పాక్ కోడలి ఆశలన్నీ భారత్పైనే | Sakshi
Sakshi News home page

పాక్ కోడలి ఆశలన్నీ భారత్పైనే

Published Sun, Feb 15 2015 12:28 PM

పాక్ కోడలి ఆశలన్నీ భారత్పైనే

భారత్- పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోందంటే దేశంలో ప్రతి ఒక్కరికీ ఆసక్తే. మరి రెండు దేశాలకూ సంబంధించిన వాళ్ల విషయం ఏమిటి? వాళ్లు ఎవరు గెలవాలని కోరుకుంటారు.. సహజంగానే తాను భారతదేశం వైపే మొగ్గు చూపుతానని పాకిస్థాన్ కోడలు, హైదరాబాదీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా అంటోంది. ఇప్పటికే ప్రపంచకప్లో పాకిస్థాన్ మీద భారత్ 5-0 విజయాలు నమోదు చేసుకుందని, ఆరోసారి కూడా కచ్చితంగా మన దేశమే గెలుస్తుందని చెబుతోంది.

పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్ను పెళ్లి చేసుకున్న సానియా.. ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే మాత్రం టీమిండియా వైపే మొగ్గు చూపిస్తోంది. భారత్ - పాక్ మ్యాచ్ అంటేనే అందరికీ చాలా ఉద్వేగంగా ఉంటుందని, అందులో తాను ఎప్పుడూ భారత్వైపే ఉంటానని తెలిపింది. రెండు టీవీ ఛానళ్లకు కామెంట్రీ చెప్పడం కోసం షోయబ్ మాలిక్ భారత్లోనే ఉన్నాడని, అందువల్ల తాను ఒక్కదాన్నే దుబాయ్లో మ్యాచ్ చూస్తున్నానని సానియా చెప్పింది.

Advertisement
Advertisement