-
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలోకి యనమల కృష్ణుడు
సాక్షి, తాడేపల్లి: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో కాకినాడ జిల్లా టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు వైఎస్సార్సీపీలోకి చేరారు. యనమల కృష్ణుడితో పాటు టీడీపీ నేతలు పి.శేషగిరిరావు, పి.హరిక్రిష్ణ, ఎల్.భాస్కర్ వైఎస్సార్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో తుని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దాడిశెట్టి రాజా, కాకినాడ వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్ధి చలమలశెట్టి సునీల్ పాల్గొన్నారు.ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా..సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ, టీడీపీలో డబ్బున్న వాళ్లకి, ఎన్నారైలకే టిక్కెట్లిచ్చారని.. పార్టీలో మొదటి నుంచి ఉన్నవారిని మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీలో 42 సంవత్సరాలుగా ఉన్నా. చంద్రబాబు, యనమల మోసం వల్లే నాకు అన్యాయం జరిగింది. చంద్రబాబు బీసీలను మోసం చేశారనడానికి నేనే ఉదాహరణ. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లో ఉన్నా. నాకు తుని టిక్కెట్ ఇవ్వకపోగా.. నన్ను ఘోరంగా అవమానించారు. తునిలో ఏరోజూ యనమల రామకృష్ణుడు లేరు’’ అంటూ కృష్ణుడు ధ్వజమెత్తారు.‘‘42 సంవత్సరాలగా ప్రజల మధ్య ఉన్నది నేనే.. ఐదేళ్ల సీఎం జగన్ పాలన చూసి వైఎస్సార్సీపీలో చేరా. సీఎం వైఎస్ జగన్ని మళ్లీ ముఖ్యమంత్రిని చేయడానికి కృషి చేస్తా. కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్, తుని ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గెలుపునకు కృషి చేస్తా’’ అని కృష్ణుడు తెలిపారు. -
చిన్నమ్మకు పెద్ద ఒణుకు!’
సాక్షి, రాజమహేంద్రవరం: రాజమండ్రి పార్లమెంట్ ఎన్నికల్లో అనపర్తి అసెంబ్లీ సెంటిమెంట్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి ఆందోళన రేకెత్తిస్తోంది. బీజేపీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగిన ఆమెను ఓటమి భయం వెంటాడుతోంది. ఇందుకు గతంలో జరిగిన ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన తీర్పే కారణం. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటేయ్యాలని భావిస్తే.. ఏకమొత్తంగా వేసేసి ఆ పార్టీకి భారీ మెజార్టీ అందిస్తారన్న పేరు ఉంది. అనపర్తిలో 2.22 లక్షల మంది ఓటర్లున్నారు. ఏ పార్టీకి మొగ్గుచూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. ఇందుకు గత ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009వ సంవత్సరంలో రాజమహేంద్రవరం లోక్సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా మురళీమోహన్ పోటీ చేశారు.ఆయనకు రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని ఆరు నియోజకవర్గాల్లో స్పష్టమైన మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తి నియోజకవర్గం నుంచి మాత్రం భంగపాటు ఎదురైంది. నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో అప్పటి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్కు ఒక్క అనపర్తి నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అన్ని నియోజకవర్గాలు కలిపి 50 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్న టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ అనపర్తి దెబ్బకు 10 వేల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న మార్గాని భరత్రామ్కు 2091 ఎన్నికల్లో 1,21,634 మెజార్టీ రాగా అందులో 62,000 ఓట్ల మెజార్టీ ఒక్క అనపర్తి నియోజకవర్గం నుంచే రావడం విశేషం. ఇలా ప్రతి ఎంపీ గెలుపులో అనపర్తి నియోజకవర్గం కీలక భూమిక పోషిస్తోంది. ప్రస్తుతం అనపర్తిలో తలెత్తిన పరిణామాల నేపథ్యంలో ప్రజలు వైఎస్సార్ సీపీ వైపు ఉన్నారు. ఈ పరిణామం ప్రస్తుతం రాజమండ్రి పార్లమెంట్ చర్చనీయాంశంగా మారింది. అనపర్తిపై బీజేపీ దృష్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క అసెంబ్లీ స్థానంలోనైనా పోటీ చేయాలన్నది బీజేపీ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే తొలుత అనపర్తి నుంచి రంగంలోకి దింపాలని భావించారు. ఆ నియోజకవర్గంలో బీజేపీకి తగిన అభ్యర్థి లేకపోవడంతో పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును బరిలోకి దింపాలన్న ఆలోచన చేసింది. ఇందుకు ససేమిరా అన్న సోము తనకు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్లో ఏ స్థానం ఇచ్చినా ఫర్వాలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందుకు టీడీపీ అధినేత నిరాకరించినట్టు సమాచారం. దీంతో పునరాలోచనలో పడ్డ బీజేపీ అనపర్తిలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన నేతను వెతికేపనిలో పడింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన బెంగళూరుకు చెందిన ఓ వ్యాపార వేత్తను పోటీ చేయించాలని భావించింది. సదరు వ్యాపార వేత్త వద్దకు ప్రతిపాదన తీసుకెళ్లినట్లు తెలిసింది. అయన సైతం అనపర్తిలో పోటీకి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో మాజీ సైనికుడు శివరామకృష్ణంరాజును ఎంపిక చేశారు. ఇక్కడే అసలు సమస్య ఎదురైంది. రంగంలోకి దిగిన పురందేశ్వరి, చంద్రబాబు అనపర్తి ఆందోళలను ఆసరాగా తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి రంగంలోకి దిగారు. తమ స్వప్రయోజనాలే లక్ష్యంగా సొంత పార్టీ నేతను కాదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి సీటు కట్టబెట్టేందుకు పురందేశ్వరి పావులు కదిపారు. పార్టీ నేతలు విభేదిస్తున్నా పట్టించుకోని పురందేశ్వరి నల్లమిల్లిని బీజీపీలోకి చేర్చుకున్నారు. వెంటనే ఆ పార్టీ అభ్యరి్థగా ఎన్నికల బరిలోకి దింపారు. ఈ పరిణామాలు గమనిస్తున్న బీజేపీ, టీడీపీ శ్రేణులు రాజకీయ విలువలను మంట పెట్టారంటూ ఇద్దరు నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. 2009 సంఘటన పునరావృతం అవుతుందా? అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో బీజేపీకి క్యాడర్ లేదు. ప్రస్తుతం ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపే మొగ్గు చూపుతున్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సత్తిసూర్యనారాయణరెడ్డికే పట్టం కట్టాలని భావిస్తున్నారు. దీనికితోడు అనసర్తి సీటు విషయమై కొన్ని రోజులుగా టీడీపీలో గందరగోళం నెలకొనడం, నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో టీడీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. స్వప్రయోజనాల కోసం పార్టీ ప్రతిష్టను తాకట్టు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ అభ్యరి్థగా రంగంలోకి దిగుతున్న నల్లమిల్లికి ఓటమి తప్పదని, ఆ ప్రభావం పార్లమెంట్ అభ్యర్థి అయిన తనపై పడుతుందన్న భయం పురందేశ్వరిని వెంటాడుతోంది. -
ఆ ఎంపీ టికెట్తో పిచ్చెక్కిపోతున్న పవన్
సాక్షి ప్రతినిధి, కాకినాడ: తలపోటుగా ఉన్నప్పుడు ఓ కప్పు స్ట్రాంగ్ టీ తాగితే ఉపశమనం కలుగుతుందంటారు. ఆ టీలో అల్లం వేసుకుంటే మరింత రుచికరంగా, తలపోటుకు తక్షణ పరిష్కారంగా ఉంటుంది. అటువంటి టీ తాగినా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు తలపోటు ఎక్కువైపోతోందే తప్ప తగ్గడం లేదనే చర్చ కాకినాడ జిల్లా జనసేన సర్కిల్లో చక్కర్లు కొడుతోంది. టీ టైమ్ అవుట్లెట్లతో తనకు అత్యంత సన్నిహితుడైన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఏరికోరి మరీ కాకినాడ ఎంపీ అభ్యర్థిని చేశారు పవన్ కల్యాణ్. ఇప్పుడా అభ్యర్థిత్వమే పవన్కు పెద్ద తలపోటుగా మారింది. ఊరించి ఊరించి.. శ్రీనివాస్కు జెల్ల ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ నుంచి వారాహి యాత్ర వరకూ అన్నీ తానై చూసుకున్న శ్రీనివాస్కు పవన్ కల్యాణ్ తొలుత జనసేన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత ప్రమోషన్ అన్నట్టు.. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఉదయ్ శ్రీనివాస్ను బరిలోకి దింపుతామని సంకేతాలు అందించారు. ఈ మేరకు శ్రీనివాస్, ఆ పార్టీ నేతలు ఆ నియోజకవర్గంలో ప్రచారం కూడా చేశారు. నాలుగు రోజులు గడిచేసరికి పవన్ కల్యాణ్ నాలుక మడత పెట్టేశారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ఓసారి.. కాదు కాదు.. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని రోజుకో మాట చెబుతూ పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టేశారు. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఆయన కూడా చాలా కాలం మీమాంసలో పడ్డారు. చివరకు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి శ్రీనివాస్కు జెల్ల కొట్టారు. అయితే, ఆ నొప్పి ఆయనకు తెలియనివ్వకుండా కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. పిఠాపురంలో అంతా టీడీపీ అధినేత చంద్రబాబు డైరెక్షన్లోనే జరుగుతోందని, తమను కాదని పవన్ ఇక్కడ ఏ నిర్ణయమూ తీసుకోలేరని పిఠాపురం టీడీపీ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ తొలి నుంచీ బాహాటంగానే చెబుతూ వచ్చారు. సరిగ్గా ఉదయ్ శ్రీనివాస్ విషయంలో అదే జరిగింది. వ్యతిరేకిస్తున్న టీడీపీ జనసేన నుంచి ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం టీడీపీ సరికొత్త రాజకీయానికి తెర తీసింది. ఆయనను ఆ స్థానంలో కూడా ఉండే అవకాశం లేకుండా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు శ్రీనివాస్కు పొగ పెడుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ స్థానంలో పట్టుమని పది మందితో కూడా పరిచయం లేని శ్రీనివాస్ను ఏకంగా ఎంపీ అభ్యర్థిని చేసేయడమేమిటని టీడీపీ నేతలు, ఆ పార్టీ అభ్యర్థులు వాదన తీసుకువస్తున్నారు. పారీ్టలోని సీనియర్లతో మాట వరసకైనా సంప్రదించకుండా పవన్ తీసుకున్న ఈ నిర్ణయం వారికి రుచించడం లేదు. అలాగని నేరుగా బయట పడకుండా, శ్రీనివాస్ను సాగనంపేందుకు చంద్రబాబు వద్ద పావులు కదుపుతున్నారు. కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో పిఠాపురం, కాకినాడ రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తోంది. అవి మినహా మిగిలిన ఐదు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఉదయ్ శ్రీనివాస్ను మార్చాలని గట్టిగా పట్టు పడుతున్నారు. సానా సతీష్కు కట్టబెట్టేందుకు.. ఉదయ్ శ్రీనివాస్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడైన సానా సతీష్ను తెర మీదకు తీసుకుని వచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన పేరు పరిగణనలోకి తీసుకోవాలని టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకుని వస్తున్నారు. అటు టీడీపీ, ఇటు జనసేనలకు సమదూరం పాటిస్తూ, చారిటబుల్ ట్రస్టు పేరుతో కాకినాడ పార్లమెంటరీ స్థానాన్ని ఆశిస్తున్న స్థానికుడైన సతీష్ పేరు పరిశీలించాలని టీడీపీ అగ్ర నేతలు ఇటీవల చంద్రబాబును కోరారు. తద్వారా ఎంపీ సీటును కూడా తమ ఖాతాలో వేసుకోవాలన్నది టీడీపీ వ్యూహంగా ఉంది. కాకినాడ ఎంపీ సీటు ఆశించి భంగపడిన జ్యోతుల నవీన్ కుమార్ వర్గీయులు కూడా ఉదయ్ శ్రీనివాస్తో విభేదిస్తున్నారు. ఒక దశలో నవీన్ కుమార్ తండ్రి, జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జ్యోతుల నెహ్రూ సైతం ‘సూట్కేసులతో వచ్చే వారికి సీట్లు ఇచ్చేస్తే.. ఇక్కడ పారీ్టనే నమ్ముకుని కష్టపడి చేస్తున్న నాయకులు ఏమైపోవాలి’ అంటూ బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు అప్పట్లో దుమారం రేపాయి. ఆ సమయంలోనే పవన్ పట్టుబట్టి మరీ ఉదయ్ శ్రీనివాస్ను ఎంపీ స్థానం నుంచి బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించారు.దీనిపై టీడీపీ అభ్యర్థులు కన్నెర్ర చేస్తున్నారు. పార్లమెంటరీ అభ్యర్థిని ప్రకటించే ముందు ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న వారిని సంప్రదించాలనే కనీస సంప్రదాయం కూడా పాటించలేదనే సాకుతో శ్రీనివాస్కు చెక్ పెట్టేందుకు టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ముక్కూ మొహం తెలియని ఉదయ్ శ్రీనివాస్ను ఏ ప్రాతిపదికన కాకినాడ ఎంపీ అభ్యరి్థని చేశారని వారు ప్రశి్నస్తున్నారు. తంగెళ్లకు చెక్ పెట్టేందుకు చాప కింద నీరులా టీడీపీ నేతలు చేస్తున్న ఈ ప్రయత్నాలు పవన్కు తలపోటుగా మారాయి. టీడీపీ ఖాతాలో వేసుకునేందుకేనా.. అయితే, ఇదంతా చంద్రబాబు వ్యూహమేనని జనసేన నాయకులు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో తమ పారీ్టకి కేటాయించిన కాకినాడ ఎంపీ స్థానాన్ని లాక్కునేందుకే ఉదయ్ శ్రీనివాస్పై వ్యతిరేక ప్రచారం నడుపుతున్నారని మండిపడుతున్నారు. ఏ పారీ్టలోనూ చేరకుండా గోడ మీద.. సామెత చందంగా ఉన్న సతీ‹Ùను ఎందుకు ప్రతిపాదిస్తున్నారని ఇటీవల జరిగిన టీడీపీ, జనసేన పారీ్టల సమన్వయ సమావేశంలో ఉదయ్ శ్రీనివాస్ వర్గీయులు గట్టిగా ప్రశ్నించారని తెలిసింది. ఇదిలా ఉండగా కాకినాడ ఎంపీ బరిలో నిలిచేందుకు ఉదయ్ శ్రీనివాస్ చివరి వరకూ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన బుధవారం నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, చివరి నిమిషం వరకూ కూడా అభ్యర్థులను తనకు నచ్చిన రీతిలో మార్చేసిన చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఏ తీరానికి చేరుతుందనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఖర్చులు ఇవ్వడం లేదని.. ఉదయ్ శ్రీనివాస్ను మారి్పంచేందుకు టీడీపీ అభ్యర్థులు గట్టిగా పట్టు పట్టడానికి మరో కారణం కూడా ఉంది. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న వారికి అవుతున్న ఖర్చులు కనీసంగా భరించడానికి కూడా ఉదయ్ శ్రీనివాస్ సహకరించడం లేదని అంటున్నారు. ఇది కూడా ఆయనపై టీడీపీ నేతల వ్యతిరేకతకు కారణమని చెబుతున్నారు. తన వెనుక పవన్ ఉన్నారనే ధైర్యంతో.. మితిమీరిన విశ్వాసంతో ఉదయ్ శ్రీనివాస్ ఒంటెద్దు పోకడలతో వ్యవహరిస్తున్నారని టీడీపీ అభ్యర్థులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. -
అనపర్తిలో అయోమయం
సాక్షి, రాజమహేంద్రవరం: అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్నా ఎన్నికల బరిలోకి ఎవరు దిగుతారనే విషయంపై సస్పెన్స్ వీడటం లేదు. ఫలితంగా బీజేపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సీటు తమకంటే తమకంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి స్వప్రయోజనాల కోసం, మరిది చంద్రబాబుకు మంచి చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో టీడీపీ, బీజేపీ నేతలు నలిగిపోతున్నారు. చంద్రబాబు వ్యూహంతో.. అనపర్తి అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును టీడీపీ తొలుత ప్రకటించింది. అనంతరం కుదిరిన పొత్తుల్లో ఈ సీటును బీజేపీకి వదిలేసింది. దీంతో హతాశులైన నల్లమిల్లి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. చంద్రబాబు దిగి రాకపోవడంతో రామకృష్ణారెడ్డి రెబల్గా బరిలోకి దిగి, ప్రచారం చేసుకుంటున్నారు. ఈలోగా ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా మాజీ సైనికుడు ములగపాటి శివరామ కృష్ణంరాజు పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన విపక్ష కూటమి అభ్యరి్థగా బీజేపీతో పాటు టీడీపీ, జనసేన కండువాలు వేసుకుని ప్రచారం చేసుకుంటూంటే టీడీపీ నేతలు బిక్కవోలులో అడ్డుకున్నారు. టీడీపీ కండువాలతో ప్రచారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు వ్యూహం మేరకు బీజేపీ అభ్యరి్థగా శివరామ కృష్ణంరాజును తప్పించి, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కమలం పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించేందుకు పురందేశ్వరి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ ఏర్పడింది. దీనిపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. పోటాపోటీగా నామినేషన్లు నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తరువాత చూద్దాంలే అనే భావనతో ఎవరికి వారు ఇప్పటికే నామినేషన్లు వేస్తున్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి టీడీపీ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి తానే ఎన్నికల బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చేలా ఆ పార్టీ అభ్యర్థి శివరామ కృష్ణంరాజు తరఫున ఆయన భార్య దుర్గా దేవిక నామినేషన్ దాఖలు చేసి అందరినీ షాక్కు గురి చేశారు. ఒకవైపు సీటుపై నెలకొన్న పీటముడి వీడకముందే బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు కావడంతో దీనిని బీజేపీకే కట్టబెడతారేమోననే ఆందోళనతో నల్లమిల్లి వర్గం పునరాలోచనలో పడింది. ముందు జాగ్రత్తగా రామకృష్ణారెడ్డి తరఫున తేతలి అబ్బుస్రెడ్డి కూడా బీజేపీ అభ్యరి్థగా మంగళవారం నామినేషన్ వేశారు. ఈ పరిణామం బీజేపీ నేతల్లో మరింతగా అగ్గి రాజేస్తోంది. పారీ్టలో చేరకుండానే బీజేపీ అభ్యరి్థగా ఎలా నామినేషన్ వేస్తారంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పురందేశ్వరి మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గూటికి నల్లమిల్లి? తాజా పరిణామాల్లో అనపర్తిలో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యూహాత్మకంగా ఆ పార్టీకి గుడ్బై చెప్పి కమలం గూటికి చేరుకోనున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రక్రియ లాంఛనమన్న సంకేతాలు టీడీపీ నేతల నుంచే వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చంద్రబాబు, పురందేశ్వరి డైరెక్షన్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు కమలనాథులే చెబుతున్నారు. కమలం గుర్తు పైనే అనపర్తి బరిలో నల్లమిల్లి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన బీజేపీ అభ్యర్థిగా తన తరఫున వేరే వ్యక్తితో నామినేషన్ వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ బీఫామ్ సైతం తనకే దక్కుతుందన్న ధీమా నల్లమిల్లిలో కనిపిస్తోంది. సెంటిమెంటుతోనేనా.. అనపర్తిపై పురందేశ్వరి ఇంతగా పట్టు పట్టడానికి ఈ నియోజకవర్గ సెంటిమెంటే కారణమని చెబుతున్నారు. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలని భావిస్తే.. ఏక మొత్తంగా అదే పార్టీకి పట్టం కడతారు. ఆ పారీ్టకి భారీ మెజార్టీ అందిస్తారన్న ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏ పారీ్టకి మొగ్గు చూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. గత ఎన్నికల గణాంకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009లో రాజమండ్రి నుంచి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా మురళీమోహన్ పోటీ చేశారు. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు 50 వేల మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తిలో మాత్రమే భంగపాటు ఎదురైంది. ఆ ఎన్నికల్లో అనపర్తి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్కు ఒక్క ఈ నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అనపర్తి దెబ్బకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం పునరావృతం కాకుండా, తాను గెలవాలంటే నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయించాలన్నది చిన్నమ్మ ఆకాంక్ష. అందుకోసమే తీవ్ర విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా పురందేశ్వరి అభ్యర్థి మార్పుపై పట్టుబడుతున్నారని అంటున్నారు. నల్లమిల్లికే చిన్నమ్మ ఆశీస్సులు! రాజమండ్రి ఎంపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న చిన్న మ్మ పురందేశ్వరి.. తన ప్రయోజనాల కోసం, మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు మేలు కోసం సొంత పారీ్టకి నమ్మకద్రోహం చేసేందుకు సైతం వెనుకాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. బీజే పీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి కృష్ణంరాజును కాదని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి ఆమె అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. ఎలాగైనా నల్లమిల్లిని బీజేపీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఆమె తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ సైనికుడు, కృష్ణంరాజును పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆమె అలి్టమేటం జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షురాలి ఆదేశాలను పట్టించుకోని కృష్ణంరాజు తన భార్యతో నామినేషన్ దాఖలు చేయించారని తెలిసింది. మాజీ సైనికుడికి అన్యాయం? అనపర్తి అసెంబ్లీ అభ్యరి్థగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణంరాజు ఆ పారీ్టకి వీర విధేయుడు. ఆయనది ఆర్ఎస్ఎస్ కుటుంబం. తండ్రి బీజేపీ బలోపేతానికి పాటు పడ్డారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన కృష్ణంరాజు బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా పేరు సంపాదించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు నాలుగేళ్లుగా అహరి్నశలూ కష్టపడ్డారు. ఏడాది నుంచి బీజేపీ అనపర్తి నియోజకవర్గ కనీ్వనర్గా కొనసాగుతున్నారు. ఈ మాజీ సైనికుడిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు అనపర్తి సీటు కేటాయించారు. ఈ పరిణామం పురందేశ్వరికి మింగుడు పడని అంశంగా మారింది. స్వపక్ష అభ్యరి్థకి మద్దతు ఇవ్వాల్సింది పోయి.. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి అండగా నిలవడం ప్రారంభించారు. అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో లోక్సభ ఓట్లు తనకు రావాలంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యరి్థగా నల్లమిల్లి ఉండాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం చివరకు అధిష్టాన నిర్ణయాన్ని సైతం ధిక్కరించేందుకు సిద్ధపడుతున్నారు. పురందేశ్వరి వ్యవహార శైలి కమలనాథులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత సోము వీర్రాజు బీజేపీకి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. -
టెన్త్ ఫలితాల్లో శ్రీ షిర్డీ సాయి ముందంజ
ఆల్కాట్తోట (రాజమహేంద్రవరం రూరల్): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదవ తరగతి ఫలితాలలో శ్రీషిర్డీసాయి విద్యానికేతన్ రాజమహేంద్రవరం, కడియం విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించినట్లు విద్యాసంస్థల డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు. తమ లక్ష్య ఓరియంటేషన్తో 10 వ తరగతి చదివిన వి. ఉదయ రుషిత 600 మార్కులకు 593 సాధించి ప్రథమ స్థానంలో నిలువగా ఎన్.సాయి అక్షయ, బి.యశశ్విని 592 మార్కులు, ఎం. జాహ్నవి, ఎస్. దేవికృష్ణసిరి 591, ఎ. లోహిత్ కుమార్ 590 మార్కులు సాధించినట్లు వివరించారు. ఆరుగురు విద్యార్థులు 590కి పైగా మార్కులు సాధించగా, 24 మంది 580 మార్కులకు పైగా, 44 మంది 570కి పైగా మార్కులు, 75 మంది 550కి పైగా మార్కులు సాధించారు. హాజరైన మొత్తం164 మంది విద్యార్థులు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణులయినట్లు తెలిపారు. విద్యార్థులను, ఉపాధ్యాయ బృందాన్ని శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, లక్ష్య అకాడమీ డీన్ కె. శ్రీనివాస్ అభినందించారు.
Pagination
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
సీఎస్కేతో ఎస్ఆర్హెచ్ పోరు.. తుది జట్లు ఇవే
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
- కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
- ప్రజా సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావిస్తా
Advertisement