-
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..? -
శ్రీరామకొండ.. జనసంద్రం
ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీరామకొండ క్షేత్రంలో సీతారామస్వామి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రామయ్య కల్యాణోత్సవంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని తిలకించారు. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి దంపతులు సీతారాముల కల్యాణంలో పాల్గొనగా.. కోయిల్కొండకు చెందిన లక్ష్మీనారాయణగౌడ్ బియ్యం గింజలపై శ్రీరామనామం రాసి, తలంబ్రాలుగా అందజేశారు. కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. శ్రీరామకొండలో సీతారాముల కల్యాణం జరిపిస్తున్న అర్చకులు -
విషాదంలోనూ ఔదార్యం
ఊట్కూర్: పుట్టెడు దుఃఖంలోనూ తన భర్త కళ్లను దానంచేసి ఔదార్యం చాటుకుందో భార్య. భర్తకు ఇచ్చిన మాట ప్రకారం లయన్స్ క్లబ్ వారికి కళ్లను దానంచేసి ఆదర్శంగా నిలిచింది. వివరాల్లోకి వెళ్తే.. ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామానికి చెందిన దాసరి విష్ణు (40) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడేవాడు. అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల కుటుంబ సభ్యులు మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. కాగా, తాను చనిపోతే తన కళ్లను ఆస్పత్రి వారికి దానం చేయాలని భార్య శశికళకు చెప్పాడు. అతడి కోరిక మేరకు రెండు కళ్లను లయన్స్ క్లబ్ వారికి దానం చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడికి ముగ్గురు పిల్లలు ఉన్నారని.. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. -
టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీపీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్వతి సత్యనారాయణ కోరారు. జిల్లా కేంద్రంలోని యూనియన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్సీటీఈ నుంచి సవరణ ఉత్తర్వులు ఇచ్చేవిధంగా ప్రభుత్వం కృషి చేయడంతో పాటు వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులకు కొన్నేళ్లుగా బదిలీలు, పదోన్నతులు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. రెండేళ్ల నుంచి పెండింగ్లో ఉన్న మెడికల్, జీపీఎఫ్, సరెండర్ బిల్లులను విడుదల చేయాలన్నారు. కార్యక్రమంలో టీపీఆర్టీయూ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ యుగంధర్రెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంబాబు, రమాకాంత్, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి, రాకేష్రెడ్డి, సతీష్కుమార్, శ్రీధర్, భూపతిసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
No Headline
ప్రతి ఏడాది శ్రీరామనవమి రోజు మన్యంకొండలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా శోభాయమానంగా అలంకరించిన పల్లకీలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను గర్భగుడి నుంచి దేవస్థానం సమీపంలోని రామసదనం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి, స్వామివారి కల్యాణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా జరిపించారు. వేదమంత్రోచ్ఛారణలు, సన్నాయి వాయిద్యాలు, అశేష భక్తజనం నడుమ అమ్మవారికి మంగళసూత్రధారణ, తలంబ్రాల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో మళ్లీ గర్భగుడి వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్కుమార్, అళహరి రామకృష్ణ, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందాచారి తదితరులు పాల్గొన్నారు. మన్యంకొండలో సంప్రదాయబద్ధంగా..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
49 కేసుల్లో రూ.37,63,170 సొత్తు స్వాధీనం
వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటే అందరి లక్ష్యం
జగన్ను మళ్లీ సీఎం చేద్దాం
పద్మనాభంలో టీడీపీకి భారీ షాక్
No Headline
8 నుంచి 13 వరకు అప్పన్న ఆర్జిత సేవలు రద్దు
రెండో రోజూ చందనం అరగదీత
ఈవీఎంల వినియోగంపై అవగాహన తప్పనిసరి
విశాఖ రుణం తీర్చుకుంటా
● లచ్చయ్యపేటలో అలా...
తప్పక చదవండి
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement