నేటి నుంచి వైఎస్‌ఆర్ జిల్లాలో జగన్ పర్యటన | Sakshi
Sakshi News home page

నేటి నుంచి వైఎస్‌ఆర్ జిల్లాలో జగన్ పర్యటన

Published Tue, Jul 7 2015 10:37 AM

వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ శాసనసభ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం(నేడు) జిల్లాకు రానున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం కర్నూలు నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు కడప చేరుకుంటారన్నారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటన మేరకు జగన్ పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం సాయంత్రం 6.30 గంటలకు కడపలోని అమీన్ ఫంక్షన్ హాలులో ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. రాత్రి ఇడుపులపాయకు చేరుకొనిఅక్కడే బస చేస్తారు.