ఇంజినీరింగ్ టాపర్ గా సందీప్ | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్ టాపర్ గా సందీప్

Published Thu, May 28 2015 12:25 PM

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్ లో 70.65 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థులు మొదటి రెండు ర్యాంకుల్లో నిలిచారు. 157 మార్కులతో మోపర్తి సాయి సందీప్ టాపర్ గా నిలిచాడు. 156 మార్కులతో రెండో ర్యాంకు సాధించాడు. విజయనగరం జిల్లా బొబ్బలికి చెందిన కీర్తన(155) మూడో ర్యాంక్, హైదరాబాద్ కు చెందిన గుత్తా సాయి తేజ(155) నాలుగో ర్యాంకు, వెన్నపూస హేమంత్ రెడ్డి(154) ఐదో ర్యాంకు సాధించారు.