-
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
సాక్షి,తాడేపల్లి: చంద్రబాబు చెప్పిందే కేంద్రహోం మంత్రి అమిత్ షా ధర్మవరం సభలో మాట్లాడారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆదివారం(మే5) సజ్జల మీడియాతో మాట్లాడారు.‘పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం అని ఆనాడు మోదీ విమర్శించారు. పోలవరాన్ని చంద్రబాబు ఆదాయవనరుగా మార్చుకున్నారని అమిత్ షాకు తెలుసు. కూటమిలో పార్ట్నర్ కాబట్టే అమిత్ షా ధర్మవరంలో ఏదో మాట్లాడారు. పోలవరాన్ని టడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పూర్తి చేయలేదు? కేంద్రం సరిగ్గా నిధులిస్తే పోలవరం రెండేళ్ల కంటే ముందే పోలవరం పూర్తవుతుంది. పోలవరాన్ని సీఎం జగన్ పూర్తిచేసి చూపిస్తారు. ఆ శక్తి సీఎం జగన్కు ఉంది. పోలవరం ప్రాజెక్టులో సీఎం జగన్ రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.850 కోట్లు ఆదాచేశారు. కేంద్రం ముందుగానే నిధులను ఇస్తే సీఎం జగన్ ఎప్పుడో పోలవరాన్ని పూర్తి చేసేవారు. రూ.12 వేల కోట్లకు క్యాబినెట్ ఆమోదం లభించినా కేంద్రం నిధులివ్వలేదు. చంద్రబాబుతో బీజేపీ పొత్తు వల్ల జరిగిన నష్టాల్లో ఇది కూడా ఒకటి. రాష్ట్రానికి రావాల్సిన నిధులను కూడా నివ్వకుండా ఆపుతున్నారు.ల్యాండ్ టైట్లింగ్ యాక్టుపై తప్పుడు ప్రచారం..ల్యాండ్ టైట్లింగ్ యాక్టు గురించి చంద్రబాబు, పవన్ అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. కడుపులో ఇంత కుట్రలు ఉన్నందునే ఒళ్లంతా బాబు రోగాలతో ఉన్నాడు. చెత్తబుట్టలో,మురికిగుంటలో ఉండే క్రిములలాగా చంద్రబాబు బ్యాచ్ వ్యవహరిస్తున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలో భూ అక్రమాలు భారీగా జరిగాయి. అక్కడ ఇలాంటి చట్టం వస్తే రామోజీ అక్రమాలన్నీ బయటపడతాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తప్పుడు ప్రచారం వ్యవహారంలో చంద్రబాబు మీద సీఐడీ కేసు పెట్టటం హర్షనీయ పరిణామం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు, రామోజీరావు వంటివాళ్లు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలు కాకుండా రాక్షస ప్రయత్నం చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ మాఫియాకు ఊపిరాడకుండా చేస్తుందితప్పుడు ప్రచారాలు చేసే వారికి ఇదొక హెచ్చరికగా ఉండాలి.దోషులను సీఐడీ వెంటనే అరెస్టు చేయాలి.ఇంగ్లీషు మీడియం అనేది సంపన్నవర్గాలకే పరిమితం చేయాలని బీజేపీ కూడా చూస్తోంది. అందుకే అమిత్ షా కూడా చంద్రబాబు తరహాలోనే మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం పెట్టటం వల్ల తెలుగుకు ఎక్కడైనా నష్టం జరిగిందా’ అని సజ్జల ప్రశ్నించారు.టీడీపీ వక్రబుద్దిని బట్టబయలు చేసిన సజ్జలల్యాండ్ టైట్లింగ్ యాక్టు చాలా మంచిదని గతంలో అసెంబ్లీలో చెప్పిన టీడీపీ నేత పయ్యావుల కేశవ్పయ్యావుల వీడియోని బయట పెట్టిన వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిచాలా గొప్ప చట్టాన్ని తెస్తున్నారంటూ జగన్ని మెచ్చుకున్న పయ్యావుల2019 జులై 29న అసెంబ్లీ సాక్షిగా గొప్ప చట్టమని ప్రకటించిన పయ్యావులఆ వీడియోని బయట పెట్టిన సజ్జల రామకృష్ణారెడ్డి వీడియోని బయటపెట్టిన అనంతరం సజ్జల ఏమన్నారంటే..ల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణచంద్రబాబు రాజకీయ వ్యభిచారి అనటానికి ఇంకేం నిదర్శనం కావాలి?ల్యాండ్ టైటలింగ్ లాంటి పవిత్రమైన చట్టంపై బురద టీడీపీ నేతలు బురద చల్లారు2019 జులై 29వ తేదిన అసెంబ్లీలో టీడీపీ ల్యాండ్ టైటలింగ్ చట్టానికి మద్దతు ఇచ్చిందిల్యాండ్ టైటలింగ్ పై టీడీపీ దొంగ నాటకం బయట పడిందిప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై బురద చల్లుతున్నారుపయ్యావుల కేశవ్ అసెంబ్లి వేదికగా టీడీపీ తరఫున లాండ్ టైటిలింగ్ యాక్ట్కు మద్దతు తెలిపారుచట్టానికి టీడీపీ పూర్తిగా మద్దతు తెలిపింది5 కొట్ల మందిని భయబ్రాంతులకు గురి చేసేలా టీడీపీ వ్యవరించింది.టీడీపీ నేతల లాంటి నీచులు రాజకీయ వ్యభిచారులు ఎవరైనా ఉంటారా.?వెలుగులోకి వచ్చిన వీడియోతో టీడీపీ అస్సలు నగ్న స్వరూపం బయట పడింది.రాష్ట్ర ప్రజలు అందరికీ టీడీపీ గురించి తెలియాలిచంద్రబాబు రాష్ట్రానికి పట్టిన చీడ అనడానికి ఇదే ఉదాహరణటీడీపీది దంధ్వ వైఖరిని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలిబిల్లుకు అసెంబ్లీలో నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే రద్దు చేస్తాను అంటున్నావ్రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలి .సంజాయిషీ ప్రజల ముందుకు చంద్రబాబు వెళ్ళాలి.పురంధరేశ్వరి బీజేపీలో లేదు టీడీపీ ఏజెంట్ గా ఉంది.దేశం అంతా బీజేపీ ఒకలా ఉంటే ఎపిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంటోంది? -
పేరుకే రిజర్వుడు నియోజకర్గం.. పెత్తనమంతా వారిదే..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏలూరు జిల్లా పోలవరం అసెంబ్లీ టికెట్ ఎవరికి ఇచ్చినా ఓకే.. కలిసికట్టుగా పనిచేసుకుంటాం.. జనసేనకు ఇస్తే మేం సహకరిస్తామని టీడీపీ ఇన్చార్జి.. అలాగే టీడీపీకి ఇస్తే సహకరిస్తామని జనసేన నేతలు స్థానికంగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత రెండు పార్టీల ముఖ్యులకు చెప్పారు. కట్ చేస్తే.. పోలవరం అసెంబ్లీ సీటును పొత్తుల్లో భాగంగా జనసేనకు కేటాయించారు. మొదటి రెండు మూడు రోజులు వ్యవహారమంతా బాగానే ఉంది. ఆ తరువాత నుంచి అసలు గొడవకు తెర లేచింది. జనసేన అభ్యర్థిని మార్చి టీడీపీకి ఇవ్వాలంటూ ఆ పార్టీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్ వర్గీయులు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. చంద్రబాబు కాన్వాయ్ని అడ్డగించి మరీ ఘెరావ్ చేయడంతో వివాదం తారాస్థాయికి చేరింది. పొత్తులు.. కత్తులు పోలవరంలో పొత్తు పార్టీల్లోని నేతలు ఒకరిపై మరొకరు కత్తులు దూసుకుంటున్నారు. నిన్నమొన్నటి వరకు ధృతరాష్ట్ర కౌగిలిలో గడిపిన రెండు పార్టీల నేతలు కత్తులు దూసుకునే స్థాయికి చేరడం వెనుక ఇద్దరు అభ్యర్థులను నడుపుతున్న రెండు సామాజిక వర్గాలే ప్రధాన కారణమనే చర్చ నియోజకవర్గంలో బలంగా సాగుతోంది. తెలుగుదేశం పార్టీ పోలవరం ఇన్చార్జిగా బొరగం శ్రీనివాస్, జనసేన ఇన్చార్జిగా చిర్రి బాలరాజు కొనసాగుతున్నారు. పేరుకే ఇది రిజర్వుడు నియోజకవర్గం. జనసేనలో పవన్కళ్యాణ్ సామాజికవర్గం, టీడీపీలో చంద్రబాబు సామాజికవర్గం నేతలదే ఇక్కడ ఆధిపత్యం. రెండు సామాజిక వర్గాల నేతలు ఎవరికి సూచిస్తే ఆయా పార్టీ అభ్యర్థులుగా ఇప్పటివరకు రాజకీయం నడిచింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన మొడియం శ్రీనివాస్ 2019లో టికెట్ కోల్పోయారు. 2019లో బొరగం శ్రీనివాస్కు సీటు దక్కగా ఆయన ఓటమి పాలయ్యాడు. అయినా ఇన్చార్జిగా కొనసాగుతూ నియోజకవర్గంలో బాబు సామాజికవర్గ నేతల సహకారంతో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే జనసేన పార్టీలో మొదటి నుంచి కొనసాగుతున్న చిర్రి బాలరాజు 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఈ పరిణామాల క్రమంలో పొత్తులతో ప్రతిపక్ష పార్టీలన్నీ కూటమిగా ఏర్పడటంతో పోలవరంలో చిచ్చు రేగింది. పొత్తులకు ముందు వరకు టీడీపీ సీటు కోసం ఇన్చార్జి బొరగం శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్లు ప్రయత్నించారు. జనసేనకే టికెట్ అని ప్రకటించడంతో ఇద్దరూ రెండు రోజుల పాటు హడావుడి చేసి సర్దుకున్నారు. నిరసనల పర్వం జనసేన టికెట్ ఖరారుకు ముందు టీడీపీ దెందులూరు ఇన్చార్జి చింతమనేని ప్రభాకర్, పోలవరం టీడీపీ ఇన్చార్జి బొరగం శ్రీనివాస్, జనసేన ఇన్చార్జి చిర్రి బాలరాజులు జనసేన నేత నాదెండ్ల మనోహర్ వద్దకు వెళ్లారు. జనసేన టికెట్ తమ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా ఓకే అని, ఇబ్బంది లేదని మా ట్లాడుకుని వచ్చారు. ఆ తరువాత రెండు రోజులకు జనసేన అభ్యర్థిగా చిర్రి బాలరాజును ప్రకటించారు. భీమవరంలో అప్పటివరకు టీడీపీ నేతగా ఉన్న పులపర్తి రామాంజనేయులుకు జనసేన కండువా కప్పి అభ్యర్థిగా ప్రకటించిన రీతిలో అవకాశం దక్కుతుందేమోనని బొరగం ఆశ పడ్డారు. అయితే జనసేన నేతకు టికెట్ ఇవ్వడంతో బాబు సామాజికవర్గ నేతల వర్గీయులతో కలిసి బొరగం వర్గీయులు నిరసనలకు తెరతీశారు. ఆ సామాజిక వర్గ నేతల వద్దకు వెళ్లలేం ప్రతి పనికీ పవన్కళ్యాణ్ సామాజికవర్గ నేతల వద్దకు తాము వెళ్లలేమని, అందుకే టికెట్ మార్చి టీడీపీ అభ్యర్థికి ఇవ్వాలంటూ బొరగం వర్గీయులు తెరపైకి కొత్త డిమాండ్ తీసుకొచ్చారు. రెండు రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో బస చేసిన చంద్రబాబునాయుడు క్యాంప్ వద్ద ధర్నాకు దిగి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేయడం పోలవరంలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అభ్యర్థి మార్పు ఉంటుందని టీడీపీ బలంగా నమ్ముతుండగా, జనసేన అభ్యర్థి మాత్రం టీడీపీ, బీజేపీ నేతలు ఎవరూ లేకుండానే పది రోజుల నుంచి ప్రచారం చేసుకుంటున్నారు. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్యాదవ్ పోలవరం జనసేన అభ్యర్థి చిర్రి బాలరాజు నిర్వహించిన సభలకు హాజ రుకావడం మరో చర్చగా మారింది. -
నాడు కత్తుల కొలిమి– నేడు పొత్తుల చెలిమి
సాక్షి, అమరావతి: చాలా కాలం తర్వాత ప్రధాని మోదీ, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు ఆదివారం నాడు ఉమ్మడిగా ఒకే వేదిక నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు ఏం మాట్లాడతారోనని రాజకీయ పరిశీలకులతో పాటు రాష్ట్రంలో చాలా మంది ఆసక్తితో ఉన్నారు. ఎందుకటే 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ఎన్డీయే నుంచి నిష్క్రమించాక మోదీ రాష్ట్రానికి ఎన్నికల ప్రచారానికి వస్తే, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండీ తన పార్టీ కార్యకర్తలతో నల్ల చొక్కాలు వేయించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేయించారు. ప్రధాని పర్యటన సమయంలో టీడీపీ నేతలు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసనలు తెలిపారు. ఆ సమయంలోనే ప్రధాని మోదీని ఉద్ధేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేస్తే... దానికి బదులు ప్రధాని మోదీ సైతం తీవ్రంగానే ప్రతిస్పందించారు. ఆయన ఏమన్నారు.. ఈయన ఏమన్నారంటే... 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రధాని మోదీనుద్దేశించి వివిధ సందర్భాల్లో చేసిన విమర్శలు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే ఇంకా 15 సీట్లు వచ్చేవి ► ‘రాష్ట్ర ప్రయోజనాల కోసం, ప్రజల కోసం ఎన్డీయే నుంచి బయటకు వస్తే.. అది రాజకీయ ప్రయోజనాల కోసం అని మాట్లాడుతున్నారు. నిజంగా నేను రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనుకుని ఆనాడు బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే.. ఇంకో 15 సీట్లు ఎక్కువ వచ్చేవి’ –మార్చి 29, 2018న రాష్ట్ర అసెంబ్లీలో చంద్రబాబు. ► ‘దేశ రక్షణ రంగంలో అతి పెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ. 59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, దానికి సంబంధించిన నివేదికలు ఉన్నాయి. ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. మోదీ జీ, మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు’ – ఫిబ్రవరి 8, 2019 తన ట్విట్టర్లో చంద్రబాబు ► మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా లేదు. మీకంటే వాళ్లే నయం. కాటన్ దొర ఇచ్చిన నీళ్లయినా తాగుతున్నాం. నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్షా రాజకీయాల్లో వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోయారు – 2019 ఫిబ్రవరి 2న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ► ‘రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి’. – 2018 జూన్ 9న నెల్లూరు సభలో చంద్రబాబు ► ‘బీజేపీకి ఒకటే చెబుతున్నా, తెలుగుదేశంతో పెట్టుకుంటే ఖబడ్దార్. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయేమో. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సాగవు’. – 2018లో శృంగవరపుకోటలో జరిగిన నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు ► ‘కేంద్రం సహకారం అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి టీడీపీకి లేదు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబుకు ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూ టర్న్ బాబు అనుకుంటున్నారన్నది మీ అందరికీ తెలుసు.‘ ► ‘ఏపీలో పరిస్థితి బాహుబలి సినిమాలో భళ్లాలదేవుడి పాత్ర మాదిరిగా ఉంది. తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని తిరిగి దానిని కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలకైనా వెనుకాడడం లేదు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ది చెందాలన్నది మా ఆలోచన అయితే... యూ టర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు’ – 2019 ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మోదీ. ► దేశం కోసం గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామంటే మాకెలాంటి బెరుకు లేదు.ఇవాళ ఇక్కడ ఉన్న నాయకులు(చంద్రబాబును ఉద్దేశించి) భయపడాలి. ఎందుకంటే వారు చేసిన అవినీతి వారిని ఎల్లప్పుడూ వెంటాడుతుంది. ఈ విషయం వారికి తెలుసు. అవినీతి చేయడంలో, ముఖ్యమంత్రిగా ఉంటూ తన కుటుంబ ప్రయోజనాల కోసమే పనిచేసి తప్పు చేశారని వారికి తెలుసు.– 2019 మార్చి 2న విశాఖపట్నం సభలో ప్రధాని మోదీ. ► ‘నేను ఎవరికీ భయపడేది లేదు, నరేంద్ర మోదీ, ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో ఉండే నాయకత్వాన్ని బలహీన పరచడానికి, ఇష్టమొచ్చినట్లు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశా. భయమనేది నా జీవితంలో లేదు’. – 2018లో మార్చి 6 తేదీన విజయవాడలో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు. ► ‘విభజన హామీలను నాలుగు బడ్జెట్లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ పెట్టలేదు. ఈ రాష్ట్రం ఒకటి ఉందన్న ఆలోచన లేదా? ఎప్పుడైనా మిత్రపక్షంగా రండి. కూర్చుందాం అని అన్నారా? మీరు ఒక్కరే దేశాన్ని కాపాడతారా? ఏం మీకొక్కరికే దేశభక్తి ఉందా? –2018 మార్చి 7న సమావేశంలో చంద్రబాబు. ► ‘భార్యనే చూసుకోని వాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’. – అసెంబ్లీలో చంద్రబాబు తన ప్రసంగంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలివి. ► ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు’. – 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు టీడీపీ నేతల సమావేశంలో చంద్రబాబు. ప్రధాని మోదీ వివిధ సందర్భాల్లో చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు ► ‘లోకే శ్ తండ్రి చంద్రబాబు నాకు సంపదను సృష్టించడం తెలియదన్నారు. అవును నిజమే. నాకు సొంత ఆస్తులు పెంచుకోవడం రాదు. కానీ అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ఎప్పుడైనా ఒక ముఖ్యమంత్రి వాస్తవాలను వదిలిపెట్టి అసత్యాలు మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజల మద్దతు కోల్పోయారని అర్ధం. తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆ వ్యక్తి ఏదో పెద్ద తప్పు చేశారనే అర్ధం’ ► ‘ప్రజలారా మీరే చెప్పండి. ఎన్టీఆర్ వారసత్వాన్ని తీసుకున్నాయన ఆయన కలలను సాకారం చేస్తానని మాటిచ్చారా లేదా? ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తానని హామీ ఇచ్చారా లేదా? ఈ రోజు ఆయన ఎన్టీఆర్కు గౌరవమిస్తున్నారా? సోదర సోదరీమణులారా మీకు ఈ విషయం అర్ధమవుతుంది. కానీ ఆయనలాంటి సీనియర్ నాయకుడికి ఎందుకు అర్ధం కావడం లేదు. ఇదంతా యువత తెలుసుకోవాలి్సన అవసరం ఉంది. ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్ను దుష్ట కాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్తో దోస్తీ కట్టారు’ ► ‘చంద్రబాబుకు ఏమైంది. ఆయన నాకంటే చాలా సీనియర్నని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుంటారు. మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడు తక్కువ చేయలేదు. అవును మీరు సీనియర్. కూటములు మార్చడంలో. కొత్త కూటములు కట్టడంలో. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో. ఈ రోజు ఎవరిని తిడతారో రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. ►‘కేంద్ర ప్రభుత్వం ద్వారా నేను చేపట్టిన పథకాలపై చంద్రబాబు తన స్టిక్కర్ వేసుకొని ప్రచారం చేసుకుంటున్నారు. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం’. – 2019 ఫిబ్రవరి 10న గుంటూరు సభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలివి. -
మళ్లీ జగనే రావాలి.. పోలవరం నిర్వాసితుల పాదయాత్ర..
-
పోలవరం ఆలస్యానికి చంద్రబాబే కారణం: నాగిరెడ్డి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement