29న బంద్‌ను విజయవంతం చేయాలి | Sakshi
Sakshi News home page

29న బంద్‌ను విజయవంతం చేయాలి

Published Sat, Aug 22 2015 1:38 AM

29 strike should succeed

 పట్నంబజారు : ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 29వ తేదీన వైఎస్సార్‌సీపీ నిర్వహించ తలపెట్టిన బంద్‌ను జయప్రదం చేసేందుకు పార్టీ అనుబంధ సంఘాలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి పిలుపునిచ్చారు. అరండల్‌పేటలోని తన కార్యాలయంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్రతి డివిజన్‌లో కమిటీలు వేసుకుని పార్టీని మరిం త బలోపేతం చేసేందుకు దృష్టి సారించాలన్నా రు.
 
 ప్రతి నేత సమన్వయంతో ప్రజా సమస్యలపై సమర శంఖాన్ని పూరించాలన్నారు. బంద్‌ను జయప్రదం చేసేందుకు సన్నాహాల్లో భాగంగా  27వ తేదీన నగరంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శన ద్వారా ప్రజల్లో ప్రత్యేక హోదాపై అవగాహన పెంచి స్వచ్ఛందంగా బంద్‌లో భాగస్వామ్యులు అయ్యేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. సమావేశంలో పార్టీ నగర అనుంబంధ విభాగాల అధ్యక్షులు ఎలికా శ్రీకాంత్‌యాదవ్, కోటా పిచ్చిరెడ్డి, గనిక ఝాన్సీరాణి, దాసరి కిరణ్‌కుమార్, పల్లపు రాఘవ, షేక్ జానీ, ఆరుబండ్ల వెంకటకొండారెడ్డి, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement