-
Salur: ఇంట గెలవని రాణి..!
ఆమెది ఒంటెత్తు పోకడ వ్యవహారమన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్సీగా పదవి అనుభవించినా సంతృప్తి లేదు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావాలన్నదే ఆమె లక్ష్యం. అయితే సొంత పార్టీలోని మాజీ ఎమ్మెల్యేతో ఇప్పటికీ విభేదాలే. కూటమి కట్టి పోటీ చేస్తున్నప్పటికీ..కూటమి పార్టీ ఎంపీ అభ్యర్థితోనూ సఖ్యత అంతంతమాత్రమే. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ ఆమెను వ్యతిరేకించేవారే ఉన్నారని సొంతపార్టీ నాయకులే చెప్పుకుంటారు. ఆమె ధోరణి, వ్యవహార శైలిపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు పలుమార్లు పార్టీ అధిష్టానం వద్ద పంచాయితీ పెట్టిన ఉదంతాలూ ఉన్నాయి. మక్కువ మండలంలోని ఆమె వ్యతిరేక వర్గం..కేవలం కూటమి ఎంపీ అభ్యర్థికి మాత్రమే అనుకూలంగా ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. పాచిపెంట మండలంలోనూ పార్టీ కేడర్కు గతంలో ఆమెతో విభేదాలున్నాయి. పార్టీలోని సొంత వర్గీయులే కాదు..వ్యతిరేక వర్గం వారైనా తలెగరేస్తే పాతాళానికి తొక్కేసే వరకూ ఆమె నిద్రపోరనే ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆమె వైఖరిని ఖండిస్తూ గతంలో సొంత పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టడం గమనార్హం. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇవన్నీ చాలదన్నట్లు కులవివాదాన్నీ ఎదుర్కొంటున్నారు. ఇలా ఇంటా బయటా వ్యతిరేకతను కూడగట్టుకున్న తెలుగుదేశం పార్టీ సాలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్యారాణి..ఎని్నకల్లో ఎలా ముందుకు వెళ్తారో అన్న చర్చ సాగుతోంది.పార్వతీపురం మన్యం: సాలూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా అని భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. తనకు ఎమ్మెల్యేగా అవకాశవిుస్తే అది చేస్తా..ఇది చేయిస్తా అంటూ టీడీపీ తరఫున ఎన్నికల బరిలో దిగుతున్న గుమ్మిడి సంధ్యారాణి కొద్దిరోజులుగా ఊదరగొడుతున్నారు. కనీసం తాను ఎమ్మెల్సీగా పదవిని అనుభవించిన ఆరేళ్ల కాలంలో ఏం చేశారో చెప్పాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ హయాంలో ఆరేళ్లు ఎమ్మెల్సీగా చేసినా నియోజకవర్గానికి ఆమె చేసింది శూన్యం. తాగునీరు, ఇతర అవసరాలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని ఆమె చెబుతుంటే అధికార పార్టీ నేతలు అడిగిన ప్రశ్నలకు తిరిగి సమాధానం ఇవ్వలేకపోతున్నారు. కనీసం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నా స్పందించడం లేదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే ఆమె ఎమ్మెల్సీగా పదవిని అనుభవించారు.పదవిలో ఆమె ఉన్నది ప్రజల శ్రేయస్సు కాద ని, ఆమె స్వలాభం కోసమేనని సొంత పార్టీ నేతలే విమర్శిస్తుంటారు. సాలూరులో ఆటోనగర్ను అభివృద్ధి చేస్తామని, లారీ పరిశ్రమను ఆదుకుంటామని స్వయంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాంలో హామీ ఇచ్చారు. బైపాస్ రోడ్డును పూర్తి చేస్తామని చెప్పినా చేయలేదు. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా వాటి సాధన కోసం ఆమె ఏనాడూ పట్టుబట్టలేదు. టీడీపీ హయాంలో ఏజెన్సీలో గిరిజ నుల మరణాలు అధికంగా సంభవించాయి. ఒక్క కరాసవలసలోనే డెంగీ జ్వరాలతో 10 రోజుల వ్యవధిలో 11 మంది వరకు చనిపోయారు. కొదమ పంచాయతీ గిరిశిఖర సిరివర గ్రామం నుంచి డోలీలో గర్భిణిని తీసుకువస్తే..మార్గమధ్యంలోనే ఆమె ప్రసవించింది. దీంతో మానవహక్కుల సంఘం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.ఎన్నికల ముందు హడావుడిసాలూరులో వంద పడకల ఆస్పత్రికి 2019 ఎన్నికలకు ముందు అప్పటి మంత్రి సుజయ్ కృష్ణ రంగారావుతో కలిసి సంధ్యారాణి హడావుడిగా భూమి పూజ చేశారు. తర్వాత పట్టించుకోలేదు. కందులపథం బ్రిడ్జికి కూడా ఎన్నికలకు ముందు కొబ్బరికాయ కొట్టి పనులు చేయకుండా వదిలేశారు. సొంత మండలాన్నే ఆమె ఏనాడూ పట్టించుకున్న పా పాన పోలేదని..ఇంక నియోజకవర్గాన్ని ఏం పట్టించుకుంటారని ‘తెలుదేశం పార్టీలోని ఓ వర్గం ప్రశ్ని స్తోంది. తన పదవీ కాలంలో అంటీముట్టనట్లుగానే ఆమె కాలం గడిపేశారని గుర్తుచేస్తున్నారు. ఇప్పు డు తాము కూడా అలాగే ప్రవర్తిస్తామని ఆ పార్టీ నేతలు, క్యాడర్ చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. -
జిల్లాలో 18,631 పోస్టల్ బ్యాలెట్లు
విజయనగరం అర్బన్: పోస్టల్ బ్యాలెట్ కోసం ఇప్పటికే ఫారం–12 సమర్పించిన ఎన్నికల సిబ్బంది తమ ఓటు హక్కును ఆదివారం నుంచి 7వ తేదీ మధ్య వినియోగంచుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నియోజకవర్గాల వారీగా ఇప్పటికే ప్రకటించిన ఫెసిలిటేషన్ సెంటర్లలో ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పీఓలు, ఏపీఓలు, మైక్రో అజ్జర్వర్లు, పోలీస్, ఆర్టీసీ ఉద్యోగులు, ఇతర జిల్లాల్లో ఓట్లు ఉన్న వారు, ఎసెన్షియల్ సర్వీసులో ఉన్నవారు, అత్యవసర శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు ఓటు వేసుకునే అవకాశం ఉందన్నారు. నేటి నుంచి 7వ తేదీ వరకు ఎన్నికల విధుల్లో ఉన్నవారు వినియోగించుకునే అవకాశం 8 నుంచి 10వ తేదీ వరకు అత్యవసర సేవల ఉద్యోగులకు... -
శతశాతం ఓటింగ్ లక్ష్యం
● ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్ విజయనగరం అర్బన్: జిల్లాలో శతశాతం ఓటింగ్ సాధించాలన్నదే ఎన్నికల కమిషన్ లక్ష్యమని ట్రైనీ సహాయ కలెక్టర్ బి.సహదిత్ వెంకట్ త్రివినాగ్ చెప్పారు. ఓటర్లు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. పోలింగ్ సమయాన్ని గంటపాటు పెంచినట్టు తెలిపారు. స్వీప్లో భాగంగా నగరంలోని రాజీవ్ స్టేడియం నుంచి మహాత్మాగాంధీ విగ్రహం వరు శనివారం నిర్వహించిన రెండు కిలోమీటర్ల పరుగును ఆయన ప్రారంభించి పాల్గొన్నారు. రాజీవ్ స్టేడియం వద్ద ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, క్రీడాకారులనుద్దేశించి మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో 85 ఏళ్లు వయస్సు నిండిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి వద్దే తమ ఓటు హక్కు విని యోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామని, మే 7 నుంచి 10వ తేదీ వరకు హోం ఓటింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న వారు ఓటు వేయడంపై దృష్టి సారించామన్నారు. పరుగులో పాల్గొన్న వారితో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శ్రీనివాస్, డీఎస్డీఓ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. స్కాలర్షిప్కు దరఖాస్తుల ఆహ్వానం సీతంపేట: గవర్న్మెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ట్రైబుల్ అఫైర్స్ (స్కాలర్షిప్ సెక్షన్)నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్లకు గిరిజన విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ట్రైబుల్ వెల్ఫేర్ డీడీ అన్నదొర శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 – 25 విద్యా సంవత్సరానికి విదేశాలలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాంకు ఎస్టీ అభ్యర్థులు 20 మందిని ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో హెచ్టీటీపీ ఓవర్సీస్.ట్రైబుల్.గవ్.ఇన్కు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు గిరిజన సంక్షేమ, సాధికారిత అధికారిని సంప్రదించాలని సూచించారు. -
ఫెసిలిటేషన్ కేంద్రాల తనిఖీ
విజయనగరం అర్బన్: పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం నియోజకవర్గాల్లో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్ సెంటర్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నాగలక్ష్మి శనివారం తనిఖీ చేశారు. ఓటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఆమె ముందుగా ఎస్.కోట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ను సందర్శించారు. ఏర్పాట్లపై ఆర్ఓ మురళీకృష్టను ఆరా తీశారు. పోస్టల్ ఓటింగ్ కోసం పక్కగా ఏర్పాట్లు చేయాలని, వేగంగా ఓటింగ్ జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయనగరం జేఎన్టీయూ జీవీ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన రెండు ఫెసిలిటేషన్ సెంటర్లను సందర్శించారు. హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసి, ఓటు వేయడానికి వచ్చే ఉద్యోగులకు అవసరమైన సమాచారాన్ని సహాయ సహకారాలను అందించాలని ఆదేశించారు. ప్రతిచోటా తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు తదితర కనీస మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎక్కడా ఇబ్బంది పడకూడదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విజయనగరం రిటర్నింగ్ అధికారి, జాయింట్ కలెక్టర్ కె.కార్తీక్, అసిస్టెంట్ కలెక్టర్ త్రివినాగ్, డీఆర్వో ఎస్.డి.అనిత, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సుధారాణి, ఏఆర్వోలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఓటింగ్కు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశం అన్ని కేంద్రాల్లో హెల్ప్ డెస్క్ల ఏర్పాటు -
వైఎస్సార్సీపీలో 30 కుటుంబాల చేరిక
బొండపల్లి: మండలంలోని నెలివాడ గ్రామానికి చెందిన 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య సమక్షంలో శనివారం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పెండ్యాల రామకృష్ణ, సూరినాయు డు, నెట్టి గురునాయుడు, సురేష్, గురు రామోజీ, కోమ్మ సూర్యనారాయణ, కోమ్మ ఆదిబాబు, పెండ్యాల ఎరుకునాయుడు, సూర్యప్రకాశరావు, కోమ్మ సత్యనారాయణ, నారం నాయుడు, మన్యా రాము, గోండ్యాల రమణమూర్తి, నెట్టి ఆదినారాయణ, షేక్ రహమాన్, మామిడి కనకరావు, కోర్నాన అగ్గిరాముడు, పైడితల్లి, చుక్క శివరాం, గౌరినాయుడు, సత్తిబాబు, కోలుసు చిన్నారావు, పట్నాన రాము, శ్రీను, కోన గంగ, నెట్టి చిన గురునాయుడు, బడిబట్ల అచ్యుతరావు, కోమ్మ రమణమూర్తి, కోమ్మ కృష్ణ, అప్పారావులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో ఎంపీపీ చల్లా చలంనాయుడు, జెడ్పీటీసీ రాపాక సూర్యప్రకాశరావు, పార్టీ జిల్లా నాయకులు ఎం.నారాయణమూర్తిరాజు, పార్టీ మండల అధ్యక్షుడు బోద్దల చిన్నంనాయుడు, సర్పంచ్ తాళ్లపూడి కీర్తి, నాయకులు తాళ్లపూడి అప్పలనాయుడు, కోమ్మ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement