-
కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు?.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, నల్గొండ: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అయిదేళ్లే కాదు మరో పదేళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉంటారని తెలిపారు. కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండేలు లేరని స్పష్టం చేశారు. తమ పార్టీలో గ్రూపులు లేవని అన్నారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తున్నామని చెప్పారు. ఏక్నాథ్ షిండేలను సృష్టించిందే బీజేపీ పార్టీ అని మండిపడ్డారు. కుల, మతాల మధ్య బీజేపీ చిచ్చు పెట్టాలని చూస్తుందని విమర్శించారు. ఈ మేరకు నల్లగొండలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. దళితున్ని ప్రతిపక్ష నేతగా సహించని పార్టీ బీఆర్ఎస్ అని దుయ్యబటారు. ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో తెలీదన్న హరీష్రావు మాటల్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్లో అయిదు గ్రూపులు ఉన్నాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అనడం తప్పని అన్నారు. బీఆర్ఎస్.. హరీష్ రావు, మహేశ్వర్రెడ్డి నోరు అదుపులోకి పెట్టుకొని మాట్లాడాలని, కోమటిరెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వాన్ని పడగొడతామన్న మాటలు బంద్ చేయాలని అన్నారు. ‘ప్రతిసారి మహేశ్వర్ రెడ్డి నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు. బండి సంజయ్ను దింపి కిషన్ రెడ్డిని ఎందుకు సీట్లో కూర్చోబెట్టారో మహేశ్వర్ రెడ్డికి తెలుసా?. 39 సీట్లకే పరిమితం చేసిన బీఆర్ఎస్ లీడర్లకు జ్ఞానోదయం కావట్లేదా?. ప్రతిపక్ష నేతలు విజ్ఞతతో మాట్లాడాలి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస 14 సీట్లను గెలవబోతుంది’ అని తెలిపారు. చదవండి: Congress: కాంగ్రెస్లో ఆ ముగ్గురు ఎవరు? -
గచ్చిబౌలి: ఓఘ వెల్నెస్ సెంటర్ ను ప్రారంభించిన డింపుల్ హాయతి
-
దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రానున్న లోక్సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీదేనని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ది కుటుంబ పాలన అని అన్నారు. ఇదే సమయంలో కేంద్రమంత్రిగా ఉండి సికింద్రాబాద్కు కిషన్ రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ను గెలిపించడమే మా బాధ్యత అని వ్యాఖ్యలు చేశారు. కాగా, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ ఏర్పాటపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘సభకు 10 లక్షల మందిని తరలిస్తాం. ఏప్రిల్ ఎనిమిదో తేదీన నాంపల్లిలో ఫిరోజ్ఖాన్ ఆధ్వర్యంలో మరోసారి మీటింగ్ ఉంటుంది. బూత్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. భువనగిరి, నల్లగొండలో ఖచ్చితంగా గెలుస్తాం. సికింద్రాబాద్లో కూడా దానం నాగేందర్ను గెలిపిస్తాం. దానం గెలుపు బాధ్యత మాదే. తెలంగాణలో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా ఈసారి గెలిచాం. బీఆర్ఎస్ పార్టీది కుటుంబ పాలన. మాజీ మంత్రి హరీష్రావు మాటలకు అర్ధం లేదు. కేసీఆర్ చేసిన పాపాలకు వర్షాలు కూడా పడటం లేదు. కేసీఆర్ కేబుల్ బ్రిడ్జ్ వేసి హైదరాబాద్ అభివృద్ధి అంటున్నాడు. 40వేల కోట్లతో మూసి ప్రాజెక్ట్ను ప్రక్షాళన చేసి అభివృద్ధి చేస్తాం. కేంద్రమంత్రిగా ఉండి కిషన్రెడ్డి సికింద్రాబాద్ను పట్టించుకోలేదు. ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కిషన్ రెడ్డి మతాల మధ్య గొడవలు పెట్టి గెలవాలని చూస్తున్నాడు. అది సాధ్యం కాదు. కాంగ్రెస్ కచ్చితంగా 14 సీట్లు గెలుస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇక, దానం నాగేందర్ మాట్లాడుతూ..‘సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి కోమటిరెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. రాబోయే ఎన్నికల్లో నేను గెలవడానికి అందరి సహకారం కావాలి. తుక్కుగూడ సభ విజయవంతం చేయడానికి సమావేశమయ్యాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
ఆర్థిక పరిస్థితి బాలేదు, కొంచెం టైం పట్టుద్ది: మంత్రి కోమటిరెట్టి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ల గెలుపు కోసం పనిచేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఒక్క తెలంగాణ కోసం తప్ప తాను ఎప్పుడూ పార్టీని వ్యతిరేకించలేదని పేర్కొన్నారు. తన నియోజకవర్గం, తన శాఖ తప్ప వేరే పట్టించుకోవడం లేదని అన్నారు. కేసీఆర్ ఆయన చేసిన పాపాలే ఇప్పుడు ఆయన్ను చుట్టుకున్నాయని విమర్శించారు. యాదగిరగుట్ట పేరును యాదాద్రిగా మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పని అన్నారు. కేసీఆర్ చేసిన పాపాల వల్ల నేడు రాష్ట్రానికి కరువు వచ్చిందన్నారు. దేవుడి పేరు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సర్వనాశనం చేశారని మండిపడ్డారు. . బీసార్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంటే కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి ఏదేదో మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి దుయ్యబట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ లేదని, అందుకే టికెట్ ఇచ్చినా వద్దు అని ప్రకటిస్తున్నారని అన్నారు. ‘మేము గేట్లు తెరుచుడు కాదు...గేట్లు తెరవకముందే కాంగ్రెస్లోకి తోసుకుని వస్తున్నారు. మా గేట్లు పలగొట్టి పార్టీలో జాయిన్ అవుతున్నారు’ అని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీలో ఒక్కరూ మిగిలరని పేర్కొన్నారు. బీజేపీ నుంచి రాకుంటే ఆపుకుంటే చాలు ఉద్యమాల పోరాట గడ్డ తెలంగాణ గడ్డ. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక లెక్క తెలంగాణ ప్రభుత్వాన్ని పడకొడితే ఊరుకోం. మా ప్రభుత్వాన్ని పడగొట్టుడు తరువాత బీజేపీకి ఉన్న 8మంది ఎమ్మెల్యేలు మా దగ్గరకు రాకుండా ఆపుకుంటే చాలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం, మంత్రులు, ఎమ్మేల్యేలు అందరూ ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వంలో R అండ్ D మినిస్టర్ గణపతి రెడ్డి మాత్రమే...ప్రశాంత్ రెడ్డి కాదు. ప్రశాంత్ రెడ్డి మాత్రమే కాదు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్దే నడిచింది. రేవంత్కు తెలియక నలుగురే రావులు ఉన్నారు అనుకున్నారు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ అవినీతి చూస్తుంటే రావులందరూ ఒకే దగ్గర జమైనారు. ప్రగతి భవన్ను జైలులాగా మార్చి రావులందరిని వేయాల్సి వచ్చేలా ఉంది. ఒక్కరిద్ధరే అనుకున్నాం కానీ తవ్వేకొద్దీ రావులందరూ బయటకు వస్తున్నారు. కేసీఆర్ అవితిని అంతా తీయాలంటే మాకు 20 ఏళ్లు పడేటట్లు ఉంది. పార్లమెంట్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. భగవంతుడు కూడా మమ్ములను విడదియ్యలేరు. చిన్న చిన్న మనస్పర్థలు ప్రతీ కుటుంబంలో ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి కానీ, నేను టికెట్ అడుగలేదు. మా పెద్దన్న కొడుకు మాకు చెప్పకుండా ధరకాస్తు ఇచ్చారు. తెలిశాక వద్దు అన్నాను. వైఎస్సార్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వైఎస్ఆర్ ప్లానింగ్ వల్లే హైదరాబాద్ అభివృద్ధి వేగంగా జరిగింది. హాలీవుడ్ లాంటి స్టూడియో పెట్టీ టూరిజం పెంచాలని చూస్తున్నాం. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాలేదు. రుణమాఫీ, పెన్షన్లు, లాంటి స్విమ్స్కు కొంత సమయం పడుతుంది. ఎలాగోలా నెట్టుకొస్తాం అనుకున్నాం. కానీ కేసీఆర్ అన్ని శాఖల్లో వేల కోట్ల బకాయిలు పెట్టీ పోయారు. రాష్ట్రం నిధులన్నీ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో పెట్టారు. విచారణ చేసి ఆ మూడు సెగ్మెంట్ల నిధుల ఖర్చుపై శ్వేత పత్రం విడుదల చేస్తాం. కడియం శ్రీహరి అనే వ్యక్తి ఒక సిస్టమేటిక్గా ఉంటారు. కడియం శ్రీహరి కూతురు అలా చెప్పింది అంటే అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ 12 సీట్లు రావడం పక్క. మా నల్గొండ, భువనగిరి సీట్లలో భారీ మెజారిటీ వస్తది. బీజేపీకి నాలుగు సీట్లు అనుకుంటున్నా. అక్కడ మేము దృష్టి పెట్టాం. దానం నాగేందర్ ఎమ్మేల్యేకు రాజీనామ చేయకుండా ఎంపికి పోటీ కష్టమే అనుకుంటా. ఒక పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచి.. ఇంకో పార్టీలో ఎంపిగా పోటీ అంటే లీగల్ సమస్యలు వస్తాయి అని నా అభిప్రాయం. సినిమాలు తీసి ప్రజలను రెచ్చకొట్టడం కాదు. పార్టీ పిరాయింపులు అనేది మోదీ, కేసీఆర్ అలవాటు చేసినవనే. బ్లాక్ మనీ అన్నారు ఏమైంది? అదానీ అంబానీ నంబర్ వన్ టు ఎలా అయ్యారు? కిషన్ రెడ్డి తెలంగాణకు ఎం చేశారు? కిషన్ రెడ్డి పుణ్యమా అని కాంగ్రెస్కు మంచి జరిగింది. మేము 12అనుకున్నాం కానీ 14 సీట్లు కిషన్ రెడ్డి వల్ల వస్తాయి. కిషన్ రెడ్డి స్థానంలో నేను ఉంటే మూసీ అభివృద్ధి, హైదరాబాద్లో సైతం 30, 40వేల పనులు చేసే వాడిని’ అని తెలిపారు. -
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
Advertisement