హైదరాబాద్:
తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర అన్యాయం జరగబోతోందని, ఇంత అన్యాయం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆందోళన బాట పట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంగుతిన్నారు. నీటి కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం చేపట్టడం ద్వారా ఆంధ్రప్రాంతానికి తీవ్ర నష్టం జరుగుతుందని, ఆ ప్రాంత ప్రజల సాగునీటి, తాగునీటి సమస్య తీవ్రమవుతుందని జగన్ ఆందోళన బాట పట్టారు. చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఆయన మాచర్లలో ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన నీటి సమస్యపై జగన్ పోరాటబాట పట్టడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఓటుకు నోటు కేసు బయటపడిన తర్వాత కాలం నుంచి చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఇరు రాష్ట్రాల మధ్య కీలకమైన జల వివాదం విషయంలో చంద్రబాబు నోరెత్తకపోవడంలోని ఆంతర్యమేంటని మాచర్లలో ధర్నాలో జగన్ ప్రశ్నించారు.
దాంతో డిఫెన్స్ లో పడిన చంద్రబాబు సోమవారం నాటి మంత్రిమండలి సమావేశంలో ఈ అంశం ఎజెండాలో లేకపోయినప్పటికీ.. దానిపైనే చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన జగన్ చేపట్టిన ఆందోళన వల్ల టీడీపీకి నష్టం జరుగుతుందని గ్రహించి ఆ ప్రమాదం నుంచి బయటపడటం ఎలా అన్న అంశంపై ఆయన తర్జన భర్జన పడినట్టు తెలిసింది. కేబినెట్ లో ఈ అంశంపై చర్చించి తాము ఏదో ప్రయత్నం చేస్తూనే ఉన్నామని చెప్పడానికే కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించారు. కృష్ణా, గోదావరి నదులపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ఆమోదంతోనే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని, అక్రమ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రాన్ని కోరాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే, కృష్ణా గోదావరి ఎపెక్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని కోరారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా ఆంధ్రాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, దాన్ని అడ్డుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. అయినా చంద్రబాబు మాత్రం కేసీఆర్ పై ఒక్కమాట మాట్లాడలేదు. కేబినేట్ సమావేశం అనంతరం సాయంత్రం చంద్రబాబు స్వయంగా మీడియాతో మాట్లాడినప్పటికీ ఈ విషయంలో సూటిగా చెప్పకుండా తమ అభ్యంతరాలను తెలియజేస్తూ కేంద్ర మంత్రికి లేఖ రాయాలని నిర్ణయించినట్టు మాత్రం చెప్పారు.
తెలంగాణ చేపడుతున్న ఆ ప్రాజెక్టు వల్ల తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసినా కేసీఆర్ పై చంద్రబాబు గట్టిగా మాట్లాడకపోవడమేంటని కేబినెట్ కు హాజరైన పలువురు మంత్రులు పెదవి విరిచారు. చంద్రబాబుకు ఉన్న ఇబ్బందుల కారణంగానే గట్టిగా నోరెత్తలేకపోతున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
డిఫెన్స్లో పడిన చంద్రబాబు!
Published Mon, May 2 2016 10:11 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
టుడేస్ లీడర్: రోజా హ్యాట్రిక్! వన్స్ మోర్ జగన్
ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ దూరం.. బాబు కుట్రకు పురంధేశ్వరి బలి
టీ20 వరల్డ్కప్కు నేపాల్ జట్టు ప్రకటన..
ఈసీ నిషేధంపై స్పందించిన కేసీఆర్
చిన్న విషయానికి చిల్లర గొడవ.. కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు
వీళ్లే మన ఏలూరు అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి..
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి నా విజ్ఞప్తి: సీఎం జగన్
కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
గెలుపు ధీమా.. జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement