కుళ్లిన టమోటాలతో వంట చేస్తారా.. | Sakshi
Sakshi News home page

కుళ్లిన టమోటాలతో వంట చేస్తారా..

Published Tue, Sep 1 2015 5:04 PM

zp vice chairman fires on midday meals contractors

మధ్యాహ్న భోజన నిర్వహకులపై జెడ్పీవైస్ చైర్మన్ ఆగ్రహం
నంగునూరు (మెదక్ జిల్లా): విద్యార్థులకు కుళ్లిన టమాటలతో వంట చేస్తారా..ఇదేం వంట.. మీఇంట్లో ఇలాగే తింటారా.. అంటూ జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం రాజగోపాల్‌పేట ఉన్నత పాఠశాలను సారయ్య, గ్రామ సర్పంచ్ కనుకవ్వతో పాటు అధికారులు, గ్రామకమిటీ సభ్యులు సందర్శించారు. ఈసందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పప్పులో వేసేందుకు సిద్ధంగా ఉన్న టమోటాలను పరిశీలించి అందరు ఆశ్చర్యపోయారు. నిన్ననే తెచ్చామని నిర్వాహకులు సమాధానం చెప్పడంతో మీ ఇంట్లో ఇలాంటి కూరగాయలతో వంట చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. పిల్లలకు సరిపడా అన్నం పెట్టడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.

Advertisement
Advertisement