-
పాపం పండుటాకులు
● పింఛన్ కోసం వెళ్లి ఇద్దరు వృద్ధుల మృతిచంద్రబాబు నాయుడి కుట్రల వల్ల వృద్ధులు కన్నుమూస్తున్నారు. టీడీపీ కారణంగా ఇంటి వద్ద పింఛన్లు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో మండుటెండలో బ్యాంకులకు వెళ్లి వడదెబ్బకు గురై చనిపోతున్న పండుటాకుల సంఖ్య పెరుగుతోంది. దుత్తలూరు: పింఛన్ కోసం బ్యాంకు వద్దకు వెళ్లి ఎండవేడిమికి తాళలేక వడదెబ్బకు గురై ఓ వృద్ధుడు మృతిచెందిన ఘటన దుత్తలూరు ఏసీ కాలనీలో జరిగింది. గ్రామస్తుల కథనం మేరకు.. యనమల రమణయ్య (67) అనే వృద్ధుడు పెన్షన్ సొమ్ము కోసం శుక్రవారం దుత్తలూరులోని బ్యాంకు వద్దకు వెళ్లాడు. రద్దీ ఎక్కువగా ఉండడంతో అధిక సమయం అక్కడే ఉన్నాడు. మండుటెండలోనే తిరిగి ఇంటికి వెళ్లాడు. కాసేపటికి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. రాత్రికి పరిస్థితి విషమంగా మారి మృతిచెందాడు. ● కావలి: పట్టణంలోని కచ్చేరిమిట్ట చర్చి ప్రాంతంలో ఉంటున్న గద్దె వైనమ్మ (65) వృద్ధురాలు శనివారం వడదెబ్బకు మృతిచెందింది. బ్యాంకు నుంచి పెన్షన్ తెచ్చుకునేందుకు ఉదయం మండుటెండలో వెళ్లి అస్వస్థతకు గురైన ఆమె సాయంత్రం మృతిచెందింది. -
మీ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు..
మరో తొమ్మిది రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు నిర్దేశించినవి కావని.. మీ భవిష్యత్తును నిర్ణయించే ఘట్టమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ మాటలు నగర వాసుల్లో మరింత భరోసాను నింపాయి. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేస్తే సంక్షేమ పథకాలు సజావుగా అందుతాయని.. పొరపాటున చంద్రబాబు అధికారంలోకి వస్తే వీటికి చరమగీతం పాడటం ఖాయమని జగనన్న చెప్పారు. గడిచిన 59 నెలల్లో అవినీతిరహిత పాలనను అందించామని, ఒక్కసారి ఆలోచించి తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకేయాలని కోరారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దేన్నైనా చంద్రబాబు అమలు చేశారానని సీఎం ప్రశ్నించగా, లేవు.. లేవంటూ ప్రజలు సమాధానమిచ్చారు. -
సోమిరెడ్డీ.. గ్రామాలకు దారులు తెలుసా?
● ప్రశ్నించిన మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి పొదలకూరు: సోమిరెడ్డీ నీకు సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రామాలకు దారులు తెలుసా? అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ప్రశ్నించారు. విమర్శలు చేయడం తప్పించి అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము ఆయనకు లేదన్నారు. మండలంలోని ఇనుకుర్తి, ముదిగేడు, డేగపూడి గ్రామాల్లో శనివారం మంత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబును రాష్ట్ర ప్రజలు నమ్మడం లేదన్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకపోవడంతోపాటు మోసగించడం వల్ల ఆయన సభలకు జనాలు కూడా వెళ్లడం లేదన్నారు. డబ్బులిచ్చి, వాహనాలు పెట్టినా వెళ్లేందుకు అయిష్టత చూపుతున్నట్లు చెప్పారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క పిలుపునిస్తే సభలకు జనాలు భారీగా తరలి వస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఉన్నారని అందువల్లే స్వచ్ఛందంగా వస్తున్నారన్నారు. పింఛన్ల కోసం వృద్ధులు బ్యాంకులకు వెళ్లి తిప్పలు పడుతున్నారని, వారి ఉసురు బాబుకు తగలక మానదన్నారు. గ్రామాల్లో ఏ అభివృద్ధి పనులు చేశానో ప్రచారంలో స్పష్టంగా చెబుతున్నానని, నువ్వు ఏమి చేశావో చెప్పాగలవా అంటూ సోమిరెడ్డిని నిలదీశారు. పొదలకూరులో చంద్రబాబు సభను నిర్వహిస్తే ఇనుకుర్తి, ముదిగేడు నుంచి పట్టుమని పదిమంది కూడా వెళ్లలేదన్నారు. ఇనుకుర్తి, డేగపూడి పంచాయతీలు తన సొంత గ్రామంతో సమానమన్నారు. వాటికి ఎడమగట్టు కాలువ ద్వారా సాగునీటిని అందించి తీరుతానన్నారు. జెడ్పీ చైర్మన్గా పనిచేసిన కాలంలోనే ముదిగేడుకు రోడ్డు నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీ నర్ పెదమల్లు రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ గోగిరెడ్డి గోపాల్రెడ్డి, జెడ్పీటీసీ నిర్మలమ్మ, సర్పంచ్లు పెదమల్లు శ్రీనివాసులురెడ్డి, ఓబుల్రెడ్డి, ఎంపీటీసీ పులి వెంకటేశ్వర్లురెడ్డి, నాయకులు అక్కెం రామకోటారెడ్డి, మండి శంకర్రెడ్డి, మండి శ్రీనివాసులురెడ్డి, నోటి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జెడ్పీ సమావేశం వాయిదా
నెల్లూరు(పొగతోట): కోరం లేక జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన శనివారం నెల్లూరు జెడ్పీ సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. సభ్యులకు, అధికారులకు సీఈఓ కన్నమనాయుడు ఆహ్వానాలు పంపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కొత్త వాటికి అనుమతి ఇవ్వకుండా, రాజకీయ అంశాలు చర్చించకుండా అధికారులతో సమీక్షించవచ్చని సీఈఓ తెలిపారు. నిబంధనలకు లోబడి మాత్రమే సమావేశం నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే నలుగురు జెడ్పీటీసీలు, కో–ఆప్షన్ సభ్యులు, అల్లూరు ఎంపీపీ మాత్రమే హాజరయ్యారు. కోరం లేకపోవడంతో వాయిదా వేస్తున్నట్లు అరుణమ్మ ప్రకటించారు. -
వృద్ధుల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం
● కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కొడవలూరు: పింఛన్లు ఇంటి వద్ద అందకుండా చేసి వృద్ధుల ప్రాణాలతో చంద్రబాబు నాయుడు చెలగాటమాడుతున్నాడని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి విమర్శించారు. మండలంలోని రేగడిచెలిక, రాచర్లపాడు, పెయ్యలపాళెంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెయ్యలపాళెంలో మాట్లాడుతూ చంద్రబాబు తన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్ చేత ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయించి వలంటీర్లు ఇంటి వద్ద పింఛన్లు పంపిణీ చేయకుండా నిలిపి వేయించారన్నారు. దీంతో పదుల సంఖ్యలో పింఛన్దారులు మృతిచెందారన్నారు. జిల్లాలో పెన్నా, సంగం బ్యారేజీలకు వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేస్తే ఆయన కుమారుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారని తెలిపారు. రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని వారు నమ్మారన్నారు. బాబు పాలనలో వర్షాల్లేక రైతులు అల్లాడిపోయారన్నారు. పెయ్యలపాళెం అరబిందో ఫార్మా అధినేత రామ్ప్రసాద్రెడ్డి సొంత గ్రామమన్నారు. ఆయన తన నిధులతో ఎన్నో పనులు చేశారన్నారు. గ్రామస్తులకు ఆయన రుణం తీర్చుకొనే అవకాశం వచ్చిందని చెప్పారు. ఓట్లు వేసి నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డిని, అసెంబ్లీ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు మాట్లాడుతూ వేమిరెడ్డి దంపతులు ప్రజా సేవే ముఖ్యమంటున్నారని, అలాంటి వారు పార్టీలు ఎందుకు మారారో ప్రజలు ప్రశ్నించాలన్నారు. కార్యక్రమంలో అరబిందో సంస్థ ప్రతినిధి పెనాక గోపీనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ, సచివాలయాల మండల కన్వీనర్లు గంధం వెంకటశేషయ్య, కొండా శ్రీనివాసులురెడ్డి, సర్పంచ్లు నల్లావుల శ్రీనివాసులు, పెనాక అనూష, ఎంపీటీసీలు పి.అరుణకుమారి, ఎ.రాజమ్మ, సొసైటీ చైర్మన్లు పెనాక నాగశ్రీనివాసులురెడ్డి, దేవనబోయిన శివకుమార్, మాజీ సర్పంచ్ పెనాక శారద, నాయకులు పెనాక సుభాష్రెడ్డి, అక్కుల్రెడ్డి, పెయ్యల రమణయ్య, ఎం.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నాన్న చనిపోయినా వేళ్లలేదు.. బంధువులంతా తిట్టారు: కోవై సరళ ఎమోషనల్
IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
రెచ్చిపోయిన ఇసుక మాఫియా.. ట్రాక్టర్తో తొక్కించి ఏఎస్ఐ హత్య
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
‘రాహుల్ గాంధీపై పాక్ ప్రేమ ఆందోళన కలిగించింది’
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
కొత్త పగటివేషగాడు వచ్చాడు
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
మహిళల టీ20 వరల్డ్కప్ 2024: అక్టోబర్ 6న భారత్-పాక్ మ్యాచ్
అక్కడ శృతి మించిందో.. మీ పాట శాస్వతంగా రద్దే!
తప్పక చదవండి
- కొత్త పగటివేషగాడు వచ్చాడు
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- రేటే 'బంగార'మాయెనే..!
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement