= అసెంబ్లీ లాబీల్లో మార్కాపురం చర్చ
= ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్న రియల్ పంచాయితీ
= చక్రం తిప్పుతున్న గుంటూరు జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యే
మార్కాపురం : మార్కాపురం రియల్ పంచాయితీ వ్యవహారం మంగళవారం అమరావతిలోని అసెంబ్లీ లాబీల్లో ఎమ్మెల్యేల మధ్య చర్చకు వచ్చింది. మార్కాపురం నియోజకవర్గానికి చెందిన టీడీపీ మాజీ ప్రజాప్రతినిధి గుంటూరు జిల్లాకు చెందిన అధికార టీడీపీ ఎమ్మెల్యే ద్వారా ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాడు. తద్వారా ఈ వ్యవహారం నుంచి బయట పడాలని చూస్తున్నాడు. ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన గుంటూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే.. విజయవాడ పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారితో మాట్లాడతానని చెప్పినట్లు తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యవహారంలో మార్కాపురం పోలీసులపై రామకోటేశ్వరరావు ఆరోపణలు చేయడంతో పాటు మాచవరం పోలీస్స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. మార్కాపురం నియోజకవర్గ టీడీపీ నేతల వ్యవహారశైలిపై ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా నేతలతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశం రెండు రోజులుగా అసెంబ్లీ లాబీల్లో కూడా ఎమ్మెల్యేల మధ్య అంతర్గత చర్చల్లో వ్యక్తమవుతోంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మార్కాపురం రియల్ పంచాయితీ చర్చనీయాంశమైంది. పోలీసుల వ్యవహారశైలిపై పలు విమర్శలు వస్తున్నాయి.
దీంతో ఈ కేసు నుంచి బయటపడేందుకు సదరు టీడీపీ నేత.. మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వ్యవహారం పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. ఇలా అయితే ప్రజల్లోకి ఎలా వెళ్తామని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ నేతలు అవినీతికి దూరంగా ఉండాలని హితబోధ చేస్తుండగా, పశ్చిమ ప్రకాశంలోని నేతలు మాత్రం ముఖ్యమంత్రికి ఆగ్రహం తెప్పించే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ పార్టీలోని కీలకమైన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నారు. మార్కాపురం సర్కిల్లో పలువురు పోలీసులు, అధికారులు బదిలీ కావచ్చని ప్రచారం జరుగుతోంది.
# Tag
Related news
-
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
దేశవ్యాప్తంగా ఆఫీస్ స్పేస్ లీజింగ్ గణనీయంగా పెరిగింది. ప్రస్తుతేడాది తొలి త్రైమాసికంలో ఆఫీస్ స్థలాల లీజింగ్లో వృద్ధి నమోదైందని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ వెస్టియన్ తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. టాప్ ఏడు ప్రధాన నగరాల్లో ఆఫీస్ లీజింగ్ డేటాను విడుదల చేసింది.2024 జనవరి-మార్చిలో ఆఫీస్ లీజింగ్ 13 శాతం పెరిగి 134 లక్షల చదరపు అడుగులకు చేరుకుంది. ఇది సంవత్సరం క్రితం ఇదే కాలంలో 118.5 లక్షల చదరపు అడుగులు ఉండేది. అయితే 2023 నాల్గవ త్రైమాసికంలో గరిష్ట స్థాయికి చేరుకున్న తర్వాత ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో 31 శాతం తగ్గింది.మెట్రో నగరాల్లో అత్యధికంగా చెన్నైలో ఆఫీస్ స్థలాల డిమాండ్ రెండింతలు పెరిగింది. ఏడాది క్రితం 16 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన స్థలం లీజుకు తీసుకోగా, ఈసారి ఏకంగా 33.5 లక్షల చదరపు అడుగులకు చేరుకున్నట్లు నివేదిక వెల్లడించింది.హైదరాబాద్లో భారీగా లీజింగ్ హైదరాబాద్లోనూ ఆఫీస్ స్థలం లీజింగ్ భారీగా పెరిగింది. తొలి త్రైమాసికంలో 22.7 లక్షల చదరపు అడుగులు లీజుకు తీసుకున్నట్లు వెస్టియన్ నివేదిక తెలిపింది. ఏడాది క్రితం నమోదైన 15 లక్షల కంటే ఇది 50 శాతం అధికం కావడం విశేషం. మరోవైపు, దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆఫీస్ స్థలం లీజు తగ్గుముఖం పట్టింది. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో 18.1 లక్షల చదరపు అడుగుల స్థలం మాత్రమే లీజుకు పోయిందని తెలిపింది.ఏడాది క్రితం తీసుకున్న 24 లక్షల చదరపు అడుగులతో పోలిస్తే 25 శాతం తగ్గింది. అలాగే ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్లో కూడా 40 శాతం తగ్గింది. దేశవ్యాప్తంగా ఆఫీస్ లీజింగ్లో దక్షిణాది నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వాటా 61 శాతంగా ఉంది. ఈ మూడు నగరాల్లో వాటా 54 శాతం పెరిగింది. అయితే బెంగళూరులో ఆఫీస్ లీజింగ్ 33 లక్షల చదరపు అడుగుల నుంచి 26.2 లక్షల చదరపు అడుగులకు పడిపోవడం గమనార్హం.ఆర్థిక రాజధాని ముంబైలో ఆఫీస్ స్థలం లీజు 12 లక్షల అడుగుల నుంచి 24.9 లక్షలకు పెరగడం విశేషం. కోల్కతాలో మాత్రం 3.5 లక్షల చదరపు అడుగుల నుంచి 1.6 లక్షల అడుగులకు పడిపోయింది. పుణెలో ఆఫీస్ స్థలం సగానికి సగం పడిపోయింది. ఏడాది క్రితం 15 లక్షల చదరపు అడుగులు కాగా, ఈ సారి 7.1 లక్షల చదరపు అడుగులకు జారుకుంది.ఇక రంగాలవారీగా తీసుకుంటే ఐటీ, ఐటీఈఎస్ రంగానికి చెందిన సంస్థలు అధికంగా ఆఫీస్ స్థలాలను లీజుకు తీసుకున్నాయి. వీటి వాటా 47 శాతంగా ఉంది. అలాగే బీఎఫ్ఎస్ఐ రంగం వాటా 11 శాతంగా ఉంది. -
AP: నేటితో ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ
రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారం ముగియ నుంది. బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్సభకు 654 నామినేషన్లు దాఖలయ్యాయి. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ గురువారంతో ముగియనుంది. ఎన్నికల్లో పోటీకి యువత ఎక్కువగా మొగ్గుచూపుతుండటంతో ఈ సారి నామినేషన్లు భారీగా దాఖలవుతున్నాయి. ఒకరోజు గడువు ఉండగానే బుధవారం వరకు అసెంబ్లీకి 3,644, లోక్సభకు 653 నామినేషన్లు దాఖలయ్యాయి. బుధవారం ఒక్కరోజే అసెంబ్లీకి 1,294, లోక్సభకు 237 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. లోక్సభకు బుధవారం నామినేషన్లు వేసినవారిలో బీజేపీ తరఫున పురందేశ్వరి, జనసేన తరఫున వల్లభనేని బాలశౌరి,ఉదయ్ శ్రీనివాస్ తదితరులున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ఆరు రోజుల్లో.. 25 పార్లమెంట్ సెగ్మెంట్లకు 555 మంది 653 సెట్ల నామినేషన్లు దాఖలు.తొలిరోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలుమూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగోరోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు ఐదోరోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరోరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు ఆరు రోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది 3701 సెట్ల నామినేషన్లు దాఖలుతొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలుమూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలునాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలుఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలుఆరోరోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు -
ఒడిశాలో బీజేపీ ఎన్నికల ప్రచారం.. రంగంలోకి 40 మంది స్టార్ క్యాంపెయినర్లు
లోక్సభ ఎన్నికల్లో 400పై చీలుకు స్థానాల్లో గెలిచే లక్ష్యంగా బీజేపీ తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రత్యర్ధి గెలుపు అవకాశాల్ని మలుపు తిప్పేలా ఎన్నికల వ్యూహాలు రచిస్తుంది. ఇందులో భాగంగా ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ప్రచారంలో 40 మంది స్టార్క్యాంపెయినర్లను రంగంలోకి దించింది. వారిలో ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇక 40 మంది స్టార్ క్యాంపెయినర్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్ షా , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉన్నారు. వీరితో పాటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్లు ఈ జాబితాలో ఉన్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన లేఖలో పేర్కొంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ, ఒడియా నటులు అనుభవ్ మొహంతి, శ్రీతమ్ దాస్, హరిహర్ మహపాత్ర, పింకీ ప్రధాన్ కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఒడిశాలో మే 13 నుంచి నాలుగు దశల్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి. -
‘మీకో దండం.. మీ పార్టీకో దండం’.. నేను నా కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటా
భోపాల్ : మీకో దండం!!.. మీ పార్టీకో దండం.. నేను నా డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం చేసుకుంటానంటూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మహిళా నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో డిప్యూటీ కలెక్టర్ హోదాను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన తనని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. అసెంబ్లీ, లోక్సభ సీటును నిరాకరించి పార్టీ తనకు ద్రోహం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా గతంలో డిప్యూటీ కలెక్టర్గా పనిచేసిన నిషా బాంగ్రే ఇప్పుడు తన ఉద్యోగాన్ని తిరిగి పొందాలని కోరుతున్నట్లు తెలిపారు. నిషా బాంగ్రే మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా విధులు నిర్వహించారు. అయితే డిప్యూటీ కలెక్టర్గా హోదాలో ఉన్నతమైన సేవలందించినందుకు ప్రజలు తనని రాజకీయాల్లోకి రావాలని కోరారు. అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ బాంగ్రేను సంప్రదించింది. తమ పార్టీలో చేరితే రాజకీయంగా సముచితం స్థానం కల్పిస్తామని ఆశచూపించింది. అధికార ప్రతినిధి పదవిని కట్టబెట్టింది. కాంగ్రెస్ నాయకత్వం ఒప్పుకోలేదు ‘కాంగ్రెస్ నన్ను సంప్రదించింది. అప్పుడే డిప్యూటీ కలెక్టర్ పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వెళ్లాలనే అనుకున్నాను. నాకు రాజకీయ నేపథ్యం లేదు. ఆర్థికంగా బలమైన కుటుంబం కూడా కాదు. ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్లో చేరాను. చివరకు ఎమ్మెల్యే టికెట్ దక్కలేదు. బీజేపీ కావాలంటే నాకు టికెట్ ఇచ్చేది. కానీ స్థానిక రాజకీయాల కారణంగా ఇవ్వలేదు. చదువుకున్న మహిళ రాజకీయాల్లోకి రావడానికి కాంగ్రెస్ బెతుల్ జిల్లా నాయకత్వం భయపడింది’ అని బాంగ్రే అన్నారు . ఫలితాలతో పరిస్థితులు తారుమారు అసెంబ్లీ ఫలితాల తరువాత పరిస్థితులు తారుమారయ్యాయి. కాంగ్రెస్ అన్నీ కమిటీలను రద్దు చేసింది. బాధ్యతలు అప్పగించలేదు. కనీసం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా విలువైనా ఉండేది. లోక్సభ సీటు ఇవ్వలేదు. అందుకే నన్ను తిరిగి ఉద్యోగంలో చేరాలని కుటుంబసభ్యులు ఒత్తిడి చేస్తున్నారు. నా రాజీనామాను కేంద్రం అంగీకరించలేదు. తిరిగి విధుల్లో చేరేందుకు వీలుంది. ఇప్పుడు కాంగ్రెస్కు రాజీనామా చేసి.. డిప్యూటీ కలెక్టర్గా బాద్యతులు చేపట్టాలని నిర్ణయించుకున్నాను అని తెలిపారు. నిషా బాంగ్రే ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీలో చేరే వ్యక్తులు ఎమ్మెల్యే,లోక్సభ టికెట్లు పొందొచ్చు. ఇందుకోసం వారు కష్టపడి పనిచేయాలి. నిషా బాంగ్రేకి అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించాం. రాజకీయాల్లో కెరీర్ను నిర్మించుకోవడానికి సమయం పడుతుంది. ఆమె పార్టీని వదిలి వెళ్లాలనుకుంటే వెళ్లిపోవచ్చు అని కాంగ్రెస్ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. -
లోకేశ్ ఐటీ.. రియల్ లూటీ
సాక్షి, అమరావతి: రాజధాని పేరుతో మాటల మరాఠి చంద్రబాబు చూపించిన గ్రాఫిక్స్ పాలనను ప్రజలు ఛీకొట్టారు. అరచేతిలో స్వర్గం చూపిస్తే.. జనం తమ ఓటుతో అసలు వాస్తవం చూపించారు. మన మందళగిరి చినబాబు అయితే ఏకంగా ఐటీ పేరుతో మంగళగిరిలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరతీస్తే.. గోబెల్స్కు రాజగురువు రామోజీ మాత్రం మంగళగిరిని ఏకంగా మాదాపూర్లా మార్చేయడానికి మా మాలోకం కష్టపడ్డాడని జాకీలతో పైకెత్తడానికి తెగ ఆరాటపడుతున్నారు. ‘మంగళగిరి ఐటీపై జగన్ వేటు’అంటూ ఈనాడులో విషపు రాతలు రాశారు. చంద్రబాబు హయాంలో మంగళగిరి సింగపూర్ను తలదన్నేలా బహుళ అంతస్తుల భవనాల ఐటీ కంపెనీలతో కళకళలాడేదట. కనకదుర్గ వారధి నుంచి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వరకు ఆకాశహర్మ్యాలతో హైదరాబాద్లోని మాదాపూర్ను తలపించేదట. యువత ఆనందంతో ఉద్యోగాలు చేసుకునేవారట. జగన్ వచ్చాక ఇవన్నీ మాయమయ్యాయట. ఇదీ అసలు నిజం.. ఐటీ కంపెనీలకు ప్రోత్సాహం అంటూ చంద్రబాబు పుత్రరత్నం ఇక్కడ ఐటీ మంత్రిగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెగబడ్డారు. ఐటీ పార్కుల పేరుతో బిల్డింగ్లు నిర్మించేసి.. ఐటీ కంపెనీలు రాకపోతే ఖాళీగా ఉన్న స్థలానికి ప్రభుత్వమే అద్దె చెల్లించేలా ప్రణాళిక వేశారు. ఇందుకోసం డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్కుల పేరుతో ప్రత్యేక పాలసీ రూపొందించారు. ఈ పాలసీ ముసుగులో బాబు అనుయాయులు పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ భవనాలు నిర్మించి భారీ ఎత్తున ప్రభుత్వ సొమ్మును కాజేశారు. ఈ విధంగా నిరుపయోగంగా ఉన్న భవనాలకు భారీగా అద్దెను చెల్లించాల్సి వస్తుండటంతో ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నిజంగా మంగళగిరిలో ఐటీ కంపెనీలు వచ్చి ఉంటే ఆ కంపెనీల పేర్లు రాయొచ్చు కదా రామోజీ..? ఒక్క కంపెనీ పేరు రాసే ధైర్యం లేదు. ఐటీ, ఎల్రక్టానిక్స్ రంగాల్లో మూడు లక్షల ఉద్యోగాలంటూ లోకేశ్ ప్రచారంలోని డొల్లతనం 2019 జనవరిలో జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే బయట పడింది. చంద్రబాబు అధికారం చేపట్టినప్పటి నుంచి ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంటే 2018 అక్టోబర్ నాటికి కేవలం 8,768 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో 47,908 మందికి ఐటీ రంగంలో ఉపాధి కల్పించినా అవేవీ మీకు పట్టవా రామోజీ?
Related News by category
-
టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘన
● నిద్ర నటిస్తున్న ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం మార్కాపురం: మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన టీడీపీ బైక్, ఎన్నికల ర్యాలీలో కోడ్ ఉల్లంఘన జరిగింది. పూర్తి స్థాయిలో పర్యవేక్షించాల్సిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం నిద్ర నటిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు పచ్చ పాతం చూపిస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి, ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం మార్కాపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల అధికారి నుంచి 65 బైక్లకు మాత్రమే అనుమతి తీసుకోగా, బైక్ ర్యాలీలో సుమారు 150కి పైగా బైక్లు పాల్గొన్నాయి. పట్టణంలోని పాత బస్టాండ్, నాయుడు వీధి, తేరు బజారు, మెయిన్ బజారుతో పాటు పట్టణమంతా హారన్లు మోగిస్తూ ర్యాలీ నిర్వహించినా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం ఏమీ పట్టనట్లుగా వ్యవహరించారు. బృందానికి నాయకత్వం వహిస్తున్న వెలిగొండ ప్రాజెక్టులోని అధికారి తీరు విమర్శలకు తావిస్తోంది. కేవలం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేసే ర్యాలీలు, బహిరంగ సభలపై ఫోకస్ పెడుతూ కేసులు నమోదు చేస్తున్న ఆ అధికారి, టీడీపీ నేతలపై ప్రేమ చూపిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. బైక్ ర్యాలీలో అనుమతి కంటే ఎక్కువ వాహనాలు ఉన్నా ఆ అధికారికి కోడ్ ఉల్లంఘన కనిపించటం లేదా అని పలువురు విమర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
తాగి..తూగి
యర్రగొండపాలెం: టీడీపీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు నామినేషన్ దాఖలు సందర్భంగా శుక్రవారం పట్టణంలో మద్యం ఏరులై పారింది. నామినేషన్కు ముందు పట్టణంలో టీటీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ముందుగానే మద్యం కేసులతోపాటు డబ్బులు కూడా ఇచ్చారు. వారికి మాంసంతో కూడిన భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. పట్టణంలో ఏ సందులో చూసిన తెలుగు తమ్ముళ్లు మద్యం తాగుతూ కనిపించారు. బ్రాందీ షాపుల వద్ద క్యూ కట్టారు. ఫూటుగా మద్యం తాగిన వీరు ర్యాలీలో చిందులు తొక్కారు. ర్యాలీలో పాల్గొన్నవారి సంఖ్య అంతంత మాత్రమే అయినా పచ్చ నేతలు మాత్రం నియోజకవర్గం అంతా తమ వెనకే నడుస్తుందన్న బిల్డప్ ఇచ్చారు. తాగిన మైకంలో వారు పట్టణంలో ద్విచక్ర వాహనాలపై త్రిబుల్ రైడింగ్ తో హల్చల్ చేశారు. ఒక ద్విచక్ర వాహనంపై త్రిపురాంతకం మండలంలోని మానేపల్లికి చెందిన ముగ్గురు మితిమీరిన వేగంగా నడుపుతూ రామసముద్రానికి సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద బోల్తాపడ్డారు. ఈ సంఘటనలో బైరెడ్డి నరసింహారెడ్డి, పోట్ల మల్లికార్జునరెడ్డిలకు తీవ్రంగా గాయాలయ్యాయి. వీరిని యర్రగొండపాలెంలోని టీడీపీ నాయకుడు మన్నె రవీంద్రకు చెందిన వైద్యశాలలో చేర్పించి చికిత్స చేయించారు. గాయపడిన వారిలో బైరెడ్డి నరసింహారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని పల్నాడు జిల్లా నరసరావుపేటలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. ఆ వైద్యశాలలో ఆయన కోమాలోకి వెళ్లినట్లు తెలిసింది. యర్రగొండపాలెంలో ఏరులై పారిన మద్యంకనిపించని కూటమి జెండాలు.. టీడీపీ ర్యాలీలో కూటమి జెండాలు కనిపించలేదు. ర్యాలీని రక్తికట్టించటానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వాహనాలు ఏర్పాటు చేసి జనసమీకరణ చేశారు. వారు అనుకున్న మేరకు కార్యకర్తలు రాకపోయినా స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్నీ పచ్చజెండాలే కనిపించాయి కానీ జనసేన, బీజేపీలకు చెందిన జెండాలు కనిపించలేదు. ఈ సందర్భంగా స్థానిక కొలుకుల సెంటర్లో కాన్వాయ్పై నుంచి ఎరిక్షన్బాబు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి తమ ప్రసంగాల్లో టీడీపీ కార్యకర్తలతోపాటు జనసేన, బీజేపీలకు చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారని, ఎమ్మార్పీఎస్ తమకు మద్దతు ఇస్తుందని ఆయా పార్టీలకు చెందిన నాయకులను మాత్రం పరిచయం చేశారు. -
మంచి ముహూర్తం..
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ఒంగోలు అర్బన్: నామినేషన్ల ప్రక్రియ రెండో రోజు శుక్రవారం ఏకాదశి మంచి రోజు కావడంతో జిల్లాలో భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒంగోలు పార్లమెంట్కు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 15 నామినేషన్లు వచ్చాయి. జిల్లాలో అధికార వైఎస్సార్ సీపీ, టీడీపీకి చెందిన పలువురు అభ్యర్థులు, స్వతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. జనసంద్రమైన గిద్దలూరు: వైఎస్సార్ సీపీ గిద్దలూరు అసెంబ్లీ అభ్యర్థిగా మార్కాపురం ఎమ్మెల్యే కేపీ.నాగార్జున రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తలతో నిర్వహించిన భారీ ర్యాలీలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఒంగోలు పార్లమెంట్ సమన్వయకర్త చెవిరెడ్డి భాస్కర రెడ్డి, కేపీ నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి కుందురు నాగార్జున రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కుందురు కల్పన కూడా వైఎస్సార్ సీపీ తరఫున మరో సెట్టు దాఖలు చేశారు. కొండపిలో మంత్రి ఆదిమూలపు తరుఫున.. కొండపి అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తరఫున కొండపి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్ సీపీ నాయకులు ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నాయకులు కొండపి తహశీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి ఏ.కుమార్కు మధ్యాహ్నం 12.25 గంటలకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మంత్రి ఆదిమూలపు సురేష్ నామినేషన్ను ప్రపోజ్ చేసిన వారిలో రాష్ట్ర వైఎస్సార్సీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎన్నాబత్తిన వెంకటేశ్వర రావు(చిన్నా), రాష్ట్ర నాయకులు డాకా పిచ్చిరెడ్డి, కొండపి జెడ్పీటీసీ సభ్యురాలు మారెడ్డి అరుణ కుమారి రెడ్డి, పొన్నలూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ వెంకటేశ్వర్లు ఉన్నారు. అసెంబ్లీకి పలువురు నామినేషన్లు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ తరుఫున యర్రగొండపాలెం అసెంబ్లీ అభ్యర్థిగా గూడూరి ఎరిక్షన్ బాబు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. దర్శి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థిగా లక్ష్మీ గొట్టిపాటి ఒక సెట్టు నామినేషన్ వేశారు. సంతనూతలపాడు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా బొమ్మాజి నిరంజన్ విజయ కుమార్ ఒక సెట్టు, కొండపి అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున డోలా కుటుంబ సభ్యులు డోలా రాజేశ్వరి కూడా ఒక సెట్టు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. గిద్దలూరు అసెంబ్లీకి టీడీపీ అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డి ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. గిద్దలూరుకు స్వతంత్ర అభ్యర్థులు లక్ష్మీ రామ నాయక్ ముదావత్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున జువ్వాది పవన్ కుమార్, మార్కాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా పొట్టి వెంకట సుబ్బారావు, ఒంగోలు అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా బుట్టి రమేష్ బాబు, స్వతంత్ర అభ్యర్థిగా మన్నం సుధీర్ కుమార్లు నామినేషన్లు దాఖలు చేశారు. తొలిరోజు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు 8 అసెంబ్లీ స్థానాలకు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో రెండు రోజులు కలిపి మొత్తం 28 నామినేషన్లు దాఖలయ్యాయి. అశోక్రెడ్డిపై దొమ్మీ కేసు.. వాహన దగ్ధం, దొమ్మీ..ట్రెస్పాస్ కేసులు.ఇవీ గిద్దలూరు టీడీపీ అభ్యర్థి ముత్తుముల అశోక్రెడ్డి చరిత్ర. అశోక్రెడ్డిపై గిద్దలూరు పోలీస్స్టేషన్లో పలు సెక్షన్ల కింద ఉన్నాయి. అలాగే బాపట్ల జిల్లా మార్టూరు పోలీస్స్టేషన్లో కేసు నమోదై ఉంది. అశోక్రెడ్డి వద్ద రూ.3.50 లక్షల నగదు, భార్య పుష్పలీలా వద్ద రూ.6.68 లక్షల నగదు చేతిలో ఉన్నట్లు ఆఫిడవిట్లో చూపించారు. అశోక్రెడ్డి పేరుపై రూ.3.93 కోట్లు, భార్య పేరుపై రూ.2.59 కోట్లు చరాస్తులు చూపించారు. ఇద్దరి వద్ద సుమారు రూ.4.40 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.స్వామికి ఉంది డొక్కు కారేనట మరుగుదొడ్ల సొమ్మును భారీగా కాజేసిన కొండపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజస్వామికి 2013 మోడల్ మారుతి కారు మాత్రమే ఉందని ఆఫిడవిట్లో పొందుపరిచాడు. తన దగ్గర రూ.1.26 లక్షల నగదు, తన భార్య వద్ద రూ.27 వేల నగదు మాత్రమే ఉన్నట్లు చూపించాడు. భార్యభర్తల పేరుపై రూ.47 లక్షల విలువైన చరాస్తులు, సుమారు రూ.35 లక్షల విలువైన చరాస్తులు ఉన్నట్లు చూపించాడు. స్వామిపై వివిధ పోలీస్స్టేషన్లలో 9 కేసులు నమోదై ఉన్నాయి. మరుగుదొడ్ల నిర్మాణం పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా భారీగా సొమ్ము కాజేసిన స్వామి..ఎన్నికల ఆఫిడవిట్లో చూపిన వివరాలు చూసి ప్రజలు అవాక్కవుతున్నారు. -
పేదలకు విద్య, వైద్యం అందించటమే లక్ష్యం
ఒంగోలు సబర్బన్: పేదలకు విద్య, వైద్యం సంతృప్తిగా అందించటమే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 58 నెలల పాలనలో ముందుకు సాగిందని మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి చెప్పారు. ఈ మేరకు బాలినేని మన ఒంగోలు–మన వాసన్న కార్యక్రమంలో భాగంగా బాలాజీ నగర్లో శుక్రవారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణంతో కలిసి అగ్రహారం గేటు అవతల బత్తులవారికుంట, బ్రాహ్మణ బజారు, వార్డు సచివాలయం వీధి, మిట్టమీద, దత్తాత్రేయ కాలనీ, అరవ కాలనీలలో నుంచి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బాలినేనికి స్థానికులు హారతులు, పూల వర్షంతో, గుమ్మడి కాయలు దిష్టి తీసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ సామాన్యులు అనారోగ్యం పాలైతే ఆర్ధిక స్థోమత లేనప్పుడు అప్పులు చేసి మరీ కుటుంబ సభ్యులను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. ఆ పరిస్థితికి చరమగీతం పాడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్ని రకాల వ్యాధులకు ఆరోగ్య శ్రీలో అవకాశం కల్పించటంతో పాటు ఆరోగ్య శ్రీ ఖర్చు దాదాపు రూ.25 లక్షల వరకు ప్రభుత్వమే భరించేలా ఉత్తర్వులు జారీ చేశారన్నారు. అదేవిధంగా విద్య విషయంలో కూడా సీఎం వైఎస్ జగన్ ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంతో పాటు నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారని గుర్తు చేశారు. వాటితో పాటు అమ్మ ఒడి పేరుతో పిల్లలను పనికి పంపకుండా బడికి పంపేందుకు ఆర్థిక సాయం చేయటం కూడా మరెక్కడా లేదన్నారు. చిన్నారులకు బూట్ల నుంచి దుస్తులు, సాక్సులు, టై అందజేసి విద్యను ప్రోత్సహిస్తున్నారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను గడప ముంగిటకే తీసుకొచ్చి పరిపాలనను గ్రామాల్లోనే కొనసాగించారని చెప్పారు. ఒంగోలు నగరాన్ని ఎంతగానో అభివృద్ధి చేశానన్నారు. రానున్న ఎన్నికల్లో తనను అఖండ మెజారిటీతో గెలిపించి ఆరోసారి గెలిపించి తనచేత సిక్సర్ కొట్టించాల్సిన బాధ్యత ఒంగోలు నియోజకవర్గ ప్రజలపై ఉందన్నారు. 16వ డివిజన్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటి వద్ద బాలినేని వివరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, వైఎస్సార్ సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, 16వ డివిజన్ కార్పొరేటర్ శ్రీరాం నాగభూషణం, డివిజన్ అధ్యక్షుడు పోట్లూరి భాస్కర్, అడపాల రాము, వాకా కృష్ణారెడ్డి, గొర్రెపాటి శ్రీనివాసరావు, బొట్ల సుబ్బారావు, తమ్మినేని మాధవి, నారాయణ, తోటకూర రాజేష్, వంశీకృష్ణ, వెంకటేశ్వర్లు, సురేష్, కుమార్, ఇసాకు, ఏసు, విజయ్, వంశీ, పాజర్ల నాగరాజు, అశోక్ బాబు, సుబ్బయ్య, బాల గురవయ్య, పురిణి ప్రభావతి, లక్ష్మయ్య, గుర్రాల రామ్మోహన్తో పాటు పలువురు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఒంగోలు నగరంలోని 16వ డివిజన్లో ‘మన ఒంగోలు–మన వాసన్న’ -
వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యం
సంతనూతలపాడు (చీమకుర్తి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన ప్రభంజనం సృష్టిస్తూ దూసుకెళ్తోందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, బాపట్ల పార్లమెంట్ పరిశీలకుడు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి అన్నారు. సంతనూతలపాడు పంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో శుక్రవారం వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ దుంపా చెంచిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మోదుగుల మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారని.. చంద్రబాబు తన పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదని చెప్పారు. మళ్లీ ఈ ఎన్నికల్లో ఉత్తుత్తి వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ముందుకొస్తున్నారని ఎద్దేవా ఏశారు. సీఎం జగన్ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగార్జునను, ఎంపీ అభ్యర్థిగా నందిగం సురేష్ను గెలిపించాలని కోరారు. మంత్రి మేరుగు నాగార్జున మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, పార్టీ విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈనెల 24 న చీమకుర్తిలో తాను నామినేషన్ వేస్తానని, నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మారెళ్ళ బంగారు బాబు, ఎంపీపీ బీ విజయ, జెడ్పీటీసీలు దుంపా రమణమ్మ, వేమా శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బొల్లినేని కృష్ణయ్య, సొసైటీ ప్రెసిడెంట్ దుంపా యలమందారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, పేర్నమిట్టలోని 6 డివిజన్ల కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జేసీఎస్ కన్వీనర్లు, చీమకుర్తి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల నాయకులు, పీఏసీఎస్ త్రి మెన్ కమిటీ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పాల్గొన్నారు. సంతనూతలపాడులో విజయం సాధించి జగనన్నకు బహుమతిగా ఇస్తాం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ కార్యాలయం ప్రారంభం
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
- రెచ్చిపోయిన రౌడీ మూకలు
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement