వైరల్‌గా మారిన ఫోన్ సంభాషణ | Sakshi
Sakshi News home page

వైరల్‌గా మారిన ఫోన్ సంభాషణ

Published Mon, Nov 18 2019 8:35 AM

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బండి సంజయ్‌ కుమార్, కరీంనగర్‌ కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ సంచలనంగా మారింది. 1.30 నిమిషాల ఆడియో టేప్‌ను శనివారం కొందరు వ్యక్తులు వైరల్‌ చేయగా.. అందులో కలెక్టర్‌ సూచనలు, సంజయ్‌ కృతజ్ఞతలే ఎక్కువగా ఉన్నాయి. కాగా ఈ సంభాషణ 8 నిమిషాలు జరిగిందని, కట్, మిక్స్‌ విధానం ద్వారా కొందరు తమ సంభాషణను వక్రీకరించి వైరల్‌ చేశారని కలెక్టర్‌ సర్ఫరాజ్‌ ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై ‘సాక్షి’దృష్టి సారించి 8 నిమిషాల ఒరిజినల్‌ ఆడియో టేప్‌ను సంపాదించింది. ఇందులో కూడా సంజయ్‌ సందేహాలను కలెక్టర్‌ నివృత్తి చేయడమే ఎక్కువగా ఉన్నాయి.