Sakshi News home page

పోలవరం పై టీడీపీ సర్కారుకు శ్రద్ద లేదు

Published Sat, Jul 8 2017 1:34 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ సమావేశాలు సందర్భంగా పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల అధ్యక్షుడు పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ.. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు. కమీషన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని జిల్లాకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టారు. రూ.16 వేల కోట్ల అంచనాలతో ఉన్న పోలవరం ప్రాజెక్టును రూ.40 వేల కోట్లకు పెంచి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు