-
సంచలనం సృష్టించిన భారత ఆర్చరీ జట్టు.. ఒలింపిక్ ఛాంపియన్లకు షాక్
భారత ఆర్చరీ జట్టు సంచలనం సృష్టించింది. చైనా వేదికగా జరుగుతున్న వరల్డ్కప్ స్టేజ్ 1 పోటీల్లో డిఫెండింగ్ ఒలింపిక్ ఛాంపియన్ సౌత్ కొరియాకు ఊహించని షాకిచ్చింది. 🚨 India secured one of its biggest wins in archery as the men's recurve team stunned reigning Olympic champion South Korea to win the gold medal at the ongoing World Cup Stage 1. 🇮🇳🥇👏 pic.twitter.com/hZkHdOicqo— Indian Tech & Infra (@IndianTechGuide) April 28, 2024 ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్లతో కూడిన భారత పురుషుల రికర్వ్ జట్టు.. దక్షిణ కొరియాపై 5-1 తేడాతో చారిత్రక విజయం సాధించి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. అర్చరీ వరల్డ్కప్లో 14 ఏళ్ల తర్వాత భారత్కు లభించిన తొలి స్వర్ణ పతకం ఇది. ఈ విజయంతో భారత్ పారిస్ ఒలింపిక్స్ బెర్తు ఖరారయ్యే అవకాశాలు మెరుగుపడ్డాయి. -
భారత జట్ల శుభారంభం
చెంగ్డు (చైనా): ప్రతిష్టాత్మక టీమ్ ఈవెంట్లు థామస్ కప్, ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ భారత పురుషుల, మహిళల జట్లు శుభారంభం చేశాయి. థామస్ కప్లో భాగంగా గ్రూప్ ‘సి’లో జరిగిన మ్యాచ్లో భారత పురుషుల టీమ్ 4–1 తేడాతో థాయిలాండ్పై విజయం సాధించింది. మహిళల టోర్నీ ఉబెర్ కప్ గ్రూప్ ‘ఎ’లో భారత్ 4–1 స్కోరుతోనే కెనడాను ఓడించింది. తొలి సింగిల్స్లో భారత ఆటగాడు హెచ్ఎస్ ప్రణయ్పై కున్లావట్ వితిద్సన్ గెలుపొందాడు. అయితే ఆ తర్వాత వరుసగా నాలుగు విజయాలు భారత్ ఖాతాలో చేరాయి. తీరారట్సకుల్ పై లక్ష్యసేన్, సరన్జమ్శ్రీపై కిడాంబి శ్రీకాంత్ విజయం సాధించారు. తొలి డబుల్స్లో సుక్ఫున్ – తీరారట్సకుల్ జంటపై సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్శెట్టి జోడి... పన్పనిచ్ – సొథోన్పై ఎంఆర్ అర్జున్ – ధ్రువ్ కపిల గెలిచారు. ఉబెర్ కప్లో తొలి సింగిల్స్లో మిచెల్ లిపై అస్మిత చాలిహ, కేథరీన్ – జెస్లీన్పై ప్రియ – శృతి, వెన్ జాంగ్పై ఇషారాణి బారువా గెలుపొందారు. అయితే రెండో డబుల్స్లో జాకీ డెంట్ – క్రిస్టల్ లాయ్ చేతిలో సిమ్రన్ సింఘీ – రితిక ఠాకర్ ఓడిపోగా... చివరి మ్యాచ్లో ఎలియానా జాంగ్పై అన్మోల్ ఖర్బ్ విజయం సాధించింది. -
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
షాంఘై (చైనా): ప్రపంచ ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో భారత్కు చెందిన వెన్నం జ్యోతిసురేఖ మరోసారి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వరల్ట్ కప్ స్టేజ్ 1 టోర్నీలో శనివారం జ్యోతి సురేఖ 3 స్వర్ణ పతకాలతో మెరిసింది. దీపికా కుమారి (2021) తర్వాత వరల్డ్ కప్లో 3 పసిడి పతకాలు గెలిచిన రెండో భారత ఆర్చర్గా సురేఖ నిలిచింది. మహిళల, మిక్స్డ్, టీమ్ ఈవెంట్లలో ఆమె అగ్రస్థానాన్ని సాధించడం విశేషం. మహిళల ఈవెంట్ ఫైనల్లో టాప్ సీడ్ ఆండ్రియా బెకెరా (మెక్సికో)ను ఓడించింది. ఇద్దరి స్కోర్లు 146–146తో సమం కాగా...షూటాఫ్ ఫినిష్తో సురేఖ పైచేయి సాధించింది. మిక్స్డ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతిసురేఖ – అభిషేక్ వర్మ ద్వయం 158–157 స్కోరుతో లిసెల్ జాత్మా – రాబిన్ జాత్మా (ఎస్తోనియా)పై విజయం సాధించింది. మహిళల టీమ్ ఈవెంట్ తుది పోరులోలో సురేఖ, అదితి స్వామి, పర్ణీత్ కౌర్లతో కూడిన భారత జట్టు 236–225 తేడాతో ఇటలీ జట్టుపై గెలుపొందింది.పురుషుల విభాగంలో మరో 2 పతకాలు కూడా భారత్ ఖాతాలో చేరాయి. పురుషుల వ్యక్తిగత విభాగంలో ప్రియాన్‡్ష రజతం గెలుచుకున్నాడు. ఫైనల్లో అతను 147–150 తేడాతో నికో వీనర్ (ఆ్రస్టియా) చేతిలో ఓటమిపాలయ్యాడు. అయితే పురుషుల టీమ్ ఈవెంట్లో భారత్కు బంగారం లభించింది. ఫైనల్ అభిõÙక్ వర్మ, ప్రియాన్‡్ష, ప్రథమేశ్లతో కూడిన భారత జట్టు 238–231తో నెదర్లాండ్స్పై విజయం సాధించింది. ఈ టోర్నీ రికర్వ్ విభాగం ఫైనల్ మ్యాచ్లు ఆదివారం జరుగుతాయి. -
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
2024–25 ‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్లో పాల్గొనే 14 మంది గ్రాండ్మాస్టర్లను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, తమిళనాడు క్రీడాకారిణి ఆర్.వైశాలి భారత్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక సిరీస్లో మొత్తం 20 మంది ప్లేయర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.‘ఫిడే’ నిర్దేశించిన అర్హత (ర్యాంకింగ్) ప్రకారం 14 మందికి నేరుగా చోటు దక్కగా... మిగతా ఆరుగురిని నిర్వాహకులు నామినేట్ చేస్తారు. ముగ్గురు మాజీ ప్రపంచ చాంపియన్లు (క్లాసికల్) టాన్ జోంగ్యి, అలెగ్జాండ్రా కోస్టెనిక్, మారియా ముజీచుక్ కూడా టోర్నీ బరిలో నిలిచారు. ప్రస్తుత చాంపియన్ జు వెన్జున్ ఈ ఈవెంట్నుంచి తప్పుకుంది. మహిళల చెస్ను మరింత ఆదరణ పెంచే క్రమంలో పలు మార్పులతో గ్రాండ్ప్రి సిరీస్ను ఈ సారి కొత్తగా నిర్వహించనున్నట్లు ‘ఫిడే’ సీఈఓ ఎమిల్ సుటోవ్స్కీ వెల్లడించారు. ఇటీవల జరిగిన క్యాండిడేట్స్ టోర్నీలో హంపి రెండో స్థానంలో నిలిచింది. -
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
షాంఘై (చైనా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–1 టోర్నీలో భారత ఆర్చర్ల జోరు కొనసాగుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ–అభిషేక్ వర్మ (భారత్) జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో జ్యోతి సురేఖ–అభిషేక్ ద్వయం 155–151తో బెసెరా–మెండెజ్ (మెక్సికో) జంటను ఓడించింది. రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్–అంకిత (భారత్) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుంది. సెమీఫైనల్లో ధీరజ్ –అంకిత 0–6తో లిమ్ సిహైన్–కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ధీరజ్ మూడో రౌండ్లో 4–6 తో కెన్ సాంచెజ్ (స్పెయిన్) చేతిలో ఓటమి చవిచూశాడు. భారత్కే చెందిన తరుణ్దీప్ రాయ్ క్వార్టర్ ఫైనల్లో 3–7తో టెమినో (స్పెయిన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో భారత స్టార్ దీపిక కుమారి క్వార్టర్ ఫైనల్లో 6–4తో జెన్ హన్యంగ్ (కొరియా)పై నెగ్గి సెమీఫైనల్ చేరింది.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement