పెర్త్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ ముందుగా బ్యాటింగ్ కు దిగింది. క్రిస్ గేల్, డ్వేన్ స్మిత్ ఓపెనర్లుగా వచ్చారు. టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ కొత్త బంతి అందుకున్నాడు.
Related news
-
సెమీస్ లో న్యూజిలాండ్
-
ఐసీసీ అధ్యక్షుడి రాజీనామా
ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. బుధవారం ఉదయం ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తాజాగా జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు అద్భుతమైన ఫామ్ను కనబరిచి క్వార్టర్స్ వరకు వెళ్లింది. అయితే క్వార్టర్స్లో టీమిండియా చేతిలో చిత్తయిన విషయం తెలిసిందే. ఐదోసారి విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కు వరల్డ్ కప్ ట్రోఫీని ఎవరు ఇవ్వాలన్న విషయంలో వివాదం రేగింది. తనను కనీసం ఆహ్వానించకపోవడంతో కమల్ తీవ్రంగా మనస్తాపానికి గురయ్యారు. ఐసీసీ రాజ్యాంగాన్ని దారుణంగా ఉల్లంఘించారని, అందుకే తాను రాజీనామా చేస్తున్నానని, ఇందులో రెండో ఆలోచనకు తావులేదని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. ఐసీసీ చైర్మన్ ఎన్.శ్రీనివాసన్ కు, ముస్తాఫా కమల్ కు మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు ఉన్నట్లు కథనాలు వచ్చాయి. మెల్ బోర్న్ లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసన్ తానే స్వయంగా ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ కు అందించారు. భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో అంపైరింగ్ లోపాల వల్లే బంగ్లా ఓడిందన్న వ్యాఖ్యలు కూడా కమల్ చేసినట్లు వినవచ్చింది. దాంతో ఆగ్రహించిన శ్రీనివాసన్.. నిబంధనలను తోసిరాజని.. ట్రోఫీని అందించే కార్యక్రమానికి తానే వెళ్లారు. ఇదే ముస్తఫా కమల్ మనస్తాపానికి కారణమైందని చెబుతున్నారు. -
వెటోరి బాటలో మరో బౌలర్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పేస్ బౌలర్ కైల్ మిల్స్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు బుధవారం ప్రకటించారు. ప్రపంచకప్ ముగిసిన రోజునే కివీస్ ఆల్ రౌండర్ డానియల్ వెటోరి క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పేసర్ అదే బాట పడ్డారు. మిల్స్ టాప్ - 10 వన్డే బౌలర్ల జాబితాలో.. నెంబర్ వన్ ర్యాంకులో చాలాకాలం పాటు కొనసాగారు. 'క్రికెట్ అంటే నాకు చాలా ఇష్టం. నా 36 ఏళ్ల జీవితంలో 14 ఏళ్ల పాటు క్రికెట్లోనే ఉన్నాను. ఇన్నాళ్లు క్రికెట్ జీవితాన్ని గడిపిన నాకు సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నాననే అనిపిస్తోంది. ఇకనుంచి ఎక్కువ సమయాన్ని నా కుటుంబ సభ్యులతో ఉండటానికి కేటాయిస్తాను' అని మిల్స్ అన్నారు. మిల్స్ న్యూజిలాండ్ జట్టులో 170 వన్డేలు ఆడి 240 వికెట్లు పడగొట్టాడు. మూడు ప్రపంచకప్ టోర్నీల్లో ఆడాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ జాబితాలో వెటోరి (297) తర్వాత స్థానం మిల్స్దే. కెరీర్లో 42 టీ20లు, 19 టెస్టు మ్యాచ్లు ఆడాడు. టెస్టు కెరీర్లో 13 ఓవర్లలో 4/16, వన్డే కెరీర్లో 5/25 మిల్స్ బౌలింగ్లోని అత్యుత్తమ గణాంకాలు. ఇంగ్లండ్తో 2008లో హామిల్టన్లో జరిగిన మ్యాచ్లో మిల్స్ ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ అలిస్టర్ కుక్, కెవిన్ పీటర్సన్, మైకేల్ వాన్, ఆండ్రూ స్ట్రాస్లను పెవిలియన్కు పంపించి జట్టుకు ఘన విజయాన్ని అందించడంలో మిల్స్ ప్రతిభ చిరకాలం గుర్తుండి పోతుంది. -
వాళ్లు కప్ గెలిచారు... వీళ్లు మనసులు గెలిచారు!
ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి క్రికెట్ ప్రపంచకప్ గెలిచింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆటకు సంబంధించి వాళ్లకు ఫుల్ మార్కులు ఇచ్చేశాం. కానీ వాళ్ల ప్రవర్తన సంగతేంటి? ఫైనల్లో కంగారూల వెకిలి ప్రవర్తన ఇప్పుడు వాళ్ల దేశంలోనే చర్చగా మారింది. ఫైనల్లో మ్యాక్స్వెల్ బౌలింగ్లో గప్టిల్ అవుట్ కాగానే హాడిన్ బ్యాట్స్మన్ మొహం మీదే గ్లౌవ్స్తో చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత వెటోరి, ఇలియట్ అవుటైన సందర్భాల్లో ఆస్ట్రేలియన్లు నోరు అదుపు చేసుకోలేకపోయారు. ఈ ఇద్దరిని దారుణంగా తిట్టారట. ఇలాంటి సంఘటనలు ప్రపంచకప్లో జరగకుండా చూస్తామని ఐసీసీ మాట ఇచ్చింది. కానీ ఆస్ట్రేలియన్లకు ఇది పట్టలేదు. అయినా ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఎందుకు... ఆసీస్ ప్రపంచకప్ గెలిచిందనా? గెలిచిన వాళ్లకు శిక్ష ఉండకూడదనా? ఈ విషయంలో క్లార్క్ తెలివిగా వ్యవహరించానని అనుకుంటున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే... ‘నేను చూడలేదు’, ‘లైన్ క్రాస్ చేయలేదు’, ‘ఆస్ట్రేలియన్లు క్రికెట్ ఆడే విధానం’ అనే పాత మాటలనే వల్లె వేశాడు. ఒక పెద్ద మ్యాచ్లో తమ ప్రవర్తనతో ప్రత్యర్థి దేశ మద్దతుదారులను ఎంత గాయపరుస్తున్నామో ఆస్ట్రేలియా క్రికెటర్లు అర్థం చేసుకోలేకపోయారు. కేవలం తాము మాత్రమే దేశం కోసం ఆడతామని ఆస్ట్రేలియన్లు భావిస్తున్నట్లున్నారు. ప్రత్యర్థి క్రికెటర్లు కూడా ఓ దేశం కోసమే ఆడుతున్నారని, వాళ్లని గౌరవించాలని ఎందుకు అనుకోలేదో అర్థం కాలేదు. ఈ ప్రపంచకప్లో న్యూజిలాండ్ కంటే తపనతో ఆడిన జట్టు లేదు. కానీ వాళ్ల ఆటలో ఎక్కడా ఈ ‘రోత’ లేదు. దక్షిణాఫ్రికాపై సెమీఫైనల్లో గెలిచాక మెకల్లమ్ ఓ మాట అన్నాడు. ‘తిట్టడం మా ఆటలో ఎప్పుడూ భాగం కాదు. దాని మీద ఎప్పుడూ దృష్టిపెట్టం కూడా’ అని చెప్పాడు. ఆ సెమీఫైనల్లో ఇలియట్ సిక్సర్ కొట్టగానే దక్షిణాఫ్రికా గుండె పగిలింది. స్టెయిన్ నేల మీద పడుకుండిపోయాడు. ఇలియట్ వచ్చి స్టెయిన్ను పైకి లేపి ఓదార్చిన తర్వాతే సహచరుల దగ్గరకు సంబరాలకు వెళ్లాడు. ఫైనల్లో క్లార్క్ అవుటయ్యే సమయానికి న్యూజిలాండ్ మ్యాచ్ దాదాపుగా ఓడిపోయింది. ఆ సమయంలోనూ నలుగురు న్యూజిలాండ్ క్రికెటర్లు క్లార్క్ దగ్గరకు వచ్చి అభినందించి వెళ్లారు. 18 ఏళ్ల పాటు న్యూజిలాండ్ క్రికెట్కు సేవలు అందించిన వెటోరిని ఏ ఒక్క ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా అభినందించాడా? లేదు. నిజానికి దక్షిణాఫ్రికాపై న్యూజిలాండ్ గెలిచిన మ్యాచ్లో అక్కడ కివీస్ బదులు ఆసీస్ ఆటగాళ్లు ఉండి ఉంటే... ఇలియట్ తరహాలో ఎవరైనా ప్రత్యర్థిని ఓదార్చేవారా? కచ్చితంగా లేదు. ఆస్ట్రేలియన్ల మనస్తత్వం అది కాదు. న్యూజిలాండ్ ఆటగాళ్లు చాలా మృదుస్వభావులు. ఇదే ప్రపంచకప్లో ఆక్లాండ్లో లీగ్ మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయింది. ఆ సమయంలో కివీ ఆటగాళ్లు తమ సహజ శైలిలో ప్రత్యర్థి బాగా ఆడినందుకు అభినందించారు. కానీ దీనిని కంగారూలు జీర్ణించుకోలేకపోయారట. ‘ఆ మ్యాచ్లో మేం ఓడిపోయాక వాళ్లు చూపించిన మంచితనం మమ్మల్ని హర్ట్ చేసింది. ఫైనల్లో గెలిచినా వాళ్లు అంతే పొందికగా వచ్చి మమ్మల్ని అభినందిస్తారు. దానిని తట్టుకోవడం మా వల్ల కాదు. అందుకే ఫైనల్కు ముందు టీమ్ మీటింగ్లో నేను ఓ విషయం స్పష్టం చేశా. ‘మనం వాళ్లపై ఎంత దారుణంగా మాటల యుద్ధం చేస్తే అంత మంచిది’ అని సూచించా’ అని కప్ గెలిచాక హాడిన్ చెప్పడం ఆస్ట్రేలియన్ల మనస్తత్వాన్ని సూచిస్తోంది. ఫైనల్లో మెకల్లమ్ స్ట్రయికింగ్కు రాగానే హాడిన్ వచ్చి తిట్టి వెళ్లాడు. ఫైనల్ ముగిశాక మీడియా సమావేశంలో మెకల్లమ్ను... మీరు రిటైర్ అవుతున్నారా? అని మీడియా ప్రశ్నించింది. దీనికి మెకల్లమ్ చెప్పిన సమాధానం... ‘ఈ రోజు ఆస్ట్రేలియా అద్భుతంగా ఆడి కప్ గెలిచింది. ప్రతి దేశంలో ఇదే హెడ్లైన్ కావాలి. నా రిటైర్మెంట్ లాంటి వార్త గురించి ఈ సందర్భంలో రాయడం అనవసరం. దయచేసి ఇది రెండు రోజుల తర్వాత మాట్లాడుకుందాం’ అని చెప్పాడు. ఆస్ట్రేలియా కప్ గెలిచి ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ తమ ప్రవర్తనతో అభిమానుల మనసులు గెలిచింది. - సాక్షి క్రీడావిభాగం -
వరల్డ్ కప్ హీరోలకు షాక్
సిడ్నీ: వన్డే వరల్డ్ కప్ హీరోలకు క్రికెట్ ఆస్ట్రేలియా గట్టి షాక్ ఇచ్చింది. ఫైనల్లో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గెలుకున్న ఆల్ రౌండర్ జేమ్స్ ఫాల్కనర్, విధ్వంసకర ఇన్నింగ్స్ లో సెంచరీ బాదిన మ్యాక్స్ వెల్ ను జట్టు నుంచి సాగనంపింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ పర్యటన కోసం 17 మంది ఆటగాళ్లతో ఎంపిక చేసిన టీమ్ లో వీరికి చోటు ఇవ్వలేదు. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఫాల్కనర్ 3 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన సంగతి తెలిసిందే. ఇక మ్యాక్స్ వెల్ శ్రీలంకతో జరిగిన లీగ్ మ్యాచ్ లో 51 బంతుల్లో సెంచరీ కొట్టి ప్రపంచకప్ లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేశాడు. పాకిస్థాన్ సంతతికి చెందిన లెగ్ స్పిన్నర్ ఫవద్ అహ్మద్, బ్యాట్స్ మన్ ఆడమ్ వొగ్స్, వికెట్ కీపర్ పీటర్ నెవిల్ ను జట్టులోకి తీసుకున్నారు. గాయం కారణంగా జేమ్స్ పాటిస్సన్ ను ఎంపిక చేయలేదు. జూన్ 5 నుంచి ప్రారంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో ఆస్ట్రేలియా రెండు టెస్టులు ఆడుతుంది. జూలై 8 నుంచి ఇంగ్లండ్ తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. రియాన్ హారిస్ ను ఒక్క యాషెస్ సిరిస్ కే ఎంపిక చేశారు.
Related News by category
-
CWC 2023 SA VS SL: శ్రీలంకను చిత్తు చేసిన సౌతాఫ్రికా
సౌతాఫ్రికా-శ్రీలంక జట్ల మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా సెంచరీల మోత మోగించింది. ఈ రోజు (శనివారం) జరిగిన పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. ఈ మ్యాచ్లో ఏకంగా ముగ్గురు సౌతాఫ్రికా ఆటగాళ్లు శతక్కొట్టారు. క్వింటన్ డికాక్ (84 బంతుల్లో 100; 12 ఫోర్లు, 3 సిక్సర్లు), రస్సీ వాన్ డెర్ డస్సెన్ (110 బంతుల్లో 108; 13 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎయిడెన్ మార్క్రమ్ (54 బంతుల్లో 106; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకాల మోత మోగించడంతో సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి రికార్డు స్థాయిలో 428 పరుగులు చేసింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఇదే అత్యధిక టీమ్ స్కోర్గా రికార్డుల్లోకెక్కింది. A stellar batting performance helps South Africa to a massive win in their #CWC23 clash against Sri Lanka 💪#SAvSL 📝: https://t.co/6P9uKyV5lF pic.twitter.com/LxZPnRHPKN — ICC Cricket World Cup (@cricketworldcup) October 7, 2023 అయితే 428 పరుగుల భారీ లక్ష్యాన్ని చేరుకోవడంలో శ్రీలంక జట్టు విఫలమైంది. లక్ష్య ఛేదనలో శ్రీలంక ఆరంభంలోనే ఓపెనర్లను కోల్పోయింది. నిస్సంక (0) డకౌట్ అయ్యాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (7) కూడా ఔటయ్యాడు. ఇక ఈ తరుణంలో క్రీజులోకి వచ్చిన కుశాల్ మెండీస్ మాత్రం తన ఆటతో శ్రీలంక జట్టు పై ఆశలు రేకెత్తించాడు. మొత్తం 8 సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. అనంతరం కగిసో రబడ బౌలింగ్లో ఔటయ్యాడు. ఈ దశలో చరిత్ అసలంక, దాసున్ షనకలు కాసేపు జట్టు విజయం కోసం పోరాటం చేశారు. వీరిద్దరు తమ జోరు చూపించారు. ఆ సమయంలో శ్రీలంక లక్ష్యానికి చేరువయ్యే అవకాశం కనిపించింది. అయితే అసలంక, ఆ తర్వాత షనక ఔటవ్వడంతో 326 పరుగుల వద్దే శ్రీలంక కథ ముగిసింది. మొత్తానికి 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. స్కోర్లు: సౌతాఫ్రికా- 428, శ్రీలంక- 326 -
తీవ్ర విషాదం.. క్రికెటర్ ఈశ్వర్ ఇకలేరు
విశాఖపట్నం: జీవీఎంసీ 68వ వార్డు గుడివాడ అప్పన్నకాలనీకి చెందిన క్రికెటర్ సోముదల ఈశ్వర్(40) కన్నుమూశారు. ఆగస్టు 28వ తేదీనే ఆయన గుండెపోటుతో మృతి చెందగా.. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన క్రికెట్ అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. విశాఖలో డివిజన్ క్రికెట్ ఆడుతూనే ఈశ్వర్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఏసీఏకు చేదోడు వాదోడుగానూ ఉంటూ.. టోర్నీల నిర్వహణలో సహాయం అందించేవాడు. అలా ఆయన ప్రతిభ ఐపీఎల్కు తాకింది. ఎడమ చేతి వాటం బౌలర్ అయిన ఈశ్వర్ ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్ బ్యాటర్లకు నెట్స్లో బంతులు విసిరేందుకు సహాయకుడిగా చేరాడు. ఐపీఎల్లో సపోర్టింగ్ స్టాఫ్గా ప్రస్థానం కొనసాగిస్తూనే.. విశాఖలో జరిగిన ఏపీఎల్ సీజన్ పాల్గొన్నాడు. ఇటీవల ఏపీఎల్ సీజన్ ముగియడంతో అప్పన్నకాలనీలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ నెల 28న స్నేహితులతో బయటకు వెళ్లి తిరిగి రాత్రి 8.30 గంటలకు ఇంటికి వచ్చాడు. బైక్ దిగి స్టాండ్ వేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడని తల్లి రాములమ్మ తెలిపారు. ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందాడని బోరున విలపించారు. ఈ వార్త విన్న భారత క్రికెటర్ శ్రీకర్ భరత్.. ఈశ్వర్ ఇంటికి చేరుకుని ఆయన పార్థివదేహానికి నివాళులర్పించారు. ఈశ్వర్కు వివాహం కాలేదు. క్రికెటర్ వేణుగోపాల్తో సాన్నిహిత్యం తన 16వ ఏటనే క్రికెట్ ప్రపంచంలోకి అడుగు పెట్టిన ఈశ్వర్కు పేదరికం వెంటాడింది. 10వ తరగతి వరకు చదువుకున్న ఈశ్వర్ క్రికెట్టే ప్రపంచంగా భావించాడు. క్రికెటర్ వేణుగోపాల్, ఈశ్వర్ ఇద్దరూ రంజీ సెలక్షన్కు వెళ్లారు. వేణుగోపాల్ రంజీకి ఎంపిక కాగా.. ఈశ్వర్కు నిరాశే మిగిలింది. అయినా ఏనాడు కుంగిపోలేదు. ఈ క్రమంలో ఈశ్వర్పై అభిమానం పెంచుకున్న వేణుగోపాల్ తనతో పాటు పలు మ్యాచ్లకు తీసుకువెళ్లేవాడు. ఈశ్వర్ ఫాస్ట్ బౌలర్. గంటకు 150 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసేవాడు. ఈశ్వర్ బౌలింగ్ అంటే భారత క్రికెటర్లకు ఎంతో ఇష్టం. అందుకే స్టార్ క్రికెటర్లు ఆయనతో బౌలింగ్ వేయించుకుని నెట్ ప్రాక్టీస్ చేసేవారు. దీంతో ఈశ్వర్కు ఎక్కువగా భారత క్రికెట్ క్యాంపుల్లో అవకాశం దక్కేది. అలా సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సౌరవ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, దినేష్ కార్తీక్, రికీ పాటింగ్, డేవిడ్ వార్నర్.. తదితర ఎంతో మంది క్రికెటర్లకు అభిమానిగా మారాడు. ఈశ్వర్ను ఎక్సట్రా ప్లేయర్గా అన్ని విషయాల్లో సమానంగా చూసుకునే వారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మరణవార్త తెలుసుకున్న క్రికెటర్లు దిగ్భ్రాంతికి గురయ్యారు. తమ ప్రగాఢ సానుభూతిని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈశ్వర్ మృతి బాధాకరం నేనూ ఢిల్లీ కాపిటల్స్ జట్టుకు ప్రస్తుత సీజన్ ఐపీఎల్లో ఆడాను. జట్టుతో పాటు ప్రాక్టీస్ చేసేప్పుడు ఈశ్వర్ నెట్స్లో బంతులు విసిరేవాడు. ఇద్దరం విశాఖ వాసులమే కావడంతో తొలినాళ్ల నుంచి అతనితో పరిచయం ఉంది. అతను అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరం. – భరత్, భారత టెస్ట్ క్రికెటర్ ప్రగాఢ సానుభూతి మా అన్ని శిక్షణ సెషన్స్, మ్యాచ్ల్లో జట్టుకు సహాయకారిగా ఉన్న ఈశ్వర్ను మిస్ కావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. మా ప్రియమైన సైడ్ ఆర్మ్ స్పెషలిస్ట్ ఈశ్వర్ ఇకలేరు. ఈ క్లిష్ట సమయంలో అతని కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. – ఢిల్లీ కాపిటల్స్ మేనేజ్మెంట్ -
గోల్ కొట్టిన విరాట్కోహ్లీ.. జస్ట్మిస్
క్రికెట రారాజు విరాట్కోహ్లీ ... ఫుట్బాల్ మైదానంలో సందడి చేశాడు. క్రికెట్ ఆటలో ఎంతో కచ్చితత్వంతో బాల్ని బౌండరీలు దాటించే కోహ్లీ.. అదే తీరుని ఫుట్బాల్ మైదానంలోనూ చూపించాడు. ఆక్సిడెంటల్ క్రాస్బార్ ఛాలెంజ్ పేరుతో చాలా దూరం నుంచి గోల్పోస్ట్కి గురి పెట్టాడు కోహ్లీ. తన నైపుణ్యం అంతా ఉపయోగించి బాల్ని కిక్ చేశాడు. గోల్కీపర్ను తప్పించుకుని గోల్పోస్ట్లో బాల్ పడినట్టే అనిపించింది. అయితే చివరి క్షణంలో గోల్పోస్ట్ పోల్కి బాల్కి అడ్డుగా నిలిచింది. దీంతో గోల్ మిస్ అయ్యింది. క్రికెట్లోనే కాదు ఫుట్బాల్లోనూ కోహ్లీ ఆటకు అభిమానులు ఫిదా అవుతున్నారు Accidental crossbar challenge 😂 pic.twitter.com/koeSSKGQeb — Virat Kohli (@imVkohli) May 25, 2021 -
ఇంగ్లండ్కు భారీ షాక్: న్యూజిలాండ్తో సిరీస్కు ఆర్చర్ దూరం
లండన్: న్యూజిలాండ్తో టెస్టు సిరీస్కు ముందు ఇంగ్లండ్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా దూరమయ్యాడు. మోచేతి గాయం తిరగబెట్టడంతో వచ్చే నెలలో న్యూజిలాండ్తో జరిగే రెండు టెస్టులకు అతడు అందుబాటులో ఉండడని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. గాయం కారణంగా భారత్ పర్యటన, ఐపీఎల్లకు దూరమైన ఆర్చర్.. కౌంటీ క్రికెట్లో ససెక్స్ తరపున పునరాగమనం చేశాడు. మళ్లీ గాయం తిరగబెట్టడంతో కేవలం ఐదు ఓవర్లు బౌలింగ్ చేసిన వెంటనే మైదానాన్ని వీడాడు. ఇంగ్లాండ్, ససెక్స్ సీమర్ జోఫ్రా ఆర్చర్ వచ్చే నెల న్యూజిలాండ్తో జరిగే టెస్టు సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటనలో పేర్కొంది. బౌలింగ్ చేసేటప్పుడు అతని కుడి మోచేయి నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్ చివరి రెండు రోజులలో బౌలింగ్ చేయలేకపోయాడని ఈసీబీ వివరించింది. ఇంగ్లండ్,న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ జూన్ 2న లార్డ్స్ మైదానంలో ప్రారంభంకానుంది. చదవండి: శ్రీలంక ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత -
ఆటగాళ్లకు షాకిచ్చిన శ్రీలంక క్రికెట్ బోర్డు
కొలంబో: శ్రీలంక క్రికెట్ బోర్డులో ఆటగాళ్ల జీతాలు తగ్గించడంపై వివాదం తలెత్తింది. ఆటగాళ్ల జీతాల్లో 35 శాతం కోత విధిస్తూ శ్రీలంక క్రికెట్ బోర్డ్ నిర్ణయం తీసుకొన్నది. దీంతో కెప్టెన్ కరుణరత్నే, మాథ్యూస్,సురంగ లక్మల్,దినేష్ చండిమల్ సహా పలువురు సీనియర్ క్రికెటర్లు ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించారు. కొత్త కేంద్ర ఒప్పందం ప్రకారం వికెట్ కీపర్లు నిరోషన్ దిక్వేలా, ధనంజయ్ డి సిల్వా మాత్రమే లబ్ధి పొందనున్నారు. ఈ ఇద్దరు ఆటగాళ్ల నెలసరి జీతం దాదాపు రూ.73 లక్షలు. బోర్డు వీరిని టాప్ క్యాటగిరిలో వేసింది. దీంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ వన్డే సిరీస్పై నీలినీడలు కమ్ముకున్నాయి. మే 23 నుంచి బంగ్లాదేశ్లో ఈ జట్టు 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఆడవలసి ఉన్నది. కెప్టెన్కు కూడా తగ్గనున్న జీతం అద్భుతమైన ఫామ్లో ఉన్న కెప్టెన్ కరుణరత్నేకు కూడా ఆయన జీతంలో రూ.22 లక్షలు కోత విధించారు. ఈ ఏడాది జనవరిలో వాండరర్స్లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో సెంచరీ చేసిన కరునరత్నే.. బంగ్లాదేశ్తో సిరీస్లో 3 ఇన్నింగ్స్లలో 427 పరుగులు చేసి తానేంటో నిరూపించుకున్నాడు. అయినప్పటికీ బోర్డు నుంచి ఏమాత్రం ఉపశమనం లభించలేదు. కొత్త కాంట్రాక్టులో కరుణరత్నే జీతం రూ.73 లక్షల నుంచి రూ.51 లక్షలకు తగ్గించారు. (చదవండి:10-12 ఏళ్లు.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా: సచిన్)
Advertisement
Photos
View allVideo
View allఅతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
రిషబ్ పంత్కు భారీ షాక్.. ఒక మ్యాచ్ నిషేధం
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement