మిలియన్‌ మార్చ్‌ రోజునే.. భారీ బహిరంగ సభ | Sakshi
Sakshi News home page

మిలియన్‌ మార్చ్‌ రోజునే.. భారీ బహిరంగ సభ

Published Wed, Feb 14 2018 8:19 AM

తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయింది. పార్టీ పేరు, నినాదాలు, విధివిధానాలు, గుర్తు తదితరాలు ప్రకటించేందుకు తేదీనీ ఖరారు చేశారు. మిలియన్‌ మార్చ్‌ జరిగిన మార్చి 10న భారీ బహిరంగసభ నిర్వహించి అట్టహాసంగా పార్టీని ప్రకటించాలని కోదండరాం నిర్ణయించారు. మిలియన్‌ మార్చ్‌తో సమైక్య రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడినట్లే, తెలంగాణ ప్రజల ఆకాంక్షల సాధన కోసం పునరంకితం అవుతామని ప్రకటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల రెండో వారంలోనే పార్టీ ప్రకటన, భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించాలని ముందు భావించినా జేఏసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మిలియన్‌ మార్చ్‌ రోజునే ప్రకటన చేయడం బాగుంటుందని కోదండరాం ఈ నిర్ణయం తీసుకున్నారు.  

Advertisement
Advertisement