-
సమీప భవిష్యత్తులో రూ.1.48 లక్షలకోట్ల షేర్లపై ప్రభావం..!
రానున్న 4 నెలల్లో రూ.1.48 లక్షల కోట్ల విలువైన 66 కంపెనీల షేర్లకు లాకిన్ గడువు ముగియనుంది. దీంతో ఈ షేర్లలో అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో భారీగా కంపెనీలు స్టాక్మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. అయితే సెబీ నిబంధనల ప్రకారం యాంకర్ ఇన్వెస్టర్లు కంపెనీలో పెట్టుబడిపెట్టిన 90 రోజుల వరకు తమ షేర్లను అమ్మేందుకు వీలుండదు. ఆ లాకిన్ గడువు ముగిసిన తర్వాత వాటిని ఈక్విటీ మార్కెట్లో విక్రయించవచ్చు. గడిచిన కొద్దిరోజుల్లో టాటా టెక్నాలజీస్ వంటి ప్రముఖ కంపెనీలు సైతం ఐపీఓగా మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. ఆ ఒక్క కంపెనీ అనే కాకుండా మార్కెట్లో పేరున్న చాలా కంపెనీలు మంచి లిస్టింగ్గేయిన్స్తో స్టాక్మార్కెట్లో లిస్ట్అయ్యాయి. ఆ లాభాలంతా 90 రోజుల తర్వాత యాంకర్ ఇన్వెస్టర్ల పొందే వీలుంది. ఇదీ చదవండి: తగ్గనున్న పారుబాకీలు.. అధిక ఎన్పీఏలు ఉన్న రంగాలివే.. లాకిన్ గడువు పూర్తికానున్న షేర్లలో టాటా టెక్నాలజీస్, హోనాసా కన్జూమర్, సెల్లో వరల్డ్, జనస్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉన్నాయి. ఏప్రిల్ 1న గ్లోబల్ సర్ఫేసెస్, సాయి సిల్క్స్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికామ్ టెక్నాలజీస్ షేర్ల లాకిన్ ముగియనుంది. రానున్న 4 నెలల్లో దాదాపు 66 కంపెనీల లాకిన్ ముగుస్తుంది. దాంతో సుమారు రూ.1.48 లక్షలకోట్ల విలువైన షేర్లపై ప్రభావం పడనుంది. -
ఫేమస్ కంపెనీల మొదటిరోజు లాభాలు..(ఫొటోలు)
-
ఐపీఓకు రానున్న ప్రముఖ సంస్థ..?
ప్రముఖ సూపర్మార్కెట్ సంస్థగా విశాల్మార్ట్ తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రాబోతున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్ 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ.8,300 కోట్ల) నిధుల సమీకరణ కోసం తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)కు రానుందని సమాచారం. విశాల్మార్కెట్ పలు నగరాల్లో 560 సూపర్మార్కెట్లు నిర్వహిస్తోంది. ఈ సంస్థ విలువను 5 బిలియన్ డాలర్లుగా (రూ.41,500 కోట్లు) పరిగణించి, ఐపీఓకు రావాలని సంస్థ యోచిస్తున్నట్లు తెలిసింది. విశాల్ మెగామార్ట్లో స్విట్జర్లాండ్ పార్ట్నర్స్ గ్రూప్ పీజీహెచ్ఎన్.ఎస్, మన దేశానికి చెందిన కేదారా క్యాపిటల్కు కలిపి మెజార్టీ వాటా ఉంది. ఐపీఓలో ఈ రెండు సంస్థలు షేర్లు విక్రయిస్తాయని తెలుస్తోంది. ఇదీ చదవండి: కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే.. ఈ రెండు ప్రైవేటు ఈక్విటీ సంస్థలు కలిపి విశాల్ మెగామార్ట్లో ఎంత వాటా కలిగి ఉన్నాయి? ఎంతమేరకు విక్రయిస్తాయనేది తెలియాల్సి ఉంది. విశాల్ మెగామార్ట్ సీఈఓ గుణేందర్ కపూర్ ఐపీఓ వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. -
కోహ్లీ, అనుష్క శర్మల కంపెనీకి లైన్ క్లియర్
వ్యాపారవేత్తలే కాకుండా ప్రముఖులు సైతం కంపెనీలు స్థాపిస్తున్నారు. అందులో పెట్టుబడి పెడుతున్నారు. భవిష్యత్తులో అభివృద్ధి అయ్యే మంచి బిజినెస్ మోడల్ ఉన్నవారికి ఇన్వెస్టర్లుగా మారుతున్నారు. దాంతో ఇరువురికి లాభం జరిగేలా వ్యవహరిస్తున్నారు. అందులో కొన్ని కంపెనీలు మరింత వృద్ధి చెంది ఐపీవోగా స్టాక్మార్కెట్లోనూ లిస్ట్ అవుతున్నాయి. అలాంటి సంస్థ ‘గో డిజిట్’ ఐపీవోకు తాజాగా సెబీ ఆమోదం తెలిపింది. ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ పెట్టుబడి పెట్టిన ‘గో డిజిట్’ ఐపిఓకి వెళ్లేందుకు లైన్క్లియర్ అయింది. అందుకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపింది. గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్లో ఇన్వెస్టర్ అయిన కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ గ్రూప్ కూడా మద్దతు తెలిపింది. ఆగస్టు 2022లో కంపెనీ ఐపీఓ కోసం ప్రిలిమినరీ పత్రాలను దాఖలు చేసింది. డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) వివరాల ప్రకారం..గో డిజిట్ ఐపీఓలో రూ.1,250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నట్లు తెలిసింది. ఐపీఓ ద్వారా సమకూరే మూలధనాన్ని కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఐపీవో ద్వారా నిధులు సేకరించేందుకు కంపెనీ మొదటగా ఆగస్టు 2022లో సెబీకు డీఆర్హెచ్పీ దాఖలు చేసింది. అయినప్పటికీ, ఉద్యోగులకు సంబంధించి స్టాక్ అప్రిసియేషన్ రైట్స్ స్కీమ్లోని కొన్ని కారణాల వల్ల కొద్దికాలంపాటు నిలిచిపోయింది. సెబీ జనవరి 30, 2023న గో డిజిట్ డ్రాఫ్ట్ ఐపీఓ పేపర్లను తిరిగి ఇచ్చింది. కంపెనీ నుంచి మరింత సమాచారం కోరింది. ఇదీ చదవండి: మరో సంస్థపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ సవరించిన సమాచారంతో ఏప్రిల్ 2023లో ప్రిలిమినరీ ఐపీఓ పత్రాలను సెబీకి దాఖలు చేసింది. అన్ని పరిశీలించిన సెబీ తాజాగా ఐపీవోకు లైన్ క్లియర్ చేసినట్లు తెలిసింది. -
పెట్టుబడుల ఆశచూపి.. అందినకాడికి దోపిడీ
సాక్షి, హైదరాబాద్: స్టాక్ మార్కెట్లో తాము చెప్పే కంపెనీల్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని ఆశచూపి బ్యాంకు ఖాతాలు ఖాళీచేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. షేర్ల కొనుగోలు పేరిట అమాయకులకు గాలం వేసి రూ.కోట్లలో దోచుకుంటున్నారు. ఈ తరహా ఐపీఓ ట్రేడింగ్ మోసాలు ఇటీవల పెరిగినట్టు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరించింది. కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్)లను ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్ట్మెంట్ కింద కొనుగోలు చేయండి అంటూ సైబర్ నేరగాళ్లు నమ్మబలుకుతున్నట్టు పేర్కొంది. 2023లో ఈ తరహా కేసులు 627 నమోదు కాగా, బాధితులు రూ.3,91,54,683 పోగొట్టుకున్నట్టు టీఎస్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. ఈ ఏడాదిలో రెండు నెలల్లోనే మొత్తం 213 కేసులు నమోదయ్యాయని, బాధితులు రూ.27,40,76,211 పోగొట్టుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇలా మోసగిస్తున్నారు.. సైబర్ మోసగాళ్లు తొలుత వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్ట్రాగామ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా లింక్లు పంపుతున్నారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్(ఎఫ్పీఐ)ల వంటి ఇన్స్టిట్యూషనల్ విధానాల్లో ఐపీఓలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మబలుకుతున్నారు. ఈ ప్రకటనలు నమ్మి ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపితే, వారిని ఫేక్ ట్రేడింగ్ యాప్లను డౌన్లోడ్ చేసుకునేలా సైబర్ నేరగాళ్లు ప్రోత్సహించి తమ అదీనంలో ఉండే బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు వేయించుకుంటారు. నకిలీ యాప్లో బోగస్ డ్యాష్ బోర్డులను సృష్టించి వారికి లాభాలు వస్తున్నట్టుగా చూపుతున్నా రు. మరింత పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయ ని నమ్మిస్తారు. బాధితులు చివరకు తమ సొమ్మును డ్రా చేసుకునేందుకు ప్రయత్నించినప్పుడు మోసపోయిన విషయం తెలుస్తుంది. ఈ తరహా ట్రేడింగ్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నా రు. ఒకవేళ తాము మోసపోయినట్టు గుర్తిస్తే బాధితులు వెంటనే 1930 టోల్ఫ్రీనంబర్లో లేదా cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని సూచించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సిరాజ్ మియా సూపర్ యార్కర్.. బ్యాటర్కు ఫ్యూజ్లు ఔట్! వీడియో
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
Advertisement