Sakshi News home page

దురుసుగా మైక్‌ లాక్కున్న చినరాజప్ప

Published Mon, Aug 14 2017 2:23 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే కాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ రామానుజయులుకు అవమానం జరిగింది. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ కాపు నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రామానుజయులు మాట్లాడుతుండగా... హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హఠాత్తుగా లేచి, ఆయన వద్ద నుంచి దురుసుగా మైక్‌ లాక్కున్నారు. ఒక్కసారిగా చినరాజప్ప ఇలా వ్యవహరించడంతో రామానుజయులు ఖంగుతున్నారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఈ సమావేశానికి గైర్హాజరు అయ్యారు. గతంలోనూ కాపుల విషయంలో చంద్రబాబుతో ఆయన విభేదించిన విషయం తెలిసిందే. గంటా గైర్హాజరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

Advertisement
Advertisement