-
ఎగ్గొట్టేందుకే చంద్రబాబు అడ్డగోలు హామీలు: సజ్జల
సాక్షి, తాడేపల్లి: తమ మేనిఫెస్టో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించేదిలా ఉండదని.. ప్రజలకు ఏం చేస్తామో అదే చెప్పామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాయిళాలు ప్రకటించి ఓట్లు వేయించుకునే ఆలోచనలు తమకు ఉండవని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి రాష్ట్రాన్ని నాశనం చేశారని సజ్జల మండిపడ్డారు‘‘2014-19 మధ్య చంద్రబాబు తన విశ్వరూపం చూపించారు. చంద్రబాబువి సభ్యసమాజంలో ఉండగలిగే వ్యక్తి మాటలులాగా లేవు. రాళ్ల దాడి చేయమని గతంలో చంద్రబాబు అన్నాడు.. అన్నట్టుగానే రాళ్లతో దాడి చేయించాడు. మేనిఫెస్టో అంటే విశ్వసనీయత ఉండాలి. మీ కుటుంబంలో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ అంటున్నారు. ఎంతో ఆత్మవిశ్వాసం ఉంటేనే అలా అడగగలరు. అలా చంద్రబాబు ఎందుకు ఓటు అడగలేకపోతున్నారు. సంక్షేమ పథకాలతో లక్షలాది కుటుంబాల్లో మేలు జరిగింది. ఈ పథకాలతో రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తారా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఇప్పుడు అంతకంటే ఎక్కువ పథకాలు తెస్తానని ఎలా చెప్తున్నారు’’ అంటూ సజ్జల ప్రశ్నించారు.‘‘అమలు చేసే వారెవరూ అడ్డగోలు హామీలు ఇవ్వరు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉన్న వారే చేయగలిగిన హామీలు ఇస్తారు. చంద్రబాబు వలన వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయింది. పెన్షన్ల పంపిణీకి ఆటంకం కలిగించారు. ఇప్పుడు మళ్లీ ఇంటింటికీ ఉద్యోగులను పంపించి పెన్షన్లు ఇవ్వమంటున్నారు. పేదలంతా తమ కాళ్ల మీద తాము నిలపడేలా చూడాలన్నది జగన్ ఇద్దేశం. 70 వేల కోట్లతో జగన్ తన సంక్షేమాన్ని అమలు చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఏకంగా లక్షన్నర కోట్లు చేస్తానంటూ మాట్లాడుతున్నారు. రాష్ట్ర బడ్జెట్తో సంబంధం లేకుండా చంద్రబాబు అబద్ధాల హామీలు ఇస్తున్నారు’’ అని సజ్జల మండిపడ్డారు.‘‘ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా జగన్ మేనిఫెస్టో ప్రకటించారు. చంద్రబాబు లాగా ఇష్టం వచ్చినట్లు హామీలు ఇవ్వమని కొంతమంది మాతో కూడా అన్నారు.కానీ జగన్ ఎప్పుడూ చేయలేని పని చెప్పరు. ఇచ్చిన హామీ నుంచి వెనక్కి పోరు. ఎగ్గొట్టాలనుకునే చంద్రబాబు అడ్డమైన హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే ఉన్న వ్యవస్థలన్నీ నాశనం అవుతాయి. జన్మభూమి కమిటీలు మళ్లీ వస్తాయి. చంద్రబాబుకు ఎవరైనా ఓటేస్తే తమ ఓటును తాము వృథా చేసుకున్నట్టే. చంద్రబాబు తన పాలనలో ఏం చేశారో ఇప్పటికీ ఎందుకు చెప్పలేకపోతున్నారు?’’ అంటూ సజ్జల నిలదీశారు.‘‘జగన్ పాలనలో ఏం జరిగిందో ఎవరైనా చెప్పగలరు. కుప్పంతో సహా ఎక్కడైనా చెక్ చేసేందుకు సిద్దమే. చంద్రబాబుకు ధైర్యం ఉంటే ఇరవై ఇళ్లకు వెళ్లి అడిగే ధైర్యం ఉందా?. పోలవరం పాపం చంద్రబాబుదే. లోకేష్ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. ఎందుకు ప్రజలకు కనపడటం లేదు?. పవన్ కళ్యాణ్ చంద్రబాబు దత్తపుత్రుడు. చంద్రబాబు మాటలే పవన్ కూడా మాట్లాడతారు. సెక్రటేరియట్ ని కూడా తాకట్టు పెట్టామని కూడా పవన్ అన్నారు. రాజధానిలోని పొలాలను తాకట్టు పెట్టిందే చంద్రబాబు’’ అంటూ సజ్జల దుయ్యబట్టారు. -
కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కోసమే పవన్ తాప్రతయం అంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమిలో అంతా చంద్రబాబు మనుషులేనన్నారు. తాడేపల్లిలో తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.‘‘చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదు. మీడియావాళ్లు చిరంజీవి కూటమికి మద్దతు ఇచ్చారు.. దీనిపై నా అభిప్రాయం అడిగితే దానిపై స్పందిస్తూ చిరంజీవి కూటమికి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. కూటమితో చిరంజీవే కాదు ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పా. చిరంజీవిని నేను విమర్శించాను అని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు. నేను చిరంజీవిని కామెంట్ చేశానని ఇంతగా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారని ఆలోచిస్తే.. చంద్రబాబు,పవన్ కల్యాణ్ ల శక్తి సరిపోదని భావించి చిరంజీవి అభిమానులు,ఆ సామాజిక వర్గం వారి ఓట్లను గంపగుత్తగా తీసుకువెళ్లి చంద్రబాబుకు ఎలా వేయించాలా అనే తపన, ఆత్రం అందులో కనిపిస్తున్నాయి.2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మధ్దతు ఇచ్చాయి. అప్పుడు ప్రజలను రాచి రంపాన పెట్టారు. మళ్ళీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు” అని మండిపడ్డారు. బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీ ముందు సాగిలపడ్డాయి. ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి. వాళ్ళు ఓడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. డ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది. హాస్యస్పదంగా కనిపిస్తోంది. డ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది. 2014లో డ్వాక్రా మహిళలకు రుణ మాఫీలు చేస్తానని చంద్రబాబు మోసం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు సంస్కారం లేదు. చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా? చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?. చంద్రబాబు చెల్లెళ్ళు ఎక్కడ ఉన్నారు?” ఈ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా అని సజ్జల ప్రశ్నించారు.ఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. 2014లో చంద్రబాబు అలవికాని హామీలిచ్చి మోసం చేశారు. మేనిఫెస్టోను సైతం టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించారు. పవన్ కల్యాణ్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు రోజు రోజుకు ప్రస్టేషన్ పెరుగుపోతోంది. వైఎస్సార్సీపీ విజయం సాధించబోతోందని వారికి పూర్తిగా అర్థమైంది. విమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలి. రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?. చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతుందనే చంద్రబాబు,పవన్ కల్యాణ్ల ఆందోళనగా కనిపిస్తోంది.చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసు స్పందించకపోగా బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన సభలలో మాట్లాడిన మాటలు చదివి వినిపించాలని అనుకున్నాకూడా సిగ్గేస్తుంది. ప్రభుత్వ విధానాలపై మాట్లాడకుండా నోటికి వచ్చిన తిట్లు తిడుతున్నారు. ఓటమి భయంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను త్వరలోనే విడుదల చేస్తాం అని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మేము చంద్రబాబు కుటుంబాల గురించి మాట్లాడితే చంద్ర బాబు తలెత్తుకొని తిరగలేరు. ఎన్నికలు అంటే ఇచ్చిన హామీలు చేసిన పనుల గురించి మాట్లాడాలి. ఎన్నికలంటే ప్రజలకు సేవ ఎలా చేయాలి. వారితో ఎలా మమేకం అవ్వాలి.. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృధ్ది పధంలోకి తీసుకువెళ్లాలి. పేదల కోసం సంక్షేమం ఎలా అందించాలి అనే అంశాలపై దృష్టి సారించాలి. కుటుంబాల గురించి కాదనే అంశాన్ని చంద్రబాబు గుర్తిస్తే మంచిదన్నారు.ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ వాళ్ల పని వాళ్లు చేస్తారు. కక్ష సాధింపు చర్యలకు ఎన్నికల కమిషన్ పాల్పడుతుందని మేము భావించడం లేదని అధికారుల బదిలీలను ఉద్దేశించి మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అధికారుల బదిలీల గురించి మేము ఏమి మాట్లాడం. ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ అమలులోకి వచ్చినప్పటినుంచి జగన్ గారు ప్రజల మధ్యనే ఆయన గత ఐదేళ్లుగా చేసిన అభివృద్దిని వివరిస్తూ ఓట్లడుగుతున్నారు. మద్దతు ఇమ్మని అడుగుతున్నారు. వ్యవస్థలను అడ్డం పెట్టుకునీ ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ చూస్తోంది.2019 ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి మరీ బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తూ తప్పుడు ఫిర్యాదులు పదే పదే చేసి అధికారుల్ని బెదిరిస్తున్నారు. కొన్ని అభూత కల్పనలను క్రియేట్ చేసి వ్యవస్థలను, ఎన్నికల కమిషన్ను బెదిరించాలని చూస్తున్నారు. పెన్షన్లు పంపిణీ జరగకుండా అడ్డుకుంది తెలుగుదేశం పార్టీనే అని రాష్ట్రంలోని ప్రజలందరికి తెలుసు. మళ్లీ ఇప్పుడు ఆలస్యం అవ్వకుండా ఫస్ట్ తేదీనాడు పెన్షన్లు పంపిణీ చేయాలని వాళ్లే గొడవ చేస్తున్నారు. వాలంటీర్లపై ఎల్వీ సుబ్రమణ్యం, నిమ్మగడ్డ రమేష్లతో ఫిర్యాదులు ఇప్పించింది చంద్రబాబు అనేది బహిరంగ రహస్యం. వాలంటీర్లని అడుగడునా దూషించిన చంద్రబాబు నేడు వాలంటీర్లకు తాను అధికారంలోకి వస్తే పదివేలిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. -
బాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును ఎలాగైనా ముఖ్యమంత్రిని చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్కళ్యాణ్ తాపత్రయపడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలపై ఆయన స్పందించారు. ‘చిరంజీవిని ఉద్దేశించి నేనేమీ అనలేదు. చిరంజీవి కూటమికి మద్దతిచ్చారు..దీనిపై మీ అభిప్రాయం చెప్పాలని మీడియా ప్రతినిధులు అడిగితే, చిరంజీవి కూటమికి మద్దతివ్వడం మంచిదే కానీ.. కూటమితో చిరంజీవే కాదు ఇంకా ఎవ్వరూ కలిసి వచి్చనా ఇబ్బందిలేదని మాత్రమే చెప్పా’.. అని ఆయన గుర్తుచేశారు. చిరంజీవిని తాను విమర్శించకపోయినా విమర్శించినట్లు చిత్రీకరించడం వెనుక ఏముందా అని ఆలోచిస్తే.. ప్రజాక్షేత్రంలో సీఎం జగన్ను ఎదుర్కోవడానికి చంద్రబాబు, పవన్ తమ శక్తి సరిపోదని భావించి, చిరంజీవి అభిమానులు, ఆ సామాజికవర్గం వారి ఓట్లను గంపగుత్తగా తీసుకెళ్లి టీడీపీకి ఎలా వేయించాలా అనే తపన, తాపత్రయం అందులో కని్పస్తున్నాయని మండిపడ్డారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే.. టీడీపీ ముందు సాగిలబడ్డ జనసేన, బీజేపీ.. ► బీజేపీ, జనసేనలు 2014 ఎన్నికల్లో టీడీపీతో జట్టుకట్టి అధికారంలోకి వచ్చాక.. ప్రజలను రాచి రంపాన పెట్టాయి. జనసేన, బీజేపీ ఆత్మాభిమానం వదిలేసి బాండెడ్ లేబర్ కంటే అన్యాయంగా ఇప్పుడు మళ్లీ టీడీపీ ముందు సాగిలపడ్డాయి. ఘోరంగా ఓడిపోతున్నామని తెలిసే బాబు, పవన్ నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. ► డ్వాక్రా మహిళల గురించి చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తోంది. వారిని మోసం చేసిన చరిత్ర ఆయనది. 2014లో రుణమాఫీ చేస్తానని చెప్పి వారిని మోసంచేశారు. ► అసలు చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా? ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎక్కడున్నాడు? చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా? ► 2014లో చంద్రబాబు అలవికాని హామీలిచ్చి మోసంచేశారు. మేనిఫెస్టోను సైతం టీడీపీ వెబ్సైట్ నుంచి తొలగించారు. రుణమాఫీ పేరుతో రైతులను మోసంచేసింది ఎవరు? కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాబోతోందనే ఆందోళన చంద్రబాబు, పవన్లో కని్పస్తోంది. ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ.. ► చంద్రబాబుకు ఎన్నికల కమిషన్ ఇచి్చన నోటీసుకు స్పందించకపోగా బెదిరింపులకు దిగుతున్నారు. ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడిన మాటలు చదివి వినిపించాలని అనుకున్నా. కానీ, సిగ్గేస్తోంది. ► మేం చంద్రబాబు కుటుంబాల గురించి మాట్లాడితే చంద్రబాబు తలెత్తుకుని తిరగలేరు. ఎన్నికలంటే ఇచి్చన హామీలు చేసిన పనుల గురించి మాట్లాడాలి. ఎన్నికలంటే ప్రజలకు సేవ ఎలా చేయాలి.. వారితో ఎలా మమేకం అవ్వాలి.. రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలి.. పేదల కోసం సంక్షేమం ఎలా అందించాలి అనే అంశాలపై దృష్టిసారించాలి. కుటుంబాల గురించి కాదన్నది చంద్రబాబు గుర్తిస్తే మంచిది. ► ఎన్నికల కమిషన్ స్వతంత్ర సంస్థ. వాళ్ల పనివాళ్లు చేస్తారు. కక్ష సాధింపు చర్యలకు ఎన్నికల కమిషన్ పాల్పడుతుందని మేం భావించడంలేదు. అధికారుల బదిలీల గురించి మేం ఏమి మాట్లాడం. ► ఎన్నికల నోటిఫికేషన్, కోడ్ అమల్లోకి వచి్చనప్పటి నుంచి సీఎం జగన్ ప్రజల మధ్యే ఉంటూ గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ మద్దతిమ్మని అడుగుతున్నారు. కానీ, వ్యవస్థలను అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో గెలుపొందాలని టీడీపీ చూస్తోంది. ► 2019లో ఎన్నికల కమిషన్ కార్యాలయానికి వెళ్లి మరీ బెదిరించిన వ్యక్తి చంద్రబాబు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు, పదేపదే తప్పుడు ఫిర్యాదులు చేసి ఎన్నికల కమిషన్ అధికారుల్ని బెదిరిస్తున్నారు. ► ఇక పెన్షన్లు పంపిణీ జరగకుండా అడ్డుకుంది టీడీపీనే అని రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. మళ్లీ ఇప్పుడు ఆలస్యం కాకుండా ఒకటినే పెన్షన్లు పంపిణీ చేయాలని గొడవ చేస్తున్నారు. ► ఇక వలంటీర్లపై ఎల్వీ సుబ్రమణ్యం, నిమ్మగడ్డ రమేష్లతో బాబు ఫిర్యాదులు ఇప్పించారు. వలంటీర్లను దూషించిన చంద్రబాబు నేడు తాను అధికారంలోకి వస్తే వారికి రూ.10వేలిస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. -
కుక్కలు చింపిన విస్తరిలా కూటమి పరిస్థితి
-
రాజకీయాల్లోకి రావాలనుకుంటే చిరంజీవి రావచ్చు.. సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement