-
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
వైవీయూ: ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన ‘సిద్ధం’ పాటల సీడీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ ఆవిష్కరించారు. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీడీని రూపొందించిన సూర్య చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ఎన్ఆర్ఐ సూర్యనారాయణ, పాటల రూపకర్త, ట్రస్టు అధ్యక్షుడు డాక్టర్ ఎం.ప్రభాకర్లను భారతమ్మ అభినందించారు.ఈ సందర్భంగా డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ.. ‘జనహృదయాల్లోకి చొచ్చుకెళ్లే శక్తి పాటకు ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్న సంక్షేమ యజ్ఞాన్ని పాటల రూపంలో గ్రామస్థాయికి తీసుకెళ్లడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. సోషల్ మీడియా ద్వారా కోట్లాది మంది అభిమానులకు ఈ పాటలను అందుబాటులోకి తెస్తాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో ‘సిద్ధం’ పాటల సీడీ రూపకల్పనకు సహకారం అందించిన బి.రామతులసి, డా.వి.ఉష, ఎన్.సుదీప్రెడ్డి పాల్గొన్నారు. -
వందశాతం లక్ష్యంగా హోమ్ ఓటింగ్
రాయచోటి: జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ఆదివారం కూడా కొనసాగింది. శుక్రవారం నుంచి పలువురు వృద్ధులు ఇంటి వద్ద నుంచి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ హోమ్ ఓటింగ్ను పర్యవేక్షిస్తున్నారు. హోమ్ ఓటింగ్ ఆప్షన్ను ఎంచుకున్న 714 మంది ఓట్ల వివరాలను సేకరించి ఈ మేరకు ఎన్నికల సంఘం ఏర్పాట్లను చేసింది. హోమ్ ఓటింగ్ను ఎంచుకున్న ఓటర్ల ఇంటి వద్దకే అధికారుల బృందం వెళ్లి బ్యాలెట్ పేపర్లను అందజేస్తోంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 9782 మంది వృద్ధులు, పీడబ్ల్యుడీలు 18,153 మంది హోమ్ ఓటింగ్ అర్హత కలిగి ఉన్నారు. వీరిలో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు 9782 మంది, 40 శాతం అంగవికలత్వం పైబడిన దివ్యాంగులు 18,153 మంది ఉన్నట్లు వారు తెలిపారు. వీరిలో కేవలం 714 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. శుక్ర, శనివారాలలో 458 మంది తమ ఓటు వినియోగించుకున్నారు. -
పసుపు–కుంకుమ తప్ప ఏమీ ఇచ్చింది లేదు: మహిళలు
ఉదయం 7 గంటల సమయంలో హైవే పక్కనే దుంపలగట్టు వద్ద కనకాంబరాలు పూలు కోస్తున్న మహిళలను సాక్షి బృందం పలకరించింది. ప్రభుత్వ పాలన ఎలా ఉందమ్మా అంటే బ్రహ్మాండమని టక్కున ముక్త కంఠంతో జవాబు చెప్పారు. డ్వాక్రా రుణమాఫీ ఆసరా డబ్బు మూడు సార్లు వచ్చింది. అమ్మఒడి వచ్చింది. మా అత్త సుబ్బమ్మకు పింఛన్ వచ్చింది...ఇలా చెకచెక నందిరెడ్డి స్వరూప చెప్పుకొచ్చింది. ఆడోళ్లకు ప్రభుత్వ పథకాలు జగన్ ప్రభుత్వంలోనే వచ్చాయని, చంద్రబాబు హయాంలో పసుపు–కుంకుమ పథకం తప్పా ఇంకేమీ రాలేదని నాగులు, శివమ్మ అనే మహిళలు గొంతు కలిపారు. అది కూడా ఎన్నికల ముందు ఇచ్చారన్నారు. మళ్లీ జగనే రావాలని చెప్పారు. -
ప్రశాంతంగా పోస్టల్ బ్యాలెట్
కడప సెవెన్రోడ్స్: సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలు, మైక్రో అబ్జర్వర్లు, జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటరుగా నమోదై ఉన్న సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఇందుకోసం ఏడు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. కడప నగరంలోని గాంధీనగర్ హైస్కూలులో పోలింగ్ సిబ్బందికి బ్యాలెట్ ఓటింగ్ నిర్వహించారు. జిల్లాలో పనిచేస్తూ ఇతర జిల్లాల్లో ఓటు ఉన్న ఉద్యోగులకు జయనగర్ కాలనీ జెడ్పీ బాలికల హైస్కూలులో ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఓటర్లు ఫెసిలిటేషన్ సెంటర్లకు వెళ్లేందుకు, ఓటు వినియోగం తర్వాత వెలుపలికి వచ్చేందుకు ప్రత్యేక ప్రవేశ ద్వారాలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. గాంధీనగర్ హైస్కూలులో 3222 మంది తమ ఓటును సజావుగా వినియోగించుకోవడం కోసం 12 ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. -
నేడు పోలీసులు, అత్యవసర ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్
కలెక్టర్ విజయరామరాజు కడప సెవెన్రోడ్స్: పోలీసు పర్సనల్స్, అత్యవసర సర్వీసులకు చెందిన వారికి సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయరామరాజు తెలిపారు. అలాగే హోమ్ ఓటింగ్ సోమ, మంగళ వారాల్లో నిర్వహిస్తామన్నారు. ఆదివారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని నియోజకవర్గాల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగం కోసం కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశానికి ఎస్పీ హాజరవుతారన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే ఆయనకు తెలియజేయాలన్నారు. అలాగే శుక్రవారం ఉదయం 10.30 గంటలకు, శనివారం సాయంత్రం 4.00 గంటలకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని 2035 పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులతోపాటు ఎన్సీసీ, స్కౌట్ సేవలను వినియోగించుకుంటామన్నారు. ఇప్పటివరకు 1101602 (67.2 శాతం) ఓటరు స్లిప్పుల పంపిణీ జరిగిందన్నారు. సుమారు 3.61 లక్షల మందికి ఓటరు గైడ్స్ కూడా పంపిణీ చేశామన్నారు. ఈనెల 10వ తేదీకి ఎన్నికలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. కోడ్ ఉల్లంఘనలు సంభవిస్తే సి–విజిల్ యాప్ లేదా కమాండ్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబరు 1950కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు సహకరించాలని కోరారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement