-
పాపాయిల కోసం ప్రాణాలే అడ్డేసిన నర్సులు
తైవాన్లో వచ్చిన అతిపెద్ద భూకంపం అక్కడి ప్రజలను వణికించింది. గత పాతికేళ్లలో ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడం ప్రకపనలు రేపింది. పెద్ద పెద్ద భవనాలు, నివాస గృహాలు ఇళ్లు కుప్పకూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. రవాణా మార్గాలు స్థంభించాయి. ఈ భారీ భూకంపానికి సంబంధించిన వీడియోను, ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వెలుగులోకి వచ్చాయి. అలాంటి వీడియో ఒకటి నెటిజనుల అభిమానాన్ని సంపాదించుకుంది. భూకంపం ప్రభావం అక్కడి ఆసుపత్రులను కూడా ప్రభావితంచేశాయి. ఇలాంటి సమయంలో ఆసుపత్రిలో అత్యవసర చికిత్స తీసుకుంటున్న వారు, ఆపరేషన్ థియేటర్లలో ఉన్న రోగులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఇందుకు ఆయా విభాగాల వైద్యులు, నర్సులు అప్రమత్తమవుతారు.ప్రాణాలకు తెగించి మరీ వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ఘటనే తైవాన్ భూంకపం సమయంలోనూ చోటు చేసుకుంది. (చీరలతో కేన్సర్ ప్రమాదం : షాకింగ్ స్టడీ!) భూకంపం తైవాన్ను అతలాకుతలం చేస్తున్న సమయంలో స్థానిక ఆసుపత్రిలోని నర్సులు వెంటనే స్పందించారు. ఆస్పత్రి మెటర్నిటీ వార్డులో పసికందుల ప్రాణాలు కాపాడడానికి రంగంలోకి దిగారు. భూప్రకంపనలను గుర్తించిన వెంటనే పరుగు పరుగున వచ్చి ఉయ్యాలలో నిద్రపోతున్న శిశువులను రక్షించే ప్రయత్నం చేయడం పలువురి ప్రశంసలు దక్కించుకుంది. ప్రసూతి యూనిట్లోని నలుగురు సిబ్బంది ఉయ్యాలలను కదలకుండా ఉంచడానికి, గట్టిగా పట్టుకోవడానికి కష్టపడ్డారు. ఒక పక్క బిల్డింగ్ అటూ ఇటూ ఊగుతోంది. దీనికి పసిబిడ్డలు ఉయ్యాలలూ కదిలిపోతున్నాయి. మరోవైపు కిటికీలు పగులుతాయోమోనన్న భయం. ఈ సమయంలో వారి ఆందోళన, కష్టం సీసీటీవీలో రికార్డైనాయి. (గుండెలు పిండే విషాదం : మరణానికి ఏర్పాట్లు చేసుకుంటున్న స్టార్ యాక్టర్) These nurses risk their lives to literally save lives of babies during earthquake in Taiwan. Real life heros! Be safe🙏pic.twitter.com/Q8YLdSKQkJ — Nico Gagelmann (@NicoGagelmann) April 4, 2024 -
Japan Earthquake: జపాన్లో కంపించిన భూమి..
టోక్యో: తైవాన్ భూకంప ఘటన మరువకముందే తాజాగా జపాన్లో భూమి కంపించింది. గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్-మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. దీంతో, రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. కాగా, తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం తైవాన్లో భూకంపం వచ్చిన మరుసటి రోజే నేడు జపాన్లో భూమి కంపించింది. హోన్షు తూర్పు తీరంలో రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది. భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించారు. అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 🚨🇯🇵 BREAKING: 6.3 magnitude earthquake near the east coast of Japan pic.twitter.com/Ro97HguPVZ — Kacee Allen 🇺🇸 (@KaceeRAllen) April 4, 2024 ఇదిలా ఉండగా.. తైవాన్లో బుధవారం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ క్రమంలో 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు. ఈ భూకంపం కారణంగా దాదాపు 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భూకంపం ధాటికి తైవాన్ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి. A dog sensed an earthquake in Taiwan seconds before it happened and alerted its owner..🐕🐾😳#Taiwan #Tsunami #Japan #TaiwanEarthquake #earthquake pic.twitter.com/10SdmUDENd — Zainab Fatima (@ZainabFati18) April 4, 2024 తైవాన్లో భూకంపం సందర్భంగా చిన్నారులను కాపాడిన నర్సులు.. ⚡️Nurses in a #Taiwan Hospital protecting babies during #earthquake.#Taiwan #earthquake #Japanpic.twitter.com/rF5It43iYO — Tajamul (@Tajamul132) April 4, 2024 -
తైవాన్లో తీవ్ర భూకంపం
తైపీ: ద్వీప దేశం తైవాన్లో శక్తివంతమైన భూకంపం సంభవించింది. బుధవారం ఉదయం 8 గంటలకు చోటుచేసుకున్న భూప్రకంపనల వల్ల పలు భవనాలు ధ్వంసమయ్యాయి. 9 మంది మరణించారు. మరో 934 మంది క్షతగాత్రులుగా మారారు. ఈ భూకంపం రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైనట్లు తైవాన్ భూకంప పర్యవేక్షక ఏజెన్సీ ప్రకటించగా, 7.4గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే వెల్లడించింది. దేశావ్యాప్తంగా భూకంప ప్రభావం కనిపించింది. రాజధాని తైపీకి 150 కిలోమీటర్ల దూరంలో తైవాన్ తూర్పు తీరంలో ఉన్న హాలీన్ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం కేంద్రీకృతమైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రద్దు చేశారు. సెల్ఫోన్ సేవలు నిలిచిపోయాయి. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తర్వాత ఎత్తివేశారు. దేశంలో గత 25 ఏళ్లలో ఇదే అతిపెద్ద భూకంపమని చెబుతున్నారు. భూప్రకంపనల వల్ల పునాదులు ధ్వంసం కావడంలో పలు భవనాలు 45 డిగ్రీల మేర పక్కకు ఒరిగిపోయిన దృశ్యాలు కనిపించాయి. బలహీనంగా ఉన్న పాత భవనాలు కూలిపోయాయి. పాఠశాలల నుంచి విద్యార్థులను బయటకు పంపించారు. భూకంపం సంభవించగానే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. ధ్వంసమైన ఇళ్ల నుంచి వృద్ధులు, చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. భూకంపం, ఆ తర్వాత చోటుచేసుకున్న ప్రకంపనల కారణంగా 24 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రోడ్లు, వంతెనలు, సొరంగాలు దెబ్బతిన్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగింది. నేషనల్ పార్కులో ఓ బస్సులో ప్రయాణిస్తున్న 50 మందితో సంబంధాలు తెగిపోయాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రెండు బొగ్గు గనుల్లో 70 మంది కార్మికులు చిక్కుకుపోయారని తెలిపారు. వారి ఆచూకీ కోసం ప్రయతి్నస్తున్నామని వివరించారు. జపాన్, చైనాలోనూ ప్రకంపనలు జపాన్ దక్షిణ ప్రాంతంలోనూ ప్రకంపనలు నమోదయ్యాయి. జపాన్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. యొనాగుని, ఇషికాగి, మియాకో దీవుల్లో సముద్రపు అలలు పోటెత్తాయి. బుధవారం మధ్యాహ్నం తర్వాత సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. తైవాన్, చైనా మధ్య దూరం 160 కిలోమీటర్లు ఉంటుంది. బుధవారం చైనాలోని షాంఘైతోపాటు ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్స్ల్లో సైతం భూప్రకంపనలు సంభవించాయని స్థానిక మీడియా తెలియజేసింది. భూ విలయాల గడ్డ తైవాన్ కంప్యూటర్ చిప్ల తయారీకి, అత్యాధునిక టెక్నాలజీకి పేరుగాంచిన తైవాన్లో తరచుగా భూకంపాలు సంభవిస్తుంటాయి. పసిఫిక్ ‘రింగ్ ఆఫ్ ఫైర్’లో ఉండడమే ఇందుకు కారణం. ఈ ప్రాంతంలో భూ అంతర్భాగంలో సర్దుబాట్లు ఎక్కువగా జరుగుతుంటాయి. హాలీన్ కౌంటీలో 2018లో తీవ్రమైన భూకంపం సంభవించింది. అప్పట్లో 17 మంది మరణించారు. 1999 సెపె్టంబర్ 21న తైవాన్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్పై 7.7గా నమోదైంది. ఈ భూవిలయం 2,400 మందిని బలితీసుకుంది. లక్ష మందికిపైగా గాయపడ్డారు. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. భూకంపాల విపత్తులను సమర్థంగా ఎదుర్కొనే యంత్రాంగం తైవాన్లో ఉంది. -
Taiwan Earthquake: తైవాన్లో భారీ భూకంపం.. జనజీవనం అతలాకుతలం (ఫొటోలు)
-
తైవాన్ లో భారీ భూకంపం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
క్లుప్తంగా
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement