధించిన బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)కు చెందిన సాయి అలేఖ్య సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వీ.పీ.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ సత్కరించారు. ఆతర్వాత సీపీ సునీల్దత్ను కూడా కలవగా ఆయన సాయిఅలేఖ్యతో పాటు ఆమె తండ్రి మధిర టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాశ్రావు – పద్మశ్రీ దంపతులను సన్మానించారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక సాయి అలేఖ్యను ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్లో సత్కరించారు. స్టడీసర్కిల్లో గ్రూప్స్, డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటుచేయగా.. ఆమె పాల్గొని ఉద్యోగాలకు సన్నద్ధతపై సూచనలు చేశారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, సాయిఅలేఖ్య చదువుకున్న త్రివేణి పాఠశాల, సెంచరీ స్కూల్లో కూడా ఆమెను సన్మానించారు. త్రివేణి డైరెక్టర్లు గొల్లపుడి వీరేంద్రచౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్తో పాటు సీహెచ్.అప్పారావు, స్వప్న, ముస్తఫా, అశోక్, చార్లెస్, సందీప్, సెంచరీ స్కూల్లో కరస్పాండెంట్ డీవీఎస్.ప్రభాకర్రావు, డైరెక్టర్ మాధవీలతతో పాటు స్వరూప, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాయిఅలేఖ్యను సన్మానించిన కలెక్టర్, సీపీ
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement