Sakshi News home page

3 నుంచి పింఛన్ల పంపిణీ

Published Fri, Mar 31 2023 2:22 AM

-

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: వైఎస్సార్‌ పింఛన్‌ కానుక లబ్ధిదారులకు ఏప్రిల్‌ 3 నుంచి పెన్షన్లు పంపిణీ చేయనున్నట్లు డీఆర్‌డీఏ పీడీ డాక్టర్‌ విద్యాసాగర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌ 1 ఆర్థిక సంవత్సరం ముగింపు, 2వ తేదీ ఆదివారం కావడంతో 3వ తేదీ నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. లబ్ధిదారులంతా గమనించాలని కోరారు.

రామాయణంపై ఆధ్యాత్మిక ప్రవచనం

శ్రీకాకుళం కల్చరల్‌: శ్రీరామ పట్టాభిషేకం అనంతతం శ్రీరామ నిర్యాణం వరకు తెలియ చెప్పే అంశాలతో కూడినది ఉత్తర రామాయణం అని వక్త రంగడు ప్రసాదరావు అన్నారు. స్థానిక ఉపనిషన్మందిరంలో రామవసంతోత్సవాలలో భాగంగా ఉత్తర రామాయణంపై ప్రవచనం బుధవారం జరిగింది. ముందుగా వక్తను మందిరం సభ్యులు సత్కరించారు.

Advertisement
Advertisement