-
‘హాయ్..! మరదలా..’ అంటూ నగ్న చిత్రాలు, బూతు మెసేజ్లు
మరదలితో బావ అంటే సరదా నవ్విస్తూ.. చిలిపిగా ఆట పట్టిస్తూ ఉండొచ్చు! కానీ, ఇక్కడో ప్రబుద్ధుడు మరదలిపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు. మొబైల్లో నగ్న చిత్రాలు, అసభ్య మెసేజ్లు పంపుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో బావ. తన బావ వేధింపులకు తాళలేక సదరు మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అహ్మదాబాద్లోని జుహరపురలో చోటుచేసుకుంది. నిందితుడైన బావ తరచూ తన కోరిక తీర్చాలంటూ.. ఫోన్లో నగ్నచిత్రాలు, అశ్లీల మెసేజ్లు పంపుతున్నాడని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 2020 ఆగస్ట్లో జరిగిన తన( బాధితురాలు) వివాహానికి.. అక్కా, బావలను పిలవలేదు. కుటుంబ కలహాలు మనసులో పెట్టుకొని.. అప్పటి నుంచే ఆ బావ వేధింపులు మొదలైనట్లు బాధితురాలు తెలిపింది. తన కోరిక తీర్చాలని లేదంటే.. మార్ఫింగ్ చేసిన న్యూడ్ ఫోటోలు, అసభ్యకరమైన సందేశాలను తన(మహిళ) భర్తకు పంపుతానని బెదిరించాడని ఆమె పేర్కొంది. బావ చేసే పని బయటపడితే.. తన కుటుంబ పరువుపోతుందని, తన భర్తకు ఈ విషయం తెలిస్తే విడాకులు ఇస్తాడనే భయంతో బావ వేధింపులను భరిస్తూవచ్చింది. కానీ, రోజురోజుకు బావ అరాచకం పెరగటంతో.. లైంగిక వేధింపులు తాళలేక వెజాల్పూర్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ బూతు బావను కటకటాల వెనక్కి నెట్టి.. బడిత పూజ చేశారు. -
మరిది వేధింపులు భరించలేక వదిన ఆత్మహత్య
శాంతినగర్: తల్లితో సమానంగా భావించాల్సిన వదినపై ఓ కామాంధుడు వేధింపులకు పాల్పడటంతో భరించలేక, మనస్తాపం చెందిన ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వడ్డేపల్లి మండలం పచ్చర్ల గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. పచ్చర్లకి చెందిన చంద్రమోహన్రెడ్డికి గద్వాల మండలం మదనపల్లి పరిమళ(33)తో 18ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఇన్నేళ్లుగా మంచిగా కాపురం చేసుకుంటున్న పరిమళను ఇటీవల మరిది జనార్దన్రెడ్డి వేధింపులకు గురిచేశాడు. ఉమ్మడి కుటుంబం కావడంతో తన బాధను ఎవరికి చెప్పుకోలేక మనస్తాపానికి గురైంది. సోమవారం ఉదయం 10గంటల ప్రాంతంలో భర్త పొలానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పరిమళ పురుగుమందు తాగింది. బాధ భరించలేక భర్తకు ఫోన్ చేసి, తాను పురుగు మందు తాగాను, బతికించమని వేడుకుంది. వెంటనే ఇంటికి వచ్చిన భర్త ఆమెను చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం భర్తతో మాట్లాడిన పరిమళ జరిగిన విషయం మొత్తాన్ని అతడికి వివరించింది. మంగళవారం ఉదయం పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తన తమ్ముడు జనార్దన్రెడ్డి వేధింపులు తట్టుకోలేకనే తన భార్య మృతి చెందిందని చంద్రమోహన్రెడ్డి రాజోలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు శిక్షణ ఎస్ఐ వెంకట్నర్సింగ్రావు పేర్కొన్నారు.
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
సంక్షేమ సిరిమల్లిక
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement