-
ఆంగ్ల మాధ్యమం గురించి జస్టిస్ రమణ ఎందుకలా అన్నారో?
కొద్ది రోజుల క్రితం రెండు వార్తలు గమనించాను. న్యాయవ్యవస్థలోనే అత్యున్నతమైన సుప్రింకోర్టు ఛీఫ్ జస్టిస్ గా బాధ్యతలు నిర్వహించి తెలుగువారికి విశిష్టత తెచ్చిన జస్టిస్ ఎన్వీ రమణ తెలుగు మీడియం గురించి మాట్లాడిన విషయం ఒకటి అయితే, ప్రముఖ విద్యావేత్త కంచ ఐలయ్య ఏపీలో జరుగుతున్న విద్యా సంస్కరణలపై చేసిన ప్రసంగం వీడియో మరొకటి. జస్టిస్ రమణ తెలుగు మీడియం పై మాట్లాడితే ఐలయ్య ఆంగ్ల మీడియం గురించి గట్టిగా వక్కాణించారు. ఐలయ్య చాలా స్పష్టంగా ఏపీలో విద్యా సంస్కరణలు కొనసాగవలసిన అవసరం గురించి వివరించారు. ఆంగ్ల మీడియం ద్వారా బలహీనవర్గాలలో ఆత్మ స్తైర్యం పెరుగుతుందని, ప్రపంచంతో పోటీ పడే అవకాశం వస్తుందని స్పష్టంగా పేర్కొన్నారు. ✍️ముఖ్యమంత్రి జగన్ను తాను ఇంతవరకు కలవలేదని, భవిష్యత్తులో కూడా కలవవలసిన అవసరం లేదని అంటూ, ఆయన విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు విప్లవాత్మకమైనవని చెప్పడమే తన ఉద్దేశమని ఐలయ్య తెలిపారు. ఐలయ్య చేసిన ఈ ప్రసంగానికి మీడియాలో పెద్ద ప్రాముఖ్యత లబించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం కాస్త విస్తారంగానే ప్రచారం అయింది. మరో వైపు సుప్రింకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆంగ్ల మాద్యమంపై మాట్లాడిన విషయాలు తెలుగుదేశం పార్టీ పత్రికలలో ప్రముఖంగా వచ్చాయి. ✍️ ఆయన అభిప్రాయాన్ని గౌరవించవలసిందే. ఎవరూ మాతృభాషను విస్మరించకూడదు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాని అదే సమయంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదురువుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని ఆంగ్ల మాద్యమంకు ఉన్నప్రాముఖ్యతను ఆయన గుర్తించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రమణ ఆయా దేశాలకు వెళ్లినప్పుడు ఆంగ్లంలో మాట్లాడారో, లేక ఎవరినైనా దుబాసి పెట్టుకుని తెలుగులో మాట్లాడారో తెలియదు కాని, ప్రస్తుతం ఆయన చెబుతున్న విషయాలు పేద ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆంగ్ల మాద్యమం మంచిదనే భ్రమలు వద్దు అని ఆయన అన్నారని ఈనాడు మీడియా ప్రముఖంగా ప్రచురించింది. ఇదేదో ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడారేమో అన్న భావన కలుగుతుంది. ఆయనకు ఆ ఉద్దేశం ఉండకపోవచ్చు.కాని ఈనాడు మీడియా ఈ వార్త ఇచ్చిందంటే ఎంతో కొంత జగన్ ప్రభుత్వానికి నష్టం చేస్తుందని నమ్మడమే కావచ్చు. ✍️లేకుంటే ఆ వార్తకు అంత ప్రాధాన్యత ఇవ్వదు కదా! కర్నూలులో కొన్నాళ్ల క్రితం జరిగిన ఎస్టియు అంటే స్టేట్ టీచర్ల సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బహుశా అది సిపిఐ మద్దతుతో నడిచే సంస్థలా ఉంది. అందుకే సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, సిపిఐ తెలంగాణ మాజీ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు. వైసిపి ఎమ్మెల్యే హపీజ్ ఖాన్ కూడా ఈ సభలో పాల్గొన్నా ఆయనకు అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. ఏపీలో సిపిఐ పూర్తిగా ప్రభుత్వ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. పేదలకు వైసిపి ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను సైతం తప్పుపడుతున్న సిపిఐ ప్రతిపక్ష తెలుగుదేశంకు కొమ్ముకాస్తోందన్న విమర్శలు ఉన్నాయి. సిపిఐ నారాయణ చెప్పారంటూ ఏపీలో నలభైవేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రమణ నమ్మినట్లు మాట్లాడడం కూడా సముచితంగా అనిపించదు.నారాయణ తన అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతుంటారు. ✍️ఉదాహరణకు తమతో కలిసిఉన్నప్పుడు కేసీఆర్ ను హీరో అని నారాయణ పొగిడేవారు. ఆయనతో చెడగానే కేసీఆర్ అంత నియంత లేరని ద్వజమెత్తారు. ఇది వేరే సంగతి కాని ఛీఫ్ జస్టిస్ గా అత్యున్నతమైన బాధ్యతలు నిర్వహించి రిటైరైన రమణ తన గౌరవం నిలబెట్టుకునే విదంగా మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. అలాకాకుండా నారాయణ వంటివారి చెప్పుడు మాటలు విని ప్రసంగాలు చేస్తే అప్రతిష్ట పాలు అయ్యే ప్రమాదం ఉంది. నిజంగా పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి?అన్నిటిని భర్తీ చేయవలసిన అవసరం ఉందా? తదితర అంశాలను తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. రమణ అసలు ఎపీలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులను పరిశీలించి ఉండకపోవచ్చు. ✍️కేవలం తన పాతమిత్రులైన టీడీపీ నేతలు చేస్తున్న ప్రచార ప్రభావంలో పడి మాట్లాడి ఉండవచ్చు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు ఎంత అద్వాన్నంగా ఉన్నాయో ఎన్నడైనా రమణ పరిశీలించారా? ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన విశేష మార్పులనుఎన్నడైనా చూశారా?స్కూళ్లను నాడు-నేడు కింద బాగు చేసి,రంగులు వేసి ప్రైవేటు స్కూళ్లకు పోటీగా తయారు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించడం రమణ కనీస బాద్యత కాదా? స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్ లను ఒకసారి ఆయన చూసి వస్తే బాగుండేది కదా! సిబిఎస్ఇ సిలబస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర విన్నూత్న అంశాలను ప్రభుత్వ స్కూళ్లలోని పేద విద్యార్దులకు అందించాలన్న జగన్ తాపత్రయాన్ని అర్దం చేసుకోకుండా రమణ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులు మాట్లాడడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని గమనించాలి.ప్రభుత్వ స్కూళ్లలో ఉన్న అత్యాధునిక టాయిలెట్లు ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ఉన్న విషయాన్ని అంగీకరించరా? అసలు ప్రభుత్వ స్కూళ్లలో ఇన్ని మార్పులు తీసుకు వస్తే టీచర్లు మరింత శ్రద్దగా, బాద్యతగా పాఠాలు చెప్పాలన్న సంగతిని కూడా రమణ వంటివారు బోదించి ఉండాల్సింది. ✍️ఆ విషయాల జోలికి వెళ్లినట్లు మీడియాలో వచ్చిన వార్తలో కనిపించలేదు. ఒకవేళ ఆ ప్రస్తావన తెచ్చి ఉంటే మంచిదే. అయితే ఇంగ్లీష్ మీడియం గురించి రమణ మాట్లాడిన తీరు మాత్రం అభ్యంతరకరం అని సోషల్ మీడియాలో విస్తారంగా కామెంట్లు వచ్చాయి. ప్రభుత్వ స్కూళ్లలోనే తెలుగు మీడియం బోదించాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు? ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్ల మీడియం గురించి ఎందుకు మాట్లాడలేదు?అంతదాకా ఎందుకు ఆయన గొప్పవారు కదా! ఆయన తన పిల్లలను తెలుగు మీడియంలోనే, అందులోను ప్రభుత్వ స్కూళ్లలోనే చదివించానని చెప్పి ఉన్నట్లయితే చాలా మందికి స్పూర్తి దాయకం అయి ఉండేది కదా! అలాగే తన మనుమలు కూడా తెలుగు మీడియంలోనే చదువుతున్నారని అని ఉంటే ఘనంగా ఉండేది కదా! వారు ఎక్కడ ,ఏ స్కూళ్లలో చదువుతున్నారో తెలియదు కాని, బహుశా ప్రభుత్వ స్కూళ్లలో అయి ఉండకపోవచ్చు. ఎందుకంటే పలుకుబడి కలిగినవారంతా ఇంటర్నేషనల్ స్కూళ్లలోనే చదివిస్తున్నారు కదా! తప్పు లేదు. ✍️కాని ప్రభుత్వ స్కూళ్లలోనే ఫలానా విధంగా ఉండాలని చెప్పడమే కాస్త ఆక్షేపణీయంగా అనిపిస్తుంది. న్యాయ వ్యవస్థలో ఆంగ్ల భాష ప్రాధాన్యత గురించి రమణ కు తెలియకపోదు. ఇప్పటికీ కోర్టులలో ఆంగ్లంలోనే తీర్పులు వెలువడుతుంటాయి. వాదనలన్నీ ఆంగ్లంలోనే జరుగుతుంటాయి. ఆ విషయాన్ని విస్మరించరాదు కదా? అలాగే మిగిలిన వ్యవస్థలలో కూడా ఆ పరిస్థితి ఉంది. అలాంటప్పుడు ఆంగ్ల మాద్యమమే మంచిదని భ్రమలు వద్దని చెప్పడం ద్వారా ఆంధ్ర సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చినట్లవుతుందనిపిస్తుంది. మాతృభాషలోనే టీచర్లు బోధించాలని మాజీ జస్టిస్ చెప్పడం సహేతుకంగా లేదు. వారు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాలి కదా! రమణ ఒక విదంగా ఎపీ ప్రభుత్వం చేస్తున్న కృషిని నీరుకార్చే విధంగా మాట్లాడారనిపిస్తుంది. ఒక్కసారి రమణ ఎపీలో ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించి, పిల్లలతో మాట్లాడి వారి మనోభావాలను తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. ✍️ఈ మధ్య నేను కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి పిల్లలతో మాట్లాడాను. ఇంగ్లీష్ మీడియం కావాలా? వద్దా? అంటే దాదాపు అంతా కావాలని బదులు చెప్పారు. ఏపీ ప్రభుత్వం పిల్లలకు టాబ్ లు ఇవ్వడాన్ని సమర్ధిస్తారా అంటే అవునని జవాబు ఇచ్చారు. ఈనాడు వంటి పత్రికలు పిల్లలకు ఇచ్చే టాబ్ లపై దరిద్రపు వార్తలను రాస్తున్న విషయాన్ని కూడా పిల్లలు గమనిస్తున్నారు. ఆ మీడియా తీరును కూడా కొందరు తప్పుపట్టారు. పరిస్థితి ఇలా ఉంటే జస్టిస్ రమణ పేద పిల్లలకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు కనిపించడం సమంజసంగా కాదు. ✍️తెలుగు మీడియం అంటూ ప్రచారం చేసిన ఈనాడు అధినేత రామోజీరావు, ఆంద్రజ్యోతి రాధాకృష్ణ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమ పిల్లలను ఆంగ్ల మీడియంలో అది కూడా కార్పొరేట్ స్కూళ్లలోనే చదివించారు. చంద్రబాబు తన మనుమడిని ఎక్కడ చదివిస్తున్నారో రమణ తెలుసుకుని దానిపై స్పందిస్తే ప్రజలకు బాగా అర్ధం అవుతుంది.టీచర్ల జీతభత్యాల గురించి తన అభిప్రాయాలు చెప్పిన మాజీ ఛీఫ్ జస్టిస్ విద్యార్దులకు ఐదో తరగతి చదివినా రెండంకెల కూడికలు కూడా రావడం లేదని అన్నారు. దీనికి టీచర్లు ఏ విధంగా బాద్యత వహించవలసి ఉందో వివరించారో లేదో తెలియదు. కచ్చితంగా టీచర్లను గౌరవించవలసిందే. ✍️వారికి అన్ని విదాలుగా సదుపాయాలు సమకూర్చవలసిందే. కాని అదే సమయంలో వారు కూడా బాద్యతగా పనిచేయవలసిన అవసరం ఉంటుంది కదా! రాజకీయ పార్టీలకు అనుబందంగా కాకుండా పేదల కోసం ప్రభుత్వ టీచర్లు పనిచేసిన రోజున వారు ఏ డిమాండ్లు పెట్టినా సమాజం అర్దం చేసుకుంటుంది. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో జస్టిస్ రమణ వంటివారు ఇలాంటి ఉపన్యాసాలు చేయడం వల్ల వారి ఉద్దేశాలను ప్రజలు శంకించే ప్రమాదం ఉందని చెప్పకతప్పదు.అది వారికి శోభ నివ్వదు. విద్యా వేత్త కంచ ఐలయ్య పేద వర్గాలకు, బలహీనవర్గాలకు ప్రతినిదిగా మాట్లాడిన తీరును, జస్టిస్ రమణ వంటి ప్రముఖుడు ప్రసంగించిన వైనాన్ని గమనించిన మీదట ఈ కామెంట్ రాయాలనిపించింది. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
అంతర్జాతీయ మీడియేటర్ ప్యానెల్ సభ్యుడిగా మాజీ జస్టిస్ ఎన్వీ రమణ!
సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేటర్ ప్యానల్ సభ్యునిగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సింగపూర్లోని ప్రధాన తెలుగు సంస్థలైన సాంస్కృతిక కళాసారథి, తెలుగుదేశం ఫోరమ్ మొదలైన సంస్థల ప్రతినిధులు వారిని గౌరవపూర్వకంగా కలిసి తమ సంస్థల తరఫున అభినందనలు తెలియజేసి సత్కరించారు. “తెలుగువారికే గర్వకారణమైన జస్టిస్ ఎన్వీ రమణను, వారి సింగపూర్ పర్యటన సందర్భంగా కలుసుకోవడం, వారికి తమ సంస్థ గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను అన్నింటిని తెలియపరచి వారి ఆశీస్సులు అభినందనలు అందుకోవడం చాలా సంతోషదాయకంగా ఉందని" 'సాంస్కృతిక కళాసారథి' అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ తెలిపారు. జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ "తెలుగు వారంతా ఒక్కటిగా, ఒకే మాట మీద, ఒకే తాటి మీద ఉంటే తెలుగుని సింగపూర్ ప్రభుత్వం కూడా గుర్తించి మీరంతా ఎన్నో సంవత్సరాల నుంచి కోరుకుంటున్న విధంగా తెలుగు భాషను సింగపూర్ ప్రభుత్వ పాఠశాలలో బోధించడం సులభతరం అవుతుందని, ఆ ప్రక్రియలో తమ సహాయ సహకారాలు కూడా ఎప్పుడూ ఉంటాయని" అన్నారు. ఈ సందర్భంగా సభ్యులు టేకూరి నగేష్, అమ్మయ్య చౌదరి, సతీష్ పారేపల్లి తదితరులు జస్టిస్ రమణని కలిసి సత్కరించారు. (చదవండి: ఆతిథ్యం ఇచ్చిన సింగపూర్ తెలుగు ప్రజలు!) -
తెలుగు వర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో నిలపాలి
నాంపల్లి (హైదరాబాద్): దేశంలో సంస్కృత, హిందీ, పాశ్చాత్య భాషలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏర్పడినట్లుగా తెలుగు భాషకు కూడా జాతీయ స్థాయిలో ఒక విశ్వవిద్యాలయం ఏర్పడితే తప్ప తెలుగు భాషా, సంస్కృతిని విస్తృత స్థాయిలో భవిష్యత్ తరాలకు అందించలేమని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. శనివారం తెలుగు వర్సిటీ ఎన్టీఆర్ కళా మందిరంలో ఏర్పాటు చేసిన మండలి వెంకటకృష్ణారావు సంస్కృతీ పురస్కార ప్రదానోత్సవ సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. తెలుగు వర్సిటీ ఆశించిన స్థాయిలో లేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. నగర శివార్లలోని బాచుపల్లిలో వందెకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కాబోతున్న తెలుగు విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తెలుగు భాషపై మక్కువ కలిగిన, భాషకు ఎనలేని కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడ కిషన్రావు మాట్లాడుతూ... రాష్ట్ర తర తెలుగు సంస్థలకు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగు భాషా సంస్కృతి ఔన్నత్యాన్ని పెంచే సాహిత్యాన్ని అందజేయడమే కాకుండా ఆయా సంస్థలతో ఒప్పందం చేసుకుని తెలుగు భాష, బోధన, పరివ్యాప్తికి కృషి చేస్తున్నదని అన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ... శాస్త్రీయ విజ్ఞానం మాతృ భాషలో విద్యార్థులకు అందుబాటులో ఉంచితే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఆత్మియ అతిథిగా హాజరైన మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ... ఉభయ తెలుగు రాష్ట్రాలలోని తెలుగు వారికన్నా ప్రవాసాంధ్రులకే తెలుగు భాషపై మక్కువ ఎక్కువని అన్నారు. జర్మనీ మాజీ ఎంపీ డాక్టర్ జి.రవీంద్ర కార్యక్రమంలో పాల్గొని తెలుగులో మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. అంతర్జాతీయంగా తెలుగు భాషా సంస్కృతి, ఆధ్యాత్మిక వికాసానికి చిరస్మరణీయమైన సేవలందిస్తున్న లండన్లోని యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ (యుక్తా) సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సత్య ప్రసాద్ కిల్లీకి మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి మండలి వెంకటకృష్ణారావు తెలుగు కేంద్రం సంచాలకులు ఆచార్య వై.రెడ్డి శ్యామల సమన్వయకర్తగా వ్యవహరించగా, సంస్థ కో ఆర్డినేటర్ డాక్టర్ విజయ్పాల్ పాత్లోత్ వందన సమర్పణ చేశారు. -
ప్లాస్టిక్ రహితంగా తిరుమల
తిరుమల/తిరుచానూరు(చంద్రగిరి): తిరుమలలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భక్తుడిపైనా ఉందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. తిరుమలను ప్లాస్టిక్ రహిత ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చడానికి టీటీడీ చేస్తున్న కృషిలో భక్తులంతా భాగస్వాములు కావాలని కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం కోసం శనివారం టీటీడీ నిర్వహించిన సుందర తిరుమల–శుద్ధ తిరుమల కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొన్నారు. తిరుమల నుంచి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డులోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఆయన తొలగించారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తిరుమల కొండలు పవిత్రమైనవని, ఈ ప్రాంతాన్ని ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో దేవుడి గది లాగే భావించి శుభ్రంగా ఉంచాలని పిలుపునిచ్చారు. టీటీడీ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతో గొప్పదని.. ఇందులో పాల్గొంటున్న ఉద్యోగులు, శ్రీవారి సేవకులు, భక్తులను ఆయన అభినందించారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి మాట్లాడుతూ, ఇకపై ప్రతి నెలా రెండో శనివారం సుందర తిరుమల–శుద్ధ తిరుమల కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి ఉన్న వారు స్వచ్ఛందంగా పాల్గొని తిరుమలను పరిశుభ్రంగా.. ప్లాస్టిక్ రహితంగా ఉంచడానికి కృషి చేయాలని కోరారు. తిరుమలకు ప్లాస్టిక్ ఉత్పత్తులను తీసుకురావద్దని భక్తులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, జేఈవోలు సదా భార్గవి, వీర బ్రహ్మం, జాయింట్ కలెక్టర్ బాలాజీ, ఎస్పీ పరమేశ్వరరెడ్డి, టీటీడీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్వీ రమణ సుప్రీంకోర్టు మాజీ సీజే జస్టిస్ ఎన్వీ రమణ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం అధికారులు ఆయన్ని రంగనాయకుల మండపంలో లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు. అలాగే శనివారం సాయంత్రం తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని జస్టిస్ ఎన్వీ రమణ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. -
మధ్యవర్తిత్వంపై త్వరలో చట్టం
సాక్షి, హైదరాబాద్: మధ్యవర్తిత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో చట్టం చేయనుందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. ఆ బిల్లు ఆమోదం పొంది అమల్లోకి వస్తే కేసుల పరిష్కారం వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆదివారం భారత మధ్యవర్తిత్వ దిన తొలి వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ ఎన్వీ రమణ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘మధ్యవర్తిత్వం ద్వారా కేసుల్ని రాజీ చేసుకొనే విధానాన్ని అనుసరిస్తేనే ఏ దేశమైనా న్యాయ వివాదాల సత్వర పరిష్కారం ద్వారా పురోగతి సాధిస్తుంది. ఎంఎన్సీ సంస్థల నుంచి సాధారణ స్థాయి సంస్థల్లో జరిగే ఒప్పందా ల్లో విదాదం ఏర్పడితే నేరుగా న్యాయస్థానాన్ని ఆశ్ర యించకుండా తొలి దశలో మధ్యవర్తిత్వం ద్వారా ఆ వివాదం పరిష్కరించుకొనేలా ఒప్పందం ఉండాలి. హైదరాబాద్లో వేలాది నిర్మాణాలు జరుగుతున్నా యి. సివిల్ వివాదాలు ఏళ్ల తరబడి కోర్టుల్లో వాయిదాల మీద వాయిదాలు పడే అవకాశం ఉంది. తద్వారా అది పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది’అని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. చోళుల కాలంలోనే ‘మధ్యవర్తిత్వం’... దేశంలో చోళుల కాలం నుంచే మధ్యవర్తిత్వ ప్రయత్నాలు సాగేవని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి తెలిపారు. ‘వ్యాపార లావాదేవీల్లో వివాదాలను ఆర్బిట్రేషన్ విధానంలోనే పరిష్కరించుకొనేవారు. ఆర్బిట్రేషన్, చర్చలు, మధ్యవర్తిత్వం లోక్అదాలత్ ఇవన్నీ ప్రత్యామ్నాయ వివాద పరిష్కారానికి (ఏడీఆర్) విభిన్న కోణాలే. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ 2021–22 సమాచారం ప్రకారం దేశంలో 464 ఏడీఆర్ కేంద్రాలుంటే 397 పనిచేస్తున్నాయి. 570 మధ్యవర్తిత్వ కేంద్రాలు పనిచేస్తున్నాయి. వాటిలో ఇప్పటివరకు 53 వేల కేసులు పరిష్కారం అయ్యాయి. మధ్యవర్తిత్వ బిల్లు – 2021ను త్వరలోనే పార్లమెంటు ఆమోదించే అవకాశం ఉంది. నిర్దిష్ట గడువులోగా మీడియేషన్ ప్రక్రియ పూర్తి (180 రోజుల్లో పూర్తి చేయాలి. లేనిపక్షంలో మరో 180 రోజులు పొడిగింపు), మధ్యవర్తుల నమోదుకు జాతీయ స్థాయిలో మధ్యవర్తిత్వ మండలి ఏర్పాటు, మధ్యవర్తిత్వ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నాక ఉభయ పార్టీలు అందుకు కట్టుబడి ఉండాలి. మధ్యవర్తిత్వ వ్యవహారాలన్నీ గోప్యంగా ఉంచడం వంటివి ప్రతిపాదిత బిల్లులో కీలకాంశాలు. కోవిడ్ లాక్డౌన్ వేళ ఏడీఆర్ అమల్లో స్పష్టమైన మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆన్లైన్ వివాద పరిష్కార (ఓడీఆర్) దిశగా కేసుల సత్వర పరిష్కారానికి దోహదపడ్డాయి’అని జస్టిస్ హిమాకోహ్లి పేర్కొన్నారు. సమయం, డబ్బు ఆదా: హైదరాబాద్లో ఐఏఎంసీ ఏర్పాటును స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం గుజరాత్లో ఆర్బిట్రేషన్–మీడియేషన్ సెంటర్ ఏ ర్పాటుకు ఆర్థిక సాయం అందించింది. ఈ సెంటర్ల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుంది. సింగపూర్ ఆర్బిట్రేషన్–మీడియేషన్ ఒప్పందంపై భార త్ 2019 ఆగస్టు 7న సంతకం చేసింది. శ్రీకృష్ణుడు కౌరవ, పాండవుల మధ్య రాయబారానికి ప్రయచారు. అది విఫలం కావడంతోనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. పెను వినాశనానికి దారితీసింది. గ్రామీణ ప్రాంతాల్లో పెద్దలు రచ్చబండ విధానం ద్వారా స్థానికంగా వివాదాల్ని పరిష్కరించే సంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వ విధానానికి ఆదరణ లభిస్తోంది’అని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు. 33 కేసుల పరిష్కారం... ఐఏఎంసీ ఇప్పటివరకు 33 కేసుల్ని పరిష్కరించిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర్రావు వెల్లడించారు. ఆర్బిట్రేషన్ ద్వారా పది కేసులు, మీడియేషన్ ద్వారా 23 కేసుల్లో మొత్తం 700 బిలియన్ డాలర్ల విలువైన వివాదాలు పరిష్కారమయ్యాయని వివరించారు. అనంతరం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఐఏఎంసీ సీఈ వో జస్టిస్ ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఐఏఎంసీ చైర్మన్ జార్జి లిమ్ ప్రసంగించారు. వారికి ఐఏఎంసీ రిజిస్ట్రార్ తారిక్ స్వాగతం పలికారు. తర్వాత మధ్యవర్తిత్వంపై పలు చర్చాకార్యక్రమాలు జరిగాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
Advertisement