వాకౌట్ చేసేందుకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో ప్రతిపక్షం తీవ్ర ఆందోళనకు దిగింది. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో ఇది చోటుచేసుకుంది. ఒక ప్రశ్న నుంచి మరో ప్రశ్నకు వెళ్లే ముందు తమను గమనించాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. సబ్జెక్టుపై నిరసన తెలిపే అవకాశాన్ని తమకు కల్పించాలని ఆయన కోరారు. తాము చేతులు ఎత్తుతున్నా.. ఇటువైపు చూడకుండా మరోప్రశ్నకు అవకాశం ఇవ్వడం సరికాదని అన్నారు. కనీసం రేపటినుంచైనా ఇలాంటి పరిస్థితి రాకుండా చూడాలని అన్నారు. అసెంబ్లీలో తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అబద్ధాలు చెబితే తమకు నిరసన తెలిపే అవకాశం ఇవ్వరా అని వైఎస్ జగన్ అన్నారు. మైనార్టీ సంక్షేమం, మహిళా సాధికారతపై తమ పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు చెప్పిన సమాధానాలు తమకు సంతృప్తి కలిగించలేదని చెప్పారు. దీనిపై నిరసన తెలిపే హక్కు తమకు ఉందని అన్నారు. ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నిరసన తెలిపేందుకు కూడా అవకాశం ఇవ్వకపోతే ఎలాగని అన్నారు. అప్పటికే వైఎస్ఆర్సీపీ సభ్యులు పోడియం ఎదుట బైఠాయించారు. దాంతో సభ్యులను వెనక్కి వెళ్లాల్సిందిగా శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు కోరారు. ఈ మేరకు ప్రతిపక్ష నాయకుడికి తాను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. దాంతో మంత్రి యనమల విజ్ఞప్తిని అంగీకరించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష సభ్యులు ఆందోళనను విరమించారు.
అంతకుముందు.. మైనారిటీ సంక్షేమ నిధుల వ్యవహారంలో లెక్కలు తప్పుగా చెప్పిన అధికార పక్షం ఇరుకున పడింది. సంక్షేమం అంకెలపై తానిచ్చిన వివరణకు కట్టుబడి ఉన్నానని మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తానని ఆయన అన్నారు. ఆయన సవాలుకు వైఎస్ఆర్సీపీ తాము సిద్ధమని తెలిపింది. మంత్రి పల్లె వివరాలు చెప్పబోతుండగా.. మరో మంత్రి యనమల రామకృష్ణుడు అడ్డుకున్నారు. పల్లె రఘునాథరెడ్డి సవాలుపై చర్చ సాగనీయకుండా అధికార పక్షమే అడ్డుకుంది. దాంతో సవాలు నుంచి పారిపోతున్నారంటూ సభలో వైఎస్ఆర్సీపీ సభ్యులు వ్యాఖ్యానించారు. సంక్షేమ నిధులపై చర్చకు ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ఆ తర్వాత కూడా సభలో గందరగోళం కొనసాగింది.
వాకౌట్ చేసేందుకూ అవకాశం ఇవ్వరా?
Published Wed, Mar 16 2016 12:37 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement