వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత.. | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లోకి టీడీపీ నేత..

Published Mon, Aug 21 2017 2:19 PM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా టీడీపీ నేత ముస్తాక్‌ సోమవారం పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా ముస్తాక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.