డెడ్బాడీ పక్కన కోటి రూపాయలు | Sakshi
Sakshi News home page

డెడ్బాడీ పక్కన కోటి రూపాయలు

Published Sat, Aug 20 2016 4:13 PM

డెడ్బాడీ పక్కన కోటి రూపాయలు

ఖరగ్పూర్: ముంబై నుంచి హౌరా వెళ్తున్న గీతాంజలి ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్రయాణికుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ విషయం గమనించిన తోటి ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైలు పశ్చిమబెంగాల్లోని ఖరగ్పూర్ స్టేషన్కు చేరుకోగానే పోలీసులు ప్రయాణికుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడికి సంబంధించిన లగేజిని పరిశీలించగా భారీ మొత్తంలో డబ్బు ఉన్నట్టు కనుగొన్నారు. ఓ బ్యాగ్లో కోటి రూపాయల నగదు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు.

మృతుడు చత్తీస్గఢ్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రయాణికుడి మరణానికి కారణమేంటి? ఆయన ఒంటరిగా అంత డబ్బును తీసుకువెళ్లడానికి గల కారణాలు తెలియాల్సివుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Advertisement
Advertisement