నేడు స్పీకర్‌ను కలవనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు | Sakshi
Sakshi News home page

నేడు స్పీకర్‌ను కలవనున్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

Published Fri, Aug 21 2015 6:13 AM

ఏపీ శాసనసభ లాంజ్ నుంచి తొలగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను అక్కడే ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్ కోడెల శివప్రసాదరావును శుక్రవారం కలవనున్నారు. ఉదయం 11 గంటలకు వారు ఆయనను అసెంబ్లీలో కలిసి ఈ మేరకు ఒక వినతిపత్రాన్ని సమర్పించనున్నట్లు వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష కార్యాలయ వర్గాలు తెలిపాయి.