-
దుర్వాసనపై వైఎస్సార్సీపీ యుద్ధం
కల్లూరు రూరల్, న్యూస్లైన్: కర్నూలు నగరం పాతబస్తీ ప్రజలను ఇబ్బంది పెడుతున్న దుర్వాసనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ప్రారంభించింది. ఆ పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్రెడ్డి ఆధ్వర్యంలో శనివారం పాతబస్తీ ప్రజలు ఉద్యమించారు. వన్టౌన్, ఉస్మానియా మలుపు, కుమ్మరిగేరి చౌరస్తాల ప్రాంతాల్లో మానవహారంగా ఏర్పడి రహదారులను దిగ్బంధం చేశారు. వన్టౌన్ పోలీస్స్టేషన్ కూడలిలో ఎస్వీ మోహన్రెడ్డి బైఠాయించారు. పార్టీ నాయకులు, స్థానికు లు, మహిళలు మూడుచోట్లా రెండు గంట లపాటు రహదారులను దిగ్బంధం చేశారు. ‘ బచావో బచావో.. ఏ బాస్ సే బచావో’ అంటూ ముస్లింలు నినాదాలతో మార్మోగించారు. అలాగే ‘కర్నూలును మరోభోపాల్ చేయకండి, ఆల్కాలీస్ ఫ్యాక్టరీని సీజ్ చేయాలి’ అంటూ నినదించారు. ఈ సందర్భంగా ఎస్వీ మోహన్రెడ్డి మాట్లాడుతూ.. దుర్వాసనతో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రజారోగ్యంతో చెలగాటం ఆడొద్దని సూచించారు. దుర్వాసన ఫ్యాక్టరీది కాదంటూ వివరణ ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. రహదారుల దిగ్బంధంతో రాకపోకలు ఆగిపోవడంతో వన్టౌన్ పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆందోళన విరమించాలని వైఎస్సార్సీపీ నాయకులను కోరారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు కదిలేది లేదని భీష్మించుకొని కూర్చోవడంతో ఎస్వీ మోహన్రెడ్డితో పాటు మరో పదిమంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేసి త్రీటౌన్ పోలీస్స్టేషన్కు తరలించారు. గంట తర్వాత సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. అరెస్టుకు నిరసనగా వన్టౌన్ పోలీస్స్టేషన్ ఎదుట మంత్రి టీజీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు తెర్నేకల్ సురేందర్రెడ్డి, తోట వెంకటకృష్ణారెడ్డి, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మునీర్ అహ్మద్, సలీం, నగర కన్వీనర్ బాలరాజు, మైనారిటీసెల్ నగర కన్వీనర్ షరీఫ్, యువజన విభాగం నగర కన్వీనర్ రాజా విష్ణువర్ధన్రెడ్డి, ఎస్సీసెల్ జిల్లాకన్వీనర్ కిషన్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నారాయణమ్మ, మాజీ కార్పొరేటర్ పులిజాకబ్, మైనారిటీ నాయకులు బి.జహీర్అహ్మద్ఖాన్, ఎం.ఎ.హమీద్, పి.టి.మురళి, కంఠు తదితరులు పాల్గొన్నారు. -
పుల్లారెడ్డి, సరస్వతి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
పులివెందుల/రూరల్, న్యూస్లైన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్మోహన్రెడ్డి కచేరి రోడ్డులోని ఆర్యవైశ్య సంఘం నాయకుడు మిట్టా విశ్వనాథం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇటీవలే విశ్వనాథం తల్లి సరస్వతి మృతి చెందిన నేపథ్యంలో జగన్ వారింటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఈ మధ్యనే అనారోగ్యంతో మృతి చెందిన చిన్నరంగాపురం మాజీ సర్పంచ్ పుల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్ను చూడగానే రోదిస్తున్న మృతుని భార్య పద్మావతి, కుమార్తెలు గౌరి, తులసి, బుజ్జి ఇతర కుటుంబ సభ్యులను ఓదార్చారు. అంతకుమునుపు పుల్లారెడ్డితోపాటు దివంగత సీఎం వైఎస్ఆర్ చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పుల్లారెడ్డి కుటుంబాన్ని అన్నివిధాలుగా ఆదుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. తర్వాత బాకరాపురంలో ఇటీవలే వివాహమైన అంబకపల్లె మల్లికార్జునరెడ్డి కుమార్తె అనుజ, రాకేష్రెడ్డి దంపతులను వైఎస్ జగన్ ఆశీర్వదించారు. సీఎస్ఐ చర్చి నుంచి వైఎస్ జగన్ బయటకు వచ్చిన తర్వాత చిన్నరంగాపురం, బాకరాపురం కాలనీల్లో ప్రజలు వైఎస్ జగన్కు ఘనస్వాగతం పలికారు. పలువురు తమ సమస్యలు ఏకరువు పెట్టారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు అందరి సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన హామీ ఇచ్చారు. కిటకిటలాడిన క్యాంపు కార్యాలయం : పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయం బుధవారం కార్యకర్తలు, నాయకులు, అభిమానులతో కిటకిటలాడింది. మధ్యాహ్నం నుంచి వైఎస్ జగన్రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజలకు అందుబాటులోకి ఉండి వారి సమస్యలను సావధానంగా విన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్ను వైఎస్ జగన్ ఆవిష్కరించారు. వివిధ ప్రాంతాలకు చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్ను కలిశారు. వైఎస్ జగన్ను అభినందించిన కడప న్యాయవాదుల జేఏసీ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ఊపిరిగా భావించి రాష్ట్రం కోసం పోరాడుతున్న వైఎస్ జగన్రెడ్డిని కడప బార్ ఆసోసియేషన్ అధ్యక్షుడు రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు తరలి వచ్చి కలిశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement