‘శిరీష- ప్రభాకర్‌ రెడ్డి’ కేసు దర్యాప్తు వేగవంతం | Sakshi
Sakshi News home page

‘శిరీష- ప్రభాకర్‌ రెడ్డి’ కేసు దర్యాప్తు వేగవంతం

Published Thu, Jun 15 2017 2:40 PM

సంచలనం రేపిన బ్యుటీషియన్‌ శిరీష, కుకునూర్‌పల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్యల కేసుల్లో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ రెండు కేసుల్లోనూ కీలకంగా మారిన ఫొటో స్టుడియో యజమాని రాజీవ్‌ను పోలీసులు గురువారం మధ్యాహ్నం కుకునూర్‌పల్లికి తీసకెళ్లారు. ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య కేసులో విచారణాధికారిగా నియమితులైన సంగారెడ్డి డీఎస్సీ తిరుపతన్న.. గురువారం ఉదయం బంజారాహిల్స్‌(హైదరాబాద్‌) పోలీసులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. శిరీష ఆత్మహత్య కేసులో లభించిన ఆధారాలు, రాజీవ్‌, శ్రావణ్‌ల వాగ్మూలం తదితర విషయాలను బంజారాహిల్స్‌ పోలీసులు తిరుపతన్నకు వివరించారు.

Advertisement
Advertisement