73వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | Sakshi
Sakshi News home page

73వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Published Sun, Jan 28 2018 10:41 AM

ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర 73వ రోజు ఆదివారం ఉదయం తిమ్మసముద్రం క్రాస్‌ నుంచి ప్రారంభించారు.   కొండగుంట, పాలిచెర్ల, గాంధీనగర్‌, ఇందిరమ్మ కాలనీ మీదుగా గూడురు కోర్టు సెంటర్‌ వరకు పాదయాత్ర సాగనుంది. కొండగుంట నుంచి పాలిచెర్ల, గాంధీనగర్‌ చేరుకుంటారు. భోజన విరామం అనంతరం ఇందిరమ్మ కాలనీ మీదగా గూడురు కోర్టు సెంటర్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు. ఇప్పటివరకూ వైఎస్‌ జగన్‌ 980.5 కిలోమీటర్లు నడిచారు.