Sakshi News home page

టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో డిష్యుం డిష్యుం..

Published Sun, Oct 23 2016 3:17 PM

టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో డిష్యుం డిష్యుం.. - Sakshi

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం రసాభాసగా ముగిసింది. ఈ సమావేశంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రెండు వర్గాలకు చెందిన నాయకులు దాడులకు తెగబడ్డారు. 
 
కొత్త జిల్లాలకు నేతలను ఎంపిక చేసేందుకు జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఉదయం భేటీయ్యింది. ఈ భేటీలో నేతల మధ్య భిన్నాభ్రిపాయాలు తలెత్తాయి. సీనియర్లకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేత కల్యాడపు ఆగయ్య అడిగారు. దీన్ని కవ్వంపల్లి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇరువర్గాలు వాగ్వాదానికి దిగారు. కల్యాడపు, కవ్వంపల్లి వర్గీయులు తన్నుకున్నారు. దీంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.     
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement