ఆటకు ‘సై’ | Sakshi
Sakshi News home page

ఆటకు ‘సై’

Published Tue, Sep 11 2018 12:08 PM

దర్శకధీరుడు రాజమౌళి మరో రంగంలోకి అడుగుపెడుతున్నారు. తాజాగా ఆయన తెలంగాణ ప్రీమియర్ కబడ్డి సీజన్‌ 2లో ఓ జట్టును తీసుకున్నారు. నిర్మాత సాయి కొర్రపాటి, కుమారుడు కార్తీకేయలతో కలిసి నల్లగొండ ఈగల్స్‌ టీంను సొంతం చేసుకున్న జక్కన్న టీం ప్రొమోషన్‌కు కూడా సినిమాటిక్‌గా నిర్వహిస్తున్నారు. తాజాగా తమ టీంను ప్రమోట్ చేస్తూ ఓ థీమ్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు.