ఎన్నికల కోసమే కేసీఆర్‌ రైతు జపం | Sakshi
Sakshi News home page

ఎన్నికల కోసమే కేసీఆర్‌ రైతు జపం

Published Thu, Mar 1 2018 8:39 AM

ఎన్నికలు సమీపిస్తుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు జపం చేస్తున్నారని కాంగ్రెస్‌ నేతలు దుయ్యబట్టారు. నాలుగేళ్లుగా లేనిది, కాంగ్రెస్‌ బస్సు యాత్ర చేపట్టగానే ప్రభుత్వానికి వణుకు మొదలై రైతు బాట పట్టారని విమర్శించారు. రైతులపై కపట ప్రేమ చూపుతున్న కేసీఆర్‌ను నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసేనని జోస్యం చెప్పారు. టీఆర్‌ఎస్‌ను గద్దె దించడానికి సమష్టిగా కృషి చేయాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు.కాంగ్రెస్‌ ప్రజా చైతన్య బస్సు యాత్ర రెండో రోజు మంగళవారం వికారాబాద్‌ జిల్లా తాండూరులో బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నేతలంతా టీఆర్‌ఎస్‌పై ధ్వజమెత్తారు.

Advertisement
Advertisement