ప్రత్యేక హోదాపై మరింత ఉధృతంగా పోరాటం | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాపై మరింత ఉధృతంగా పోరాటం

Published Tue, Jan 24 2017 7:19 AM

రాజ్యాంగం అమలులోకి వచ్చిన గణతంత్ర దినోత్సవం రోజున మరో చారిత్రాత్మక పోరాటానికి రాష్ట్రం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకహోదా సాధించడం కోసం మరింత ఉధృత పోరాటానికి సమాయత్తం కావాలని యువతకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. పార్టీలకతీతంగా చేయి కలుపుదామని, సమైక్యపోరాటంతో హోదా సాధిద్దామని ఆయన ఆకాంక్షించారు. ఈనెల 26న అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడం ద్వారా ప్రత్యేకహోదాకు మద్దతు పలకాలని విద్యార్థులకు, ప్రత్యేకించి యువతకు జగన్‌ పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా సాధన కోసం జరిగే ఏ కార్యక్రమానికైనా వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ మద్దతుగా నిలుస్తుందని జగన్‌ సోమవారంనాడు ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement