-
నేడు సుప్రీంలో ‘ఓటుకు నోటు’ విచారణ
న్యూఢిల్లీ, సాక్షి: దాదాపు దశాబ్దం కిందట.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు రేపిన ఓటుకు నోటు కేసు నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుముల రేవంత్ రెడ్డి.. ప్రస్తుతం ముఖ్యమంత్రి గా ఉండడంతో ఈ కేసు విచారణ వేరే ప్రాంతానికి బదిలీ చేయాలంటూ పిటిషన్ దాఖలైన సంగతి తెలిసే ఉంటుంది.బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ బి.ఆర్ గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం విచారణ జరపనుంది.2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నాటి టీడీపీ నేత రేవంత్రెడ్డిని ఇందుకు మధ్యవర్తిగా నియమించారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బు ఇస్తూ రేవంత్ తెలంగాణ ఏసీబీకి రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. తదనంతర పరిణామాల్లో.. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు.చంద్రబాబు ప్రలోభ పర్వాన్ని తెలంగాణ ఏసీబీ బయటపెట్టింది. ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’’ అని చంద్రబాబున్నారు. ఆ గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ సైతం నిర్ధారించింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల గడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఏసీబీ ఈ కేసు ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించింది. అయినా కూడా ఆయన పేరును నిందితుడిగా చేర్చకపోవడాన్ని ఆర్కే తన పిటిషన్ ద్వారా లేవనెత్తారు.సంబంధిత వార్త: అందుకే సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేయాలి -
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు
-
బీజేపీ కనుసన్నల్లో ఎన్నికల కమిషన్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను కూడా గుప్పిట పెట్టుకుని ఆడిస్తోందని.. ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా బీజేపీ కనుసన్నల్లో పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధంతో ఎన్నికల కమిషన్ వైఖరి బయటపడిందని విమర్శించారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘జాతులు, మతాల ఆధారంగా స్వయంగా ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైషమ్యాలు రెచ్చగొడుతూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలను తిడుతూ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా బీజేపీ విషం చిమ్ముతోంది. బీజేపీ కాకుండా ఇతరులు అధికారంలోకి వస్తే.. సంపదను ఎక్కువ పిల్లలున్న ముస్లింలకు దోచిపెడతారంటూ వారు వ్యాఖ్యలు చేస్తున్నా ఈసీ నుంచి ఉలుకూపలుకూ లేదు. ఆ వ్యాఖ్యలపై 20వేల మందికిపైగా పౌరులు ఈసీకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే ధైర్యం లేక.. మోదీకి బదులుగా బీజేపీ అధ్యక్షుడు నడ్డాకు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల్లో దేవుడు, మతాన్ని ప్రస్తావించడం నేరమని తెలిసీ.. అమిత్ షా, పలువురు బీజేపీ నేతలు శ్రీరాముడి ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు. అయినా వారికి నోటీసులు, చర్యలు లేవు. వ్యక్తిత్వ హననాలు, వ్యక్తిగత దూషణలు ఈసీకి కనిపించడం లేదు. కేసీఆర్పై రాకెట్ వేగంతో చర్యలు తీసుకున్న ఎన్నికల కమిషన్ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే.. మోదీ, రేవంత్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాజ్యాంగాన్ని అపహాస్యం చేసేలా ఈసీ వైఖరి ఉంది. ఒక పార్టీ, కొందరు నాయకులు ఆధీనంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఆ మాటలేమైనా ప్రవచనాలా? ‘నిరోధ్లు, పాపడాలు అమ్ముకోండి..’అంటూ కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసీఆర్ ఒక్క మాట మాట్లాడితే.. 48 గంటల పాటు మాట్లాడకుండా గొంతు నొక్కారు. బీఆర్ఎస్ నుంచి సీఎం రేవంత్పై ఎనిమిది ఫిర్యాదులు.. మంత్రులు ఉత్తమ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ తదితరుల వ్యాఖ్యలపై 27 ఫిర్యాదులు చేసినా ఈసీ స్పందించలేదు. ఏప్రిల్ 10న తుక్కుగూడ సభలో రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఈసీకి ప్రవచనాలు, సుభాíÙతాలు, సూక్తుల్లా కనిపించాయా? రేవంత్ మాటలను ఉటంకించడానికి సంస్కారం అడ్డువస్తోంది. అలాంటి వ్యాఖ్యలపై ఈసీ చర్యలేవి? కూడబలుక్కుని నిషేధం పెట్టారు కేసీఆర్ బస్సుయాత్రతో కాంగ్రెస్, బీజేపీలకు దడ పుట్టింది. ప్రజలు కేసీఆర్కు బ్రహ్మరథం పడుతున్నారనే వార్తలు, నిఘా సంస్థల నివేదికలు వారికి కంటగింపుగా మారాయి. బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని సర్వేలు చెప్తుండటం, జన స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదు. దీంతో బడే భాయ్ మోదీ, చోటే భాయ్ రేవంత్ కూడబలుక్కుని కేసీఆర్ ప్రజల వద్దకు వెళ్లకుండా నిషేధం పెట్టారు. ఈ అప్రజాస్వామిక ప్రయత్నాలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి. స్వేచ్ఛాయుత వాతావరణంలో, పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్.. కేసీఆర్ ప్రచారాన్ని నిషేధించింది. కొందరిని మాత్రం ప్రజలు, ప్రత్యర్థుల మీదకు అచ్చోసిన ఆంబోతుల్లా వదిలేసింది.రేవంత్పై క్రిమినల్ కేసు పెట్టాలి హాస్టళ్ల మూసివేతపై ఉస్మానియా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ గతేడాది ఇచ్చిన సర్క్యులర్, స్టాంప్ను ఫోర్జరీ చేసి ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేసిన సీఎం రేవంత్రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి. ఉస్మానియా వర్సిటీ చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దాంతో ఓయూ చీఫ్ వార్డెన్కు రిజి్రస్టార్, సదరన్ డిస్కం నుంచి నోటీసులు ఇప్పించారు. అంతటితో ఆగకుండా గత ఏడాది చీఫ్ వార్డెన్ ఇచ్చిన సర్క్యులర్ను రేవంత్ పోస్ట్ చేసి ప్రజలను తప్పుదోవ పట్టించారు. రేవంత్ ఫోర్జరీ డాక్యుమెంట్ను ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ను పోలీసులు అరెస్టు చేశారు. క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ తప్పు అని ఓయూ అధికారులు నిరూపిస్తే.. చంచల్గూడ జైలుకు వెళ్లేందుకు నేను సిద్ధం. రేవంత్పై ఓయూ విద్యార్థులు చేసిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయాలి. ఈసీ నిజంగా స్వతంత్ర సంస్థ అయితే రేవంత్పై చర్యలు తీసుకోవాలి’’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. -
ఢిల్లీ సుల్తాన్లను ఎదిరిస్తాం: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి, సిద్దిపేట/ కుత్బుల్లాపూర్: దేశంలో రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసి కుట్ర చేస్తున్నాయని టీపీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి మరోసారి ఆరోపించారు. తాను పది రోజులుగా ఈ విషయంపై మాట్లాడుతున్నందుకు ఢిల్లీ పోలీసులతో కేసు పెట్టించారని మండిపడ్డారు. ఇలాంటి అక్రమ కేసులకు తాను భయపడబోనన్నారు. ఢిల్లీ సుల్తానులను సైతం ఎదిరించే శక్తి తనకు ఉందని, ఇకపై బీజేపీ ఆటలు సాగబోవని వ్యాఖ్యానించారు. తెలంగాణను అభివృద్ధి చేయకుండా ప్రధాని మోదీ గాడిద గుడ్డు ఇచ్చారని విమర్శించారు. గురువారం కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘జనజాతర సభ’, సిద్దిపేటలో రోడ్ షో, కార్నర్ మీటింగ్, మల్కాజిగిరి లోక్సభ స్థానం పరిధిలోని కుత్బుల్లాపూర్లో రోడ్ షోలలో రేవంత్రెడ్డి ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెల్లదొరల కాలం 1881 నుంచీ ప్రతీ పదేళ్లకో సారి దేశ జనాభాను లెక్కించారు. 2021 వరకు కొనసాగింది. కానీ బీజేపీ జనాభా లెక్కలను పక్కనపెట్టింది. రాహుల్ గాంధీ బలహీన వర్గాలకు రిజ ర్వేషన్లు పెంచుతామని చెబుతోంటే.. రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. అందుకే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా జనాభా గణన చేపట్టలేదు. లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు తొలగించాలని చూస్తున్నారు. ఆ మార్పును దేశంలోని 15 రాష్ట్రాలు ఆమోదించాల్సి వస్తుంది. అందుకే ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే 8 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టారు. బీజేపీకి ఓటు వేస్తే, అది రిజర్వేషన్లపై పోటు పొడవబోతోంది. తిరగబడి కొట్లాడుతా.. బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలసి రిజర్వేషన్ల రద్దుకు కుట్ర చేస్తున్న విషయంపై పది రోజులుగా నేను మాట్లాడుతుంటే.. ఢిల్లీ పోలీసులతో నాపై కేసు పెట్టించారు. నాపై గత పదేళ్లలో 200 కేసులు పెట్టారు. చంచల్గూడ జైలుకు పంపారు. అలాంటి అక్రమ కేసులకు భయపడబోం. ఢిల్లీ సుల్తానులను సైతం ఎదిరించే శక్తి మాకు ఉంది. ఇకపై బీజేపీ ఆటలు సాగవు. తిరగబడి కొట్లాడుతా. తెలంగాణకు మోదీ ఏం ఇచ్చారు? బీజేపీ ఏం తెచ్చింది? ‘గాడిద గుడ్డు’ ఇచ్చింది. బయ్యారం ఉక్కు పరిశ్రమ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ కారిడార్, ఐఐటీ, పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా కావాలని కేంద్రాన్ని కోరితే గాడిద గుడ్డు ఇచ్చింది. 2014 ఎన్నికల సమయంలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ.. ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారు. రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని చెప్పి.. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలు చేశారు. 700 మంది రైతులను పొట్టన పెట్టుకున్నారు. గత డిసెంబర్లో కేసీఆర్కు రాష్ట్ర ప్రజలు బాయ్ బాయ్ చెప్పారు. మేలో జరిగే లోక్సభ ఎన్నికల్లో మోదీకి బాయ్ బాయ్ చెప్పాలి. ఆదిలాబాద్ను ఎవరూ పట్టించుకోలేదు గత పదేళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి ఆదిలాబాద్ను పట్టించుకోలేదు. 1.5 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే ప్రాణహిత, కుమురంభీం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించలేదు. సోయం బాపురావును ఎంపీగా గెలిపిస్తే.. ఈ ప్రాంతానికి ఏమీ చేయలేదు. కాంగ్రెస్ది పేదల ప్రభుత్వం. ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఐదింటిని ఇప్పటికే అమలు చేశాం. పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కేసీఆర్ పాలనను ప్రజలు బండకేసి కొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గతంలో కేసీఆర్ పేద ప్రజలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తానని చెప్పి వ్యాపారం చేశారు. పదేళ్లపాటు రాష్ట్రాన్ని దోచుకుని దివాళా తీయించిన కేసీఆర్ కుటుంబానికి చర్లపల్లి జైలులో డబుల్ బెడ్రూం ఇంటిని సిద్ధం చేస్తున్నాం’’ అని రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఆదిలాబాద్, మెదక్, మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థులు ఆత్రం సుగుణ, నీలం మధు, సునీతా మహేందర్రెడ్డిలను లక్ష ఓట్లకుపైగా మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఆసిఫాబాద్ సభలో మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్.. సిద్దిపేట కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం.. కుత్బుల్లాపూర్ రోడ్ షోలో మల్కాజిగిరి కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మామా అల్లుళ్ల నుంచి సిద్దిపేటకు విముక్తి ‘‘మెదక్లో దొరల గడీలను బద్దలుకొడతాం. మామ కేసీఆర్, అల్లుడు హరీశ్రావు సిద్దిపేటను 45 ఏళ్లుగా పాపాల భైరవుల్లా పట్టిపీడిస్తున్నారు. వారి నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకే వచ్చా. హరీశ్రావు రాజీనామా లేఖ రాసిపెట్టుకో.. ఆగస్టు 15లోగా పక్కాగా రుణమాఫీ చేస్తాం.. సిద్దిపేటకు కొత్త ఎమ్మెల్యేను తెస్తా. ఇక్కడ లక్ష మంది రైతులతో సభ ఏర్పాటు చేస్తా. ఆగస్టు 15న సిద్దిపేటకు స్వాతంత్య్రం రాబోతోంది. ఈసారి ఆరునూరైనా మెదక్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలి. రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుని అక్రమంగా ఫాంహౌస్లు కట్టుకున్నోళ్లు కావాలా? మంచి చేసేవాళ్లు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈసారి కాంగ్రెస్ గెలవకపోతే ఉమ్మడి మెదక్ జిల్లాలో శాశ్వత బానిసత్వం వస్తుంది. ఇక్కడ పోటీ చేయకుండా పోలీసులతో కేసులు పెట్టించే పరిస్థితి వస్తుంది. కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారు. నిజాం వద్ద ఖాసీం రిజ్వీ ఎలాగో, కేసీఆర్ హయాంలో వెంకట్రామిరెడ్డి అలాగే. కరీంనగర్కు చెందిన వెంకట్రామిరెడ్డిని మెదక్ అభ్యర్ధిగా నిలబెట్టారు.’’ -
రిజర్వేషన్ల రద్దు నాటకం కాంగ్రెస్ కుట్రే
కరీంనగర్ టౌన్: తెలంగాణలో ఏ సర్వే చూసినా బీజేపీ అత్యధిక సీట్లు సాధిస్తుందని తేలడంతో రేవంత్రెడ్డికి భయం పట్టుకుందని, సీఎం సీటు పోతుందనే భయంతో రేవంత్రెడ్డి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతున్నా రని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీని, ఆర్ఎస్ఎస్ను బద్నాం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. రిజర్వేషన్ల రద్దు కోసమే 2000లో జస్టిస్ వెంకటాచలయ్య కమిషన్ను బీజేపీ ప్రభుత్వం నియమించిందన్నారు. ఆయనిచ్చిన రిపోర్టును కూడా తొక్కిపెట్టారని చెబుతున్న రేవంత్రెడ్డికి 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ అని తెలీదా? మరి ఆ రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని సంజయ్ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్లోని కమాన్చౌరస్తా వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన రోడ్షోకు వేలాది మంది తరలివచ్చారు. కేంద్రమంత్రి మురుగన్తోపాటు సంజయ్ పాల్గొని మాట్లాడారు. తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసి పార్టీని విస్తరించిన నాయకుడు మురుగన్ అని, ఆయన ఎంపీ కాకపోయినా దళితుడైన మురుగన్ సేవలను గుర్తించి నేరుగా కేంద్రమంత్రిని చేసిన ఘనత ప్రధాని మోదీదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు డిపాజిట్లు రావని, రెండోస్థానం కోసమే పోటీ పడుతున్నారని ఎద్దేవాచేశారు. పొన్నం, వినోద్కుమార్ కరీంనగర్కు ఏంచేశారో చెప్పాలన్నారు. ఇవి దేశ ప్రధానిని నిర్ణయించే ఎన్నికలని, ఈ దేశం అభివృద్ధి చెందాలంటే, సంక్షేమ పథకాలు అందాలంటే, దేశ రక్షణ కావాలంటే మోదీనే మళ్లీ ప్రధాని కావాలని సంజయ్ తెలిపారు. దేశమంతా కరీంనగర్లో బండి సంజయ్ను ఎంత మెజారిటీతో గెలిపిస్తారనే చర్చ జరుగుతోందన్నారు. తనను ఎంపీగా గెలిపించి మోదీని ప్రధానిగా ఎన్నుకునే అవకాశం కల్పించాలని కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?
సర్వీస్ అంటే ఇలా ఉంటుందా.. ఆశ్చర్యపోయిన ఆనంద్ మహీంద్రా
చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్
“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్
జితేందర్ రెడ్డి ట్రైలర్ విడుదల
వెళ్తూ వెళ్తూ...!
తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!
కేకేఆర్తో మ్యాచ్.. అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్
"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్
ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
తప్పక చదవండి
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
- భయపడకు.. పారిపోకు: రాహుల్పై ప్రధాని మోదీ సెటైర్లు
Advertisement