రాజకీయ లబ్ది కోసమే ఎన్డీయే నుంచి వైదొలిగారు | Sakshi
Sakshi News home page

రాజకీయ లబ్ది కోసమే ఎన్డీయే నుంచి వైదొలిగారు

Published Mon, Mar 19 2018 2:40 PM

పీ ముఖ్యమం‍త్రి చంద్రబాబుకు తెలిసినన్ని జిమ్మిక్కులు ఎవరికీ తెలియవని బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ అన్నారు. రాజకీయ లబ్ది కోసమే ఎన్డీయే నుంచి టీడీపీ వైదొలిగిందని, ఏపీలో టీడీపీ పొలిటికల్‌ గేమ్‌ ఆడుతుందన్నారు. పొలిటికల్‌ గేమ్స్‌లో ఎవరూ కూడా చంద్రబాబును బీట్‌ చేయలేరని విమర్శించారు. చంద్రబాబు తన వైఫల్యాలను తమపై నెట్టాలని చూస్తున్నారని, కానీ తాము అలా జరగనివ్వమని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు.