న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో పాటు గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకుని జోరు మీదున్న బీజేపీ.. ఈశాన్య భారత్ పై దృష్టి సారిస్తోంది. కమ్యూనిస్టుల ఏలుబడిలో ఉన్న త్రిపురను టార్గెట్ చేసింది. ఈశాన్య భారత్లో ఇప్పటికే అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్లలో కాషాయ జెండా ఎగురవేసిన కమలం పార్టీ.. ఇప్పుడు త్రిపురను సొంతం చేసుకోవాలని కలలు కంటోంది. వచ్చే ఏడాది జరిగే త్రిపుర ఎన్నికలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. అధికారంలోకి రాకపోయినా కనీసం కింగ్ మేకర్ అయినా కావాలని భావిస్తున్నారు.
త్రిపురలో ప్రస్తుతం సీపీఎం అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ గత 19 ఏళ్లుగా వరుసగా ఈ పదవిలో కొనసాగుతున్నారు. ఆయనకు ప్రజల్లో మంచి పేరు ఉంది. ఈ నేపథ్యంలో త్రిపురలో సీపీఎంను, మాణిక్ సర్కార్లను ఎదుర్కోవడం బీజేపీకి సవాలే. ఈ నేపథ్యంలో బీజేపీ తొలుత సీపీఎంను గాక ఇతర పార్టీలను బలహీనం చేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇందులో భాగంగా తృణమూల్ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది. 48 గంటల్లో త్రిపుర టీఎంసీ చీఫ్ రతన్ చక్రవర్తి సహా ఆ పార్టీకి చెందిన వందలాదిమంది నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు.
కాంగ్రెస్ నాయకులను ఆకర్షించేందుకు టీఎంసీ ప్రయత్నిస్తుండగా, టీఎంసీ నాయకులపై బీజేపీ వల వస్తోంది. ప్రత్యర్థి పార్టీ నాయకులను ఆకర్షించడంలో టీఎంసీతో పోలిస్తే బీజేపీయే జోరుమీదుంది. యూపీలాగే త్రిపుర ఎన్నికల్లోనూ బీజేపీ సునామీ సృష్టిస్తుందని కేంద్ర మంత్రి రాజెన్ గోహెయిన్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది త్రిపురతో పాటు ఈశాన్య రాష్ట్రాలు మేఘాలయా, నాగాలాండ్లలో కూడా ఎన్నికలు జరగాల్సివుంది.
బీజేపీ తర్వాతి టార్గెట్ ఈ రాష్ట్రమే!
Published Fri, Mar 24 2017 3:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజ్యాంగ పరిరక్షణకు నడుం బిగించాలి
శాసీ్త్రయ దృక్పథం అలవర్చుకోవాలి
అక్రమ కేసులు పెడుతున్నారు..
మూడు నియోజకవర్గాలకు అదనపు ఈవీఎంలు
బడి.. దందా!
పలుచోట్ల వడగళ్లు
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
‘దోస్త్’ సహాయ కేంద్రం ప్రారంభం
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
మెరుగైన వైద్య సేవలందించాలి●
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement