-
అయోధ్యకు మోదీ.. ముస్తాబవుతున్న నగరం
లక్నో: జార్ఖండ్, బీహార్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధాని మోదీ.. ఉత్తరప్రదేశ్లోని ధౌరాహ్రా, అయోధ్యలో ఆదివారం ప్రచార కార్యక్రమాలను తలపెట్టారు. ఇప్పటికే మోదీ రాక కోసం నగర వీధులు బీజేపీ జెండాలతో ముస్తాబవుతున్నాయి.నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2.45 గంటలకు ఇటావాలో జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4.45 గంటలకు ధౌరాహ్రాలో మరో సభ నిర్వహిస్తారు. రాత్రి 7 గంటలకు అయోధ్యలోని రామమందిరంలో ప్రార్థనలు, పూజలు చేస్తారు.ప్రధాని మోదీ రోడ్షో సుగ్రీవ కోట నుంచి ప్రారంభమై లతా చౌక్ వరకు కొనసాగుతుంది. రోడ్షో జరిగే మార్గాన్ని 40 బ్లాక్లుగా విభజించారు. ఈ కార్యక్రమంలో సింధీలు, పంజాబీలు, రైతులు, మహిళలు పాల్గొంటారు. బాలరాముని ప్రాణప్రతిష్ట తరువాత మోదీ అయోధ్యను సందర్శించడం ఇదే మొదటిసారి.#WATCH | Uttar Pradesh: Ayodhya has been decorated ahead of Prime Minister Narendra Modi's visit to Ram Janmabhoomi temple and roadshow today. pic.twitter.com/QnENKFwfyt— ANI (@ANI) May 5, 2024ప్రధాని మోదీ పర్యటనకు ముందు, రామాలయం ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ అయోధ్యలో రామ్ లల్లా దర్శనం, రోడ్షో కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. అయోధ్యలో మోదీకి ఘనంగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఐదవ దశలో (మే 20) అయోధ్యలో ఓటింగ్ జరగనుంది. జూన్ 1 వరకు లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరుగుతాయి. అన్ని స్థానాల ఓట్ల లెక్కింపు జూన్ 4న జరగనుంది. దేశంలో ఎక్కువ ఎంపీ స్థానాలున్న (80 సీట్లు) రాష్ట్రం ఉత్తరప్రదేశ్లో గత ఎన్నికల్లో 62 స్థానాల్లో బీజేపీ పతాకం ఎగురవేసింది.#WATCH | Ayodhya, Uttar Pradesh: On PM Modi's visit and roadshow in Ayodhya today, Chief Priest of Ram Janmabhoomi temple, Acharya Satyendra Das says, "... This is the first time that he (PM Modi) is coming after the Pran Pratishtha... He will do Darshan first and then there will… pic.twitter.com/5AoyEsikuw— ANI (@ANI) May 5, 2024 -
కళ్లు గద్దెపై.. బుద్ధి భూమిలో
సాంబశివుడు.. గోవిందరెడ్డి.. సుబ్బారావు.. ఎవరు వీళ్లంతా?రామోజీరావు రహస్య సంతానమా? లేకపోతే చంద్రబాబు దత్తపుత్రులా? లేని పేర్లను సృష్టించి.. లేని రిజిస్టరులో వీళ్ల పేర్లు వివాదంలో చిక్కుకున్నట్లుగా రాసి పారేసి... లేని చట్టాన్ని అమల్లో ఉన్నట్టుగా చూపిస్తూ రాష్ట్ర ప్రజలను భయభ్రాంతుల్ని చేసిన ‘ఈనాడు’ను ఏమనుకోవాలి? రాష్ట్రాన్ని రాచపుండులా పీడిస్తున్న రామోజీరావు తన చంద్రబాబు కోసం ఇంకెంత దిగజారుతారు? అసలు అమల్లోకే రాని ‘ల్యాండ్ టైట్లింగ్ చట్టం’ గురించి ఎందుకు జనాన్నింతలా భయపెడుతున్నారు? జనం గనక మాకు వద్దంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ చట్టాన్నయినా తెస్తుందా? అలా తెచ్చిన దాఖలా ఒక్కటయినా ఉందా?సాక్షి, ప్రత్యేక ప్రతినిధి : కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఖరారు చేసిన చట్టం ఈ ‘ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్’. దీన్ని అన్ని రాష్ట్రాలూ అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ ‘నీతీ ఆయోగ్’ అన్ని రాష్ట్రాలకూ పంపితే.. ప్రజలకు మేలు జరుగుతుందన్న ఉద్దేశంతో రాష్ట్రం కూడా ఆ దిశగా అడుగులు వేసి ముసాయిదా చట్టాన్ని చేసింది. కానీ ఈ చట్టానికి సంబంధించిన రూల్స్ ఏవీ ఇప్పటిదాకా విడుదల కాలేదు. అంటే ఈ చట్టం కింద టైటిల్ రిజిస్టరు ఎలా ఉంటుంది? టైటిల్ రిజిష్ట్రారుగా ఎవరిని నియమించాలి? రెవెన్యూ అధికారులనా... లేకపోతే న్యాయ వ్యవస్థ నుంచి జ్యుడీíÙయల్ అధికారులనా? ఇలా ఈ చట్టం అమలుకు సంబంధించి ఉండే సమగ్ర నియమ నిబంధనలేవీ ఇంకా రూపు దిద్దుకోనేలేదు. ఈ రూల్స్ విడుదలయ్యాక వీటిపై గ్రామ స్థాయి నుంచి సభలు నిర్వహించి.. ప్రజల అభ్యంతరాలను, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నియమాలు (రూల్స్) రూపొందిస్తారు. ఆ రూల్స్కు లోబడే చట్టాన్ని అమలు చేస్తారు.ఇవేవీ జరగకుండానే... చట్టం అమలయిపోతున్నట్లుగా, ప్రభుత్వం భూములు లాక్కుంటోందంటూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేయటం ఎంత దుర్మార్గం రామోజీరావ్? అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సందర్భంలోనూ ఒక మాటంటూ ఉంటారు. తాను పోరాడుతున్నది మాయా యుద్ధం చేసే మారీచులతోనని. ఈ ఎల్లో ముఠా అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారుతుందని, ఎంతటి విపత్తులనైనా సృష్టిస్తుందని. నారా వారిని ఎలాగైనా గద్దెనెక్కించాలని మాయా యుద్ధం చేస్తున్న ‘ఈనాడు’ బుద్ధి... అందుకే ఇపుడు భూ మార్గం పట్టింది. చట్టం రావాలంటే సర్వే పూర్తి కావాలి..మూడేళ్ల కిందట కేంద్రం ఈ చట్టాన్ని ఆమోదించి అన్ని రాష్ట్రాలకూ పంపిన తర్వాత.. నీతీ ఆయోగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా చట్టానికి రూపకల్పన చేయటంతో పాటు.. రాష్ట్రంలోని గ్రామాల్లో రీ సర్వే చేపట్టింది. నిజానికి వందేళ్ల కిందట ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిన సర్వే తప్ప.. నాటి నుంచి నేటి వరకు ఏ ప్రభుత్వమూ భూముల సమగ్ర సర్వే చేపట్టలేదు.కొత్తగా సర్వేయర్లను నియమించి.. రాష్ట్ర రెవెన్యూ యంత్రాంగాన్ని మొత్తాన్ని మోహరించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రీ సర్వే యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. కేంద్ర ప్రభుత్వ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన సర్వే జనరల్ సైతం రాష్ట్రానికి వచ్చి రీ సర్వే చేస్తున్న తీరును ప్రశంసించారు. ఈ రీ సర్వే చేస్తూ... కింది స్థాయిలో పరిష్కారమయ్యే చిన్న చిన్న వివాదాల కోసం మొబైల్ న్యాయ స్థానాలను కూడా ఏర్పాటు చేశారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ ప్రయత్నం వల్ల ఇప్పటికి 4 వేల గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. మరో 2 వేల గ్రామాల్లో తుది దశలో ఉంది. కాకపోతే రాష్ట్రంలో మొత్తం 17 వేల గ్రామాలున్నాయి. ఇంకా 11 వేల గ్రామాల్లో రీసర్వే మొదలు కావాల్సి ఉంది.మొత్తం అన్ని గ్రామాల్లోనూ రీసర్వే పూర్తయ్యాక వివాదాలు లేని భూములకు సంబంధించి వాటి యజమానులకు హక్కు పత్రాలు అందజేస్తారు. ఆ హక్కు దారుల వివరాలే చివర్లో టైటిల్ రిజిస్టరులో ఉంటాయి. ప్రజలంతా అంగీకరించి.. ప్రభుత్వం గనక ముందుకు వెళితే ఈ సుదీర్ఘ ప్రక్రియ పూర్తవటానికి కొన్నేళ్లు పడుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి కనక... మిగతా రాష్ట్రాలు కూడా రీ సర్వేలు పూర్తి చేసి, ఈ చట్టాన్ని అమల్లోకి తెస్తే.. అప్పుడు దేశ వ్యాప్తంగా ఒకే టైటిల్ రిజిస్టరు నిర్వహించడానికి వీలవుతుంది.కేంద్రం ఆశిస్తున్నది అదే. దీనివల్ల దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడి భూమినయినా కొనుగోలు చేయొచ్చు. ఢిల్లీలో భూమి కొనుగోలు చేసినా విజయవాడ రిజిస్టరు కార్యాలయంలోనే దాన్ని రిజిస్టరు చేసుకోవచ్చు. పైపెచ్చు ఒక భూమిని ఎక్కడ ఎవరు కొనుగోలు చేసినా... విక్రయించినా, లేక ఆ భూమిపై ఎక్కడ రుణం తీసుకున్నా ఆ వివరాలన్నీ టైటిల్ రిజిస్టరులో నమోదవుతాయి.కాబట్టి రుణం వంటి వివరాలు దాచి మరొకరి దగ్గర రుణాలు తీసుకునే అవకాశం ఉండదు. ఇదిగో ఇలాంటిది వ్యవస్థ ఇంకా అమల్లోకి రాలేదు కనకనే సుజనా చౌదరి లాంటి వ్యక్తులు పారిశ్రామిక వేత్తల ముసుగులో ఒకే పరిశ్రమకు సంబంధించిన భూముల్ని పలు ఆర్థిక సంస్థల దగ్గర తనఖా పెట్టి రుణాలు తీసుకున్నారు. చివరకు బ్యాంకుల్ని ముంచేశారు. ఇప్పుడేమో తాను ఆ వ్యాపారాల నుంచి తప్పుకున్నానని, తనకేమీ సంబంధం లేదని శుద్ధపూస కబుర్లు చెబుతున్నారు.టైటిల్కు ప్రభుత్వమే గ్యారంటీ సమగ్రంగా రీ సర్వే జరిపి... వివాదాలేవీ లేవని తేలి్చన మీదట ఆ భూములకు టైటిల్ పత్రాలిస్తారు కనక.. అక్కడి నుంచి ఆ టైటిల్కు ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ప్రభుత్వం టైటిల్ ఇచ్చాక కూడా ఆ భూమి అసైన్డ్ అనో, డీ పట్టా అనో వివాదం గనక తలెత్తితే ఆ టైటిల్ దారుకు ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం చెల్లిస్తుంది. ఈ మేరకు ప్రభుత్వమే ఆయా భూములకు బీమా చేస్తుంది. బీమా సొమ్మును టైటిల్ దారుకు చెల్లిస్తుంది. ఈ నిబంధన వల్ల ప్రజలకు మేలు జరుగుతుంది కాబట్టే ఈ చట్టం విషయంలో ముందుకు అడుగులు వేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ చెబుతోంది. మోదీతో చెప్పించగలవా బాబూ?ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, ఈ చట్టం ద్వారా ప్రభుత్వం భూములు లాక్కుంటుందని చంద్రబాబు ముఠా, ఎల్లో మీడియా ఉధృతంగా విష ప్రచారం చేస్తున్నాయి. పత్రికల్లో కథనాలు రాయించటంతో పాటు పనికిమాలిన వ్యక్తులకు లాయర్ల కోటు తొడిగి నిపుణుల ముసుగులో ఎల్లో చానెళ్లలో మాట్లాడిస్తోంది. సోషల్ మీడియాలో అబద్ధాలను జోరుగా వైరల్ చేస్తోంది.వీటిలో ఏ ఒక్క శాతం నిజం ఉన్నా.. ఈ చట్టం కేంద్రానిది కనుక ఆ విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పగలవా చంద్రబాబూ? ఈ చట్టం వల్ల ప్రజలకు హాని జరుగుతుందని, కాబట్టి దీన్ని తాము వెనక్కి తీసుకుంటున్నామని మోదీతో చెప్పించగలవా? మరి అవేవీ చెయ్యలేనపుడు ఎందుకీ విష ప్రచారం? ఎందుకు బీజేపీతో కలిసి పోటీ చేయటం? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో కూటమి గట్టడమెందుకు? వారు చేస్తున్న చట్టం ప్రజలకు మేలు చేసేది కాదని, దాన్ని తెలుగుదేశం అంగీకరించదని నేరుగా చెప్పలేని నీ బతుకెందుకు? అబద్ధాల పునాదులపై నిరి్మంచుకున్న నీ రాజకీయ కోట పునాదులతో సహా పేలిపోయే రోజు అతి దగ్గరలోనే కనిపించటం లేదా! -
PM Narendra Modi: వచ్చే ఐదేళ్లు అవినీతిపై యుద్ధమే
సిసాయ్/దర్భంగా: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అవినీతిపరుల ముసుగు తొలగించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే ఐదేళ్లలో అవినీతిపై యుద్ధం సాగిస్తామని, అవినీతి తిమింగలాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడం తథ్యమని స్పష్టం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడినవారు ఇక తప్పించుకోలేరని తేలి్చచెప్పారు. శనివారం జార్ఖండ్లోని సిసాయ్, పాలాము, బిహార్లోని దర్భంగాలో లోక్సభ ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో రోడ్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు అవినీతిపరులకు మద్దతుగా రాంచీలో, ఢిల్లీలో ర్యాలీలు నిర్వహించారని మండిపడ్డారు. జనం సొమ్ము దోచుకున్నవారికి మద్దతుగా మాట్లాడారని, వారి ఆసలు రంగు బయటపడిందని పేర్కొన్నారు. తప్పుడు పనులు చేసినందుకే జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి(హేమంత్ సోరెన్) ఇప్పుడు జైలులో ఊచలు లెక్కిస్తున్నాడని చెప్పారు. అవినీతి భూతాన్ని భూస్థాపితం చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని తెలిపారు. ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ఇంకా ఏం చెప్పారంటే.. యూపీఏ పాలనలో ఆకలి చావులు ‘‘అభివృద్ధిలో గిరిజన ప్రాంతాలు వెనుకంజలోనే ఉండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణం. 2004 నుంచి 2014 దాకా యూపీఏ ప్రభుత్వ పాలనలో ఆహార ధాన్యాలు గోదాముల్లో పందికొక్కుల పాలయ్యాయి. అప్పట్లో ఎంతోమంది గిరిజనుల బిడ్డలు తగిన ఆహారం లేక ఆకలితో మాడిపోయారు. సోనియా గాంధీ–మన్మోహన్సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ రాచరిక పాలనలో గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. మేము అధికారంలోక వచ్చాక పరిస్థితి మారిపోయింది. పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు ఇవ్వకుండా ప్రపంచంలోని ఏ శక్తి కూడా అడ్డుకోలేదు. ఇది మోదీ గ్యారంటీ. కాంగ్రెస్ హయాంలో పేదలకు ఇంటర్నెట్ సౌకర్యం కలి్పంచడాన్ని అప్పటి పాలకులు వ్యతిరేకించారు. కేవలం సంపన్నులకే ఆ సదుపాయం ఉండేది. మేమొచ్చాక మారుమూల ప్రాంతాల్లోనూ అందరికీ ఇంటర్నెట్ అందుతోంది. డేటాను చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చాం. నేడు సోషల్ మీడియాలో యువత హీరోలుగా గుర్తింపు పొందుతున్నారు. గోద్రా ఘటనపై బోగస్ నివేదిక 20 ఏళ్ల క్రితం గుజరాత్లో గోద్రా రైలు దహనం ఘటనకు బాధ్యులైన వారిని కాపాడేందుకు ఆర్జేడీ అధ్యక్షుడు(లాలూ ప్రసాద్ యాదవ్) ప్రయతి్నంచారు. కరసేవలకుపైనే నింద మోపారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఆయన సహవాసం చేశారు. సోనియా మేడమ్ హయాంలోనే గోద్రా రైలు దహనం జరిగింది. 60 మందికిపైగా కరసేవకులు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేయడానికి నియమించిన బెనర్జీ కమిషన్పై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. బోగస్ నివేదిక సమరి్పంచేలా జాగ్రత్తపడ్డారు. అసలు దోషులను కాపాడుతూ కరసేవకులనే బాధ్యులుగా చిత్రీకరించారు. ఆ నివేదికను న్యాయస్థానం చెత్తబుట్టలో పడేసింది. అసలు దోషులను గుర్తించి శిక్ష విధించింది. కొందరికి మరణశిక్ష పడింది’’ అని ప్రధాని మోదీ వివరించారు. సాధారణ జీవితం గడుపుతున్నా.. ‘‘కాంగ్రెస్ రాజకుమారుడు నోట్లో వెండి చెంచాతో పుట్టాడు. పేదల ఇళ్లను సందర్శిస్తూ కెమెరాలకు పోజులిస్తున్నాడు. నేను సాధారణ జీవితమే గడుపుతున్నా. పేదల కష్టాలు నాకు తెలుసు కాబట్టి వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రారంభించా. దేశంలో సమూల మార్పులు తీసుకొచ్చి ప్రజల జీవితాల్లో వెలుగులు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. నేను గత 25 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా పదవుల్లో ఉన్నప్పటికీ నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. నాకు సొంత ఇల్లు, సొంత సైకిలు కూడా లేదు. జార్ఖండ్లో కాంగ్రెస్, జేఎంఎం నాయకులు అవినీతికి పాల్పడుతూ తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు’’ గిరిజనులపై అకృత్యాలు సహించం ‘‘మావోయిస్టులపై కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఓటు బ్యాంక్ను కాపాడుకోవడానికి మావోయిస్టుల జోలికి వెళ్లలేదు. నిషేధిత తీవ్రవాద సంస్థలు గిరిజన మహిళలపై అత్యాచారాలకు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. గిరిజనుల భూములను లూటీ చేస్తున్నాయి. ఇలాంటి అకృత్యాలు సహించే ప్రసక్తే లేదు’’ -
ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. 25 ఏళ్లలో..
రాంచీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్సభ 2024 ఎన్నికల ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగానే మోదీ జార్ఖండ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో అవినీతి రహిత పాలన సాగించానని అన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న 15 ఏళ్ల కాలంలో.. ప్రధానమంత్రిగా కొనసాగిన 10 సంవత్సరాల కాలంలో కూడా నాపైన ఒక్క రూపాయి అవినీతి ఆరోపణ కూడా లేదని మోదీ స్పష్టం చేశారు. నా తల్లి, సోదరీమణులు దూరంగా ఉన్నాను. నాకు ఆనందం ముఖ్యం కాదు, ప్రజలు నా మీద ఉంచిన విశ్వాసమే ముఖ్యమని అన్నారు.500 ఏళ్ల తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణం , జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు ముఖ్యమైన మైలురాళ్లుగా పేర్కొంటూ, తన నాయకత్వంలో భారతదేశం సాధించిన అద్భుతమైన పురోగతిని ప్రధాని నొక్కిచెప్పారు. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా ముందుకు సాగుతుందని అన్నారు.కాంగ్రెస్ కూటమి నాయకుల అవినీతి విధానాలను మోదీ ఖండించారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం తన దార్శనికతతో వారి స్వయంసేవ ఉద్దేశాలను విభేదించారు. జేఎంఎం, కాంగ్రెస్ నేతలు అవినీతితో అపారమైన సంపదను కూడబెట్టుకున్నారని ప్రధాని ఆరోపించారు.మోడీ ఒక లక్ష్యం కోసం పుట్టారు.. జేఎంఎం-కాంగ్రెస్ నేతలు అవినీతితో అపారమైన సంపదను కూడబెట్టారు. నాకు సైకిల్ కూడా లేదు. కానీ వారు తమ పిల్లలకు కూడా వారసత్వంగా ఎన్నో సమకూర్చారు. కానీ మీరంతా నా వారసులు. మీ పిల్లలు, మనవరాళ్లకు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని ఇవ్వాలనుకుంటున్నానని అన్నారు.పేద, అట్టడుగు వర్గాలకు చెందిన వారి జీవితాలపై ప్రభుత్వ పథకాల పరివర్తన ప్రభావాన్ని ప్రధాన మంత్రి వివరించారు. గత 10 సంవత్సరాలలో.. మీకు ఇల్లు, విద్యుత్, గ్యాస్, నీరు అన్నీ బీజేపీ ప్రభుత్వం అందించిందని మోదీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ మద్దతును కొనసాగించాలని.. అభివృద్ధి, పురోగతి కోసం ప్రజలకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. -
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
అది 1995.. దేశంలోని హర్యానాలో చౌదరి బన్సీలాల్ ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీని హర్యానా రాష్ట్ర ఇంచార్జిగా నియమించింది. మోదీకున్న అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుని, పార్టీ అతనికి హర్యానా బాధ్యతలను అప్పగించింది. నాటి రోజుల్లో పార్టీకి సొంత కార్యాలయం లేదు. పార్టీ సమావేశాలు అద్దె భవనంలో జరిగేవి.నరేంద్ర మోదీ తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు అతని చూపు అక్కడున్న దీపక్ అనే 12 ఏళ్ల బాలునిపై పడింది. ఆ కుర్రాడు సంఘ్ కార్యక్రమాలకు హాజరుకావడంతోపాటు, బీజేపీ కార్యాలయంలో వంటమనిషిగా కూడా పనిచేసేవాడు. మోదీ ఆ కుర్రాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మరుసటి రోజు రోహ్తక్ లో జరిగే బీజేపీ సమావేశానికి తనతో పాటు దీపక్ను కారులో తీసుకెళ్లారు.నాటి అనుభవాల గురించి దీపక్ మీడియాతో మాట్లాడుతూ ‘నాడు రోహ్తక్ నుంచి తిరిగి వస్తుండగా కిలా రోడ్డులో కారు ఆపిన మోదీ తనకు డబ్బులు ఇచ్చి , ఒక షార్ట్, టీ షర్ట్ కొనుక్కోమని చెప్పారు. తరువాత వాటిని వేసుకుని చూపించమన్నారు. కొద్దిసేపటి తరువాత కిచిడీ ఎలా చేయాలో చూపించారు. అలాగే మిగిలిపోయిన ఆహారాన్ని ఎలా ఉపయోగించాలో కూడా నాకు నేర్పించారు.ఇక్కడికి వచ్చినప్పుడల్లా, నేను తయారుచేసిన కిచిడీని తినేవాడు. నేను అప్పటికి తొమ్మిదో తరగతి చదువుతున్నాను. చదువు మానవద్దని చెబుతూ, నా స్కూలు ఫీజు కట్టేవారు. నన్ను చదువుకోవాలని ఎప్పుడూ ప్రోత్సహించేవారు. మోదీ ఆరేళ్లపాటు హర్యానా బీజేపీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారు.2002లో మోదీ.. దీపక్కు ఫోన్ చేశారు. అలాగే 2004, 2006లో కూడా దీపక్తో ఫోన్లో మాట్లాడారు. 2009లో మోదీ హిస్సార్లో జరగబోయే ర్యాలీకి వెళ్తుండగా హెలికాప్టర్ చెడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న దీపక్.. మోదీని కలుసుకున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ప్రధాని మోదీ.. దీపక్ను వేదికపైకి పిలిచి ప్రశంసించారు.తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై డాక్యుమెంటరీని రూపొందిస్తున్న పీఎంవో కార్యాలయ బృందం దీపక్ను ఇంటర్వ్యూ చేసింది. దీపక్ ఆచార్య నేపాల్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆయన హర్యానా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కో-ఇన్చార్జిగా పనిచేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సూప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
IPL 2024 PBKS VS CSK: రుతురాజ్ను వెంటాడుతున్న దరిద్రం
ఉంగరంతో ఆరోగ్యం పదిలం!
Shobha Shetty Engagement: గ్రాండ్గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
గ్రాండ్గా నటుడి కుమార్తె రిపెప్షన్ వేడుక.. సందడి చేసిన ప్రముఖ తారలు!
సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్ ఇదే
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
తప్పక చదవండి
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- ఇదేం ఫ్యామిలీ రా సామీ! ఏకంగా కోబ్రాకే నేరుగా..!
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement