-
No Headline
నవరత్న వెలుగులు క్షేత్రస్థాయిలో కనిపిస్తున్నాయి.. గతంతో పోలిస్తే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి.. సంక్షేమ పథకాల అమలుపై అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయి.. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.. ఇదే క్రమంలో తమ పాలకుడిని ఎన్నుకోవడంలోనూ క్లారిటీగా ఉన్నాయి.. మేలు చేసేవారికే మద్దుతు ఇస్తామని స్పష్టంగా చెబుతున్నాయి.. సోమవారం నగరి నియోజకవర్గంలో శ్రీసాక్షిశ్రీ బృందం నిర్వహించిన విలేజ్ విజిట్లో ప్రజల నుంచి ఇవే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు చేపట్టిన రోడ్ షో ముందుగా విజయపురం మండలం నుంచి ప్రారంభమైంది. అనంతరం నిండ్ర..నగరి మండలం.. పట్టణం..పుత్తూరు మండలం.. పట్టణం మీదుగా వడమాలపేట మండలం అప్పలాయిగుంట వరకు కొనసాగింది. ఈ క్రమంలో రైతులు.. వ్యవసాయ కూలీలు..విద్యార్థుల తల్లిదండ్రులు.. మహిళలు.. కార్మికులు.. చిరువ్యాపారులను పలకరించింది. వారి మనసులో మాటను రాబట్టింది. – నగరి -
గుడ్మార్నింగ్!
వైఎస్సార్సీపీలో భారీగా చేరికలు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో సోమవారం భారీగా చేరారు.ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టండి సంక్షేమ పథకాలు అందించిన ప్రజా ప్రభుత్వానికి పట్టం కట్టాలని మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు.రూపురేఖలే మారిపోయాయి ఒకప్పుడు మా పిల్లలు ఐటీఐ చదువుకోవాలంటే దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడే రూ. 6కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఐటీఐ నిర్మించారు. ఇది ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే మాది మారుమూల గ్రామం. ఇక్కడ ఇంత పెద్ద కళాశాల నిర్మించారు. మా గ్రామంలో పాఠశాలను నాడు–నేడు కింద అద్భుతంగా తీర్చిదిద్దారు. మాకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి. ఈ ఎన్నికల్లో హామీలు నెరవేర్చే నాయకుడికే పట్టం కట్టాలని నిర్ణయించుకున్నాం. – శామువేల్, మాధవరం విజయపురం మండలంలో మండలంలోని మాధవరం పంచాయతీ ఈ ఐదేళ్లలో అద్భుతంగా అభివృద్ధి చెందింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన ఐటీఐకు ఇన్నేళ్లుగా శాశ్వతం భవనం లేదు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం రూ.6కోట్లతో నూతన భవనం నిర్మించింది. మండలంలో ఒకప్పుడు రాకపోకలకు నానా అవస్థలు పడేవాళ్లు. ఇప్పుడు అన్ని ఊర్లకు రహదారి సౌకర్యం వచ్చింది.మాధవరంలోని ఐటీఐ కళాశాల●– 8లో– 8లో– 8లో -
జగనన్నతోనే ఆర్టీసీ అభివృద్ధి
పుంగనూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే ఆర్టీసి అభివృద్ధి జరిగిందని సంస్థ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన పట్టణంలోని విశ్రాంత ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కరపత్రాలు విడుదల చేశారు. రాజారెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి , కార్మికులను ఆదుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్కు స్వాగతం చిత్తూరు కలెక్టరేట్:సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా సోమవారం చిత్తూరుకు విచ్చేశారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో ఆయనకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఎన్నికల కోసం చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. కార్యక్రమంలో జిల్లా జనరల్ అబ్జర్వర్లు కై లాష్, శంకర్ప్రసాద్వర్మ పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలుతిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. టిక్కెట్లు లేని వారికి 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లు ఉంటే 2 గంటల్లో దర్శనమవుతోంది. -
ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి
చిత్తూరు అర్బన్: ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని.. అలాంటి పరిస్థితిని యంత్రాంగం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు, విశ్రాంత డీజీపీ దీపక్మిశ్రా ఆదేశించారు. సోమవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో కలెక్టర్ షణ్మోహన్, ఎస్పీ మణికంఠ, పరిశీలకులు షాదిక్ ఆలం, కై లాష్ వాఖండే, శంకర్ ప్రసాద్శర్మ, శ్రీనివాస్ కన్నా, రోహన్ ఠాకూర్తో కలిసి పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. దీపక్ మిశ్రా మాట్లాడుతూ అధికారులు విధుల్లో పారదర్శకంగా ఉండాలని, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో 24 గంటలపాటు నిఘా ఉంచాలన్నారు. అక్రమ మద్యం, నగదు పంపిణీని పూర్తిగా నివారించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ రోజున తీసుకుంటున్న చర్యలు, గతంకంటే ఈసారి పోలింగ్ శాతం పెరగడానికి చేపట్టిన ప్రణాళికలు వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో పనిచేస్తోందన్నారు. సామాన్యులు సైతం ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగంచుకునేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు వివరించారు. పలువురు డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
పుత్తూరు పట్టణంలో..
ఒకప్పుడు విరిగిన ఎముకల కట్టుకు చిహ్నంగా ఉన్న పుత్తూరు నేడు పలు అంశాల్లో గుర్తింపు సాధించింది. ఆహ్లాదకరంగా కనిపించే మున్సిపల్ పార్కు ఆకట్టుకుంటోంది. ముస్లింల కోసం నిర్మించిన షాదీమహల్ అబ్బురపరుస్తోంది. నూతన మున్సిపాలిటీ, పాలిటెక్నిక్ భవనాలు, మహిళా మార్టు ఇలా ఎన్నో అభివృద్ధి పనులు పుత్తూరుకు వన్నె తెచ్చాయి. మంచి చేసేవాళ్లకే.. పుత్తూరులో పార్కు ఉంటే బావంటుందనేది ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నం.. అది నేడు సాకారమైంది. ఈ పార్క్లో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పిల్లల ఆటపాట లు, ప్రజలు ఒకరినొకరు కలుసుకోవడం ఇదో కొత్త ప్రపంచం. ప్రతి రోజు ఇక్కడే వాకింగ్ చేస్తా. ఇది గాక ఆలయాలను సైతం అభివృద్ధి చేశారు. పాలిటెక్నిక్కు నూతన భవనం, పురపాలక పరిధిలో రోడ్లు, మురుగు కాలువలు నిర్మించారు. మంచి చేసినవాళ్లకే మా మద్దతు. – గజేంద్ర, పుత్తూరు పుత్తూరులోని డాక్టర్ వైఎస్సార్ పార్కు
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement