సాక్షి, హైదరాబాద్ : ‘దేవుడు మాకు న్యాయం చేశాడు...జగనన్నకు బెయిల్ వచ్చింది..’ అని జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల వ్యాఖ్యానించారు. ‘ఒక్క జగన్కు మాత్రమే బెయిల్ రావడం కాదిది... కోట్లాదిమంది రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే అంశం.. వారంతా ఎంతో ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు..’ అంటూ ఆమె సోమవారం నాడిక్కడ స్పందించారు.
కాంగ్రెస్ రాజకీయ ప్రయోజనాల కోసమే జగన్ను అణగదొక్కాలని చూసిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్తో పార్టీకి ప్రమాదమని భావించిందనీ, పెద్ద సవాలుగా తయారవుతారనే ఉద్దేశంతో సీబీఐ ద్వారా కేసులు పెట్టి వేధించిందని తెలిపారు. పార్టీకి వైఎస్ 30 ఏళ్లు చేసిన సేవలను మర్చిపోయి ఆయన కుటుంబాన్ని వేధించడానికి కాంగ్రెస్ పూనుకుందన్నారు.
‘వైఎస్ వంటి బలమైన నాయకుని మరణం తరువాత ఇంత పెద్ద రాష్ట్రం జగన్ చేతుల్లోకి వెళ్లి పోవడం ఆ పార్టీకి ఇష్టం లేదు. ఎలాగైనా తమ పట్టు కొనసాగాలనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడింది..’ అని వివరించారు. కానీ దేవుని వల్లనే ఈరోజు ఈ అద్భుతం జరిగిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
జగన్ విడుదలతో వైఎస్సార్ కాంగ్రెస్ పునరుజ్జీవం పొందిందనీ, వచ్చే ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించి అత్యధిక స్థానాలు గెల్చుకుంటుందని చెప్పారు. కేంద్రంలో కూడా నిర్ణయాత్మక పాత్రను నిర్వర్తిస్తుందన్నారు. తెలంగాణ, కోస్తా, రాయలసీమ.. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్కు అపారమైన ప్రజాభిమానం ఉందని తెలిపారు. ఆ విధంగా కోట్లాది మంది ప్రజల హృదయాల్లోకి పార్టీ వెళ్లిందని షర్మిల చెప్పారు.
దేవుడు మాకు న్యాయం చేశాడు: షర్మిల
Published Tue, Sep 24 2013 2:48 AM
Advertisement
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
ఎక్కడో కూర్చోని మాట్లాడతారు.. వారిని నేను పట్టించుకోను: కోహ్లి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
Advertisement