-
మరో 4 ఆలయాల పాలకమండళ్ల భర్తీకి నోటిఫికేషన్
అర్వపల్లి తుంగతుర్తి నియోజకవర్గంలో 6(సి) విభాగంలో గల మరో నాలుగు దేవాలయాల పాలక మండళ్ల నియామకానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్న తుంగతుర్తిలోని శ్రీపట్టాభిసీతారామ చంద్రస్వామి, నూతనకల్ మండలం మిర్యాల గ్రామంలోని సీతారాచంద్రస్వామి ఆలయం, శాలిగౌరారం మండలం ఇటుకుల పహాడ్లోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం, శ్రీమహాదేవి స్వామి ఆలయాల కమిటీలకు దరఖాస్తులు చేసే కార్యక్రమం జరుగుతుంది. ఈనెల 26 వరకు దరఖాస్తులు చేసుకోవడానికి గడువు ఉంది. ధర్మకర్తల మండలి కోసం అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు గట్టిగానే పోటీ పడుతున్నారు. అర్వపల్లి, ఫణిగిరి ఆలయాలకు నేటితో గడువు పూర్తి అర్వపల్లిలోని శ్రీయోగానందలక్ష్మీ నర్సింహస్వామి ఆలయం, ఫణిగిరిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాల పాలకమండళ్ల నియామకానికి దరఖాస్తుల గడువు బుధవారంతో పూర్తి కానుంది. ఇప్పటికే టీఆర్ఎస్ మండల నాయకులు పలువురు ఆలయ చైర్మన్లు పదవుల కోసం దరఖాస్తులు చేశారు. ఏడాది పదవీ కాలం ఆలయ కమిటీలకు సంబంధించి ఏడాది పాటు పదవీ కాలం ఉంటుంది. ఆ తర్వాత వీటి గడువు పొడగించే అవకాశం కూడా ఉండొచ్చు. కమిటీలో ఏడుగురు సభ్యులు ఉంటారు. అలాగే దేవాలయ పూజారిని ఎక్స్అఫిషియో సభ్యుడిగా నియమిస్తారు. ఏడుగురు సభ్యులలో ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. -
మా స్కూలు.. మా ఇష్టం!
సాక్షి, సిటీబ్యూరో: ప్రైవేటు పాఠశాలల్లో పాలక మండళ్ల ఏర్పాటు నేతిబీర చందంగా మారింది. స్వయంగా పాఠశాల విద్యాశాఖ ఉత్వర్వులిచ్చినా.. ప్రైవేటు బడుల యాజమాన్యాలు పెడచెవిన పెడుతున్నాయి. గడువు దాటి నెలలు గడుస్తున్నా ఇంతవరకు అన్ని స్కూళ్లు మండళ్లు ఏర్పాటు చేయలేదు. ప్రతి ప్రైవేటు పాఠశాలలో పాలక మండలి తప్పనిసరిగా ఉండాలి. ఇదే విషయాన్ని సర్కారు నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి అన్ని ప్రైవేటు బడుల్లో పాలక మండళ్లు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ గత మే నెలలో ఆదేశించింది. ఇందుకు సంబంధించిన జాబితాను డీఈఓ కార్యాలయంలో అందజేయాలని గట్టిగా చెప్పినా.. ప్రైవేటు యాజమాన్యాల్లో కదలిక లేకుండా పోయింది. ఫలితంగా ఇష్టారాజ్యంగా ఫీజలు వసూలు చేసుకోవడానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా యాజమన్యాలు చూసుకున్నాయి. పాఠశాల పరంగా తీసుకునే పలు కీలక నిర్ణయాలకు పాలక మండళ్ల ఆమోదం అనివార్యం. అన్ని పాఠశాలల్లో జూన్ 13వ తేదీలోపు ఏర్పాటు చేసి ఆ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారికి పంపించాలని ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్ డీఈఓ సోమిరెడ్డి... డిప్యూటీ ఈఓలు, డిప్యూటీ ఐఓఎస్లకు ఆదేశాలిచ్చారు. అయితే పాలక మండళ్లు విధిగా ఏర్పాటు చేయాలని యాజమాన్యాలపై విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తేవడంలో తీవ్రంగా విఫలమయ్యారని తెలుస్తోంది. ‘ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు పాలక మండళ్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రైవేటు స్కూళ్లకు సమాచారం చేరవేశాం. ఏ పాఠశాల కూడా అందుకు ఆసక్తి చూపలేదు. పాలక మండళ్లు లేకున్నా తమకొచ్చే ఇబ్బందులు ఏం ఉండవన్న భావనలో ఉన్నారు. పైగా ఫీజులు అధికంగా వసూలు చేసుకోవచ్చని, ఒకవేళ పాలక మండళ్లు ఉంటే ఫీజులపై నియంత్రణ వస్తుంది. దీంతో తమకేదీ గిట్టదని యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. మేం సమాచారమిచ్చి మమ అనిపించడం తప్ప చేసిందేమీ లేదు. వారి నుంచి స్పందన రాదని మాకు ముందే తెలుసు. మేం ఒత్తిడి తెచ్చేందుకు యత్నించినా.. మాపై వేరేవిధంగా ఒత్తిళ్లు మొదలయ్యాయి’ అని విద్యాశాఖకు చెందిన ఓ అధికారి వివరించారు. ఇప్పటికీ 70 శాతమే.. పాలక మండలిలో తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. ఈ మండలి ఆధ్వర్యంలోనే ఫీజులను నిర్ణయిస్తారు. దీని ప్రకారమే తల్లిదండ్రులు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతటి కీలకమైన పాలక మండళ్లను విద్యాశాఖ ఇచ్చిన గడువు జూన్ 13 నాటికి ఒక్క స్కూల్ కూడా ఏర్పాటు చేసుకున్న దాఖలాలు లేవు. జిల్లా విద్యాశాఖాధికారులు పలుమార్లు హెచ్చరించడంతో కొన్ని యాజమాన్యాలు మండళ్లు ఏర్పాటు చేశాయి. అదీ గడువుల మీద గడువులు ఇవ్వడంతో సాధ్యమైంది. నగరంలో 2 వేలకు పైగా ప్రైవేటు పాఠశాలలు ఉండగా.. ఇందులో 70 శాతం స్కూళ్ల వరకు మండళ్లను ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకున్నాయని సమాచారం. ఇంకొన్ని బడులు మొండికేశాయి. ఇటువంటి యాజమాన్యాల కోసం ఆయా మండలాల వారీగా ఈనెల 20వ తేదీలోగా ఏర్పాటు చేసి వివరాలు అందజేయాలని తుది గడువు అధికారులు ఇచ్చారు. ‘దాదాపు అన్ని ప్రైవేటు పాఠశాలలు పాలక మండళ్లు ఏర్పాటు చేసుకున్నాయి. అయితే ఎంత శాతం అనేది ఇప్పుడే చెప్పలేం. రెండు, మూడు రోజుల్లో పూర్తిస్థాయిలో ఏర్పాటవుతాయి. మండళ్ల ఏర్పాటుకు విముఖత చూపిన స్కూళ్ల గుర్తింపు రద్దు చేస్తామని ముందే హెచ్చరించడంతో స్పందన లభించింది’ అని హైదరాబాద్ డీఈఓ సోమిరెడ్డి పేర్కొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీ అధికారంలోకి వస్తే భవిష్యత్ అంధకారం
మెట్ గాలాలో మెరిసిన అలియా.. చీరలో ఎంత అందంగా ఉందో..!(ఫోటోలు)
అభిమాని ఐఫోన్ బద్దలు కొట్టాడు.. గ్లౌవ్స్ గిఫ్ట్గా ఇచ్చాడు! వీడియో
విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా
టాలీవుడ్ హీరో కూతురి ప్రేమ పెళ్లి.. తేదీ ఫిక్స్!
వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి
ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్
చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్
పెళ్లి ఫొటోలు డిలీట్ చేసిన స్టార్ హీరో.. కారణమేంటి?
సోమవారాల్లో నలిగిన బట్టలే ధరించండి! సీఎస్ఐఆర్ పరిశోధన సంస్థ
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- మెట్ గాలా 2024: అలియా టూ అంబికా మోదీ మెరిసిన బ్యూటీస్ (పోటోలు)
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement