Sakshi News home page

ఆటో డ్రైవర్ల అసోసియేషన్‌ రాస్తారోకో

Published Thu, Mar 28 2024 1:05 AM

ర్యాలీ నిర్వహిస్తున్న ఆటో డ్రైవర్‌ అసోసియేషన్‌ సభ్యులు  - Sakshi

బరంపురం:

కొరాపుట్‌–రాయగడ మార్గంలోని పొడాగుడ వద్ద ప్రైవేటు బస్సు బోల్తాపడిన ఘటనలో జయపురం ఆటో డ్రైవర్ల అసోసియేషన్‌ కార్యదర్శి నారాయణ రథ్‌ మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అసోసియేషన్‌ సభ్యులు తీవ్రంగా స్పందించారు. బుధవారం నారాయణ రథ్‌ మృతదేహం తీసుకొస్తున్న అంబులెన్స్‌ను ఆటో డ్రైవర్లు అడ్డగించి రాస్తారోకో నిర్వహించారు. మృతుడిది నిరుపేద కుటుంబమని, ముగ్గురు ఆడపిల్లలు కలిగిన ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దీనికోసం అతడి కుటుంబానికి తగిన పరిహారం చెల్లించాలన్నారు. రాస్తారోకోతో 26వ నంబర్‌ జాతీయ రహదారికి ఇరువైపుల వాహనాలు నిలిచిపోయాయి. దీంతో జయపురం పట్టణ పోలీసు అధికారి వచ్చి ఆందోళనకారులతో చర్చించారు. మృతుని కుటుంబానికి తగు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement

What’s your opinion

Advertisement