-
యూపీఏకు ప్రజామోదం
2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారమంతా లౌకికవాదం, ఉగ్రవాదం, మతతత్వం చుట్టూ తిరిగింది. ఐదేళ్లలో అభివృద్ధిని కాంగ్రెస్ ప్రధానంగా నమ్ముకుంది. ఉద్యోగావకాశాల కల్పన, సమాచార హక్కు చట్టం, గ్రామీణ ఉపాధి హామీ వంటి పథకాలను ప్రజలకు గుర్తు చేసింది. మత, భాష, ప్రాంతీయ వాదం, కుల వాదాలకు తాము వ్యతిరేకమంటూ ప్రచారం చేసింది. యూపీఏ హయాంలో ఉగ్రవాదం పెచ్చు మీరిందని బీజేపీ ఎంతగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదు. మరోవిడత యూపీఏనే ఆశీర్వదించారు... – సాక్షి, నేషనల్ డెస్క్ 2009లో 15వ లోక్సభ ఎన్నికలు ఏప్రిల్ 16 నుంచి మే 13 దాకా ఐదు దశల్లో జరిగాయి. 2004లో జనం తన పాలనను తిరస్కరించడంతో నొచ్చుకున్న వాజ్పేయి ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించారు. దాంతో ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ఎల్కే అద్వానీ తెరపైకి వచ్చారు. కానీ ఆయన పట్ల పలు ప్రాంతీయ పార్టీలు సానుకూలంగా లేవు. యూపీఏలోనూ కాస్త అనిశ్చితి నెలకొంది.మళ్లీ గెలిస్తే రాహుల్ను ప్రధాని చేస్తారన్న ప్రచారం సాగినా మన్మోహనే కొనసాగుతారని సోనియా స్పష్టం చేశారు. ఎన్నికలకు 5 నెలల ముందు ముంబై ఉగ్ర దాడి 170 మందిని పొట్టన పెట్టుకుంది. ఈ పరిస్థితుల్లో యూపీఏ, ఎన్డీఏ కూటముల్లో దేనికీ మెజారిటీ రాకపోవచ్చని అంతా అంచనా వేశారు. కాంగ్రెస్ బలం 145 నుంచి 206 ఎంపీలకు పెరిగింది. బీజేపీ 22 స్థానాలు కోల్పోయి 116కు పరిమితమైంది. యూపీఏకు 261 స్థానాలు దక్కాయి. మిత్రపక్షాల సాయంతో మొత్తం 322 మంది ఎంపీల మద్దతుతో మన్మోహన్ మరోసారి ప్రధాని అయ్యారు. కాంగ్రెస్కు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో 33 స్థానాలు లభించాయి! సీపీఎం సారథ్యంలోని థర్డ్ ఫ్రంట్కు 78 సీట్లొచ్చాయి. నియోజకవర్గాల పునర్విభజన 2001 జనాభా లెక్కల ఆధారంగా 2008లో లోక్సభ స్థానాల పునర్విభజన జరిగింది. ఇది కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందంటారు. 499 స్థానాల స్వరూపం మారింది. ఆ మేరకు ఓటర్ల జాబితాల్లోనూ మార్పుచేర్పులు చేయాల్సి వచ్చింది. కుంభకోణాలతో అప్రతిష్ట యూపీఏ పాలనలో అతి పెద్ద కుంభకోణాలు వెలుగు చూశాయి. 2జీ స్కాం వీటిలో ముఖ్యమైనది. డీఎంకే నేత ఎ.రాజా టెలికం మంత్రిగా ఉండగా 2008లో 122 కొత్త టెలికం లైసెన్స్లు జారీ చేశారు. అనుభవం లేని కంపెనీలకు కారుచౌకగా కట్టబెట్టినట్టు ఆరోపణలొచ్చాయి. దాంతో ఖజానాకు ఏకంగా రూ.1.76 లక్షల కోట్ల నష్టం జరిగిందని కాగ్ పేర్కొంది. 2004–11 మధ్య 194 బొగ్గు గనులను వేలం వేయకుండా కేటాయించడం వల్ల మరో రూ.1.86 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్టు తేల్చింది! విశేషాలు 2009 సార్వత్రిక ఎన్నికలు ఇద్దరు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ల సారథ్యంలో జరగడం విశేషం! ఏప్రిల్ 20న తొలి దశ పోలింగ్ ఎన్.గోపాల స్వామి ఆ«ధ్వర్యంలో, మిగతా దశలు నవీన్ చావ్లా పర్యవేక్షణలో జరిగాయి. వీరి విభేదాలు సంచలనంగా మారాయి. ఏప్రిల్ 20న రిటైరైన గోపాలస్వామి, ఆలోగా ఒక విడత పోలింగైనా నిర్వహించాలని భావించారు. దాన్ని ఎన్నికల కమిషనర్గా చావ్లా వ్యతిరేకించడం, ఆయన్ను తొలగించాలంటూ రాష్ట్రపతికి గోపాలస్వామి సిఫార్సు చేయడం కలకలం రేపింది. ► 2009 ఎన్నికల్లో ఏకంగా 114 మంది అభ్యర్థులు కేవలం 3 శాతం ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ►యూపీఏ తొలి ఐదేళ్లలో జీడీపీ వృద్ధి రేటు 9.8 శాతంతో ఆల్టైం గరిష్టానికి చేరింది. ► 2008 అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని యూపీఏ ప్రభుత్వం విజయవంతంగా అధిగమించింది. ఫొటో ఓటర్ జాబితాలు ఎన్నికల సంఘం కొత్తగా ఓటర్ల స్టాంప్ సైజు ఫొటోలతో జాబితాలను ప్రవేశపెట్టింది. దాంతో 2009 లోక్సభ ఎన్నికలను ఫొటో ఓటర్ల జాబితాలతో జరిగాయి. అప్పటిదాకా వాటిపై కేవలం పేర్లే ఉండేవి. అయితే అసోం, నాగాలాండ్, జమ్మూ కశీ్మర్లో మాత్రం ఫొటోల్లేని జాబితాలనే ఉపయోగించారు. 15వ లోక్సభలో పార్టీల బలాబలాలు (మొత్తం స్థానాలు 543) పార్టీ స్థానాలు కాంగ్రెస్ - 206 బీజేపీ - 116 ఎస్పీ - 23 బీఎస్పీ - 21 జేడీయూ - 20 టీఎంసీ - 19 డీఎంకే - 18 బిజూ జనతాదళ్ - 14 శివసేన - 11 ఇతరులు - 86 స్వతంత్రులు - 9 -
సైకిల్ ఎక్కేదిలేదు... ప్రచారం చేసేదిలేదు
శ్రీరంగరాజపురం (చిత్తూరు జిల్లా): ‘విలువలు లేని వ్యక్తులతో కలసి మేం పనిచెయ్యం. కూటమి అభ్యర్థి థామస్ వ్యవహారశైలితో విసిగిపోయాం. ఇక మీదట సైకిల్ ఎక్కేది లేదు... ప్రచారం చేసేది లేదు’ అని గంగాధర నెల్లూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జి యుగంధర్, బీజేపీ ఇన్చార్జి రాజేంద్రలు స్పష్టంచేశారు. ఈ మేరకు ఎస్ఆర్ పురం మండలం కటికపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో తీర్మానం కూడా చేశారు.ఈ సందర్భంగా యుగంధర్, రాజేంద్ర మాట్లాడుతూ కూటమి అభ్యర్థి థామస్ వ్యవహార శైలి చూస్తుంటే బీజేపీ, జనసేన మద్దతు అవసరం లేదని పరోక్షంగా చెబుతున్నట్లు ఉందన్నారు. థామస్ నామినేషన్ రోజు తమ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కనీసం తాగునీరు, భోజనం కూడా ఏర్పాటు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమ పార్టీల ఆదేశాల మేరకు కూటమి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారానికి వెళితే... ‘థామస్ కనీసం పలకరించడం లేదు. చూసీ చూడనట్లు నటిస్తున్నాడు. మమ్మల్ని కుక్కల కంటే హీనంగా చూస్తున్నాడు. అసలు ఎందుకు వచ్చారు.. అన్నట్లు వ్యవహరిస్తున్నాడు. మాకు గౌరవం ఇవ్వని అభ్యర్థికి మేం మద్దతుగా ఉండలేం. అందుకే ఆయనకు మద్దతు ఇవ్వబోం అని తీర్మానం చేశాం’ అని వివరించారు. మరోవైపు వైఎస్సార్సీపీ అభ్యర్థి కృపాలక్ష్మి వారి పార్టీలో ఉన్న అసంతృప్తులను కూడా కలుపుకుని ప్రచారంలో దూసుకువెళుతున్నారని, టీడీపీ అభ్యర్థికి మాత్రం ఎవరిపైనా గౌరవం లేదన్నారు. థామస్ వ్యవహారశైలిపై బీజేపీ, జనసేన అధిష్టానాలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల బీజేపీ, జనసేన అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
చేవెళ్ల రణక్షేత్రం..సంపన్నుల సమరం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అందరి దృష్టి చేవెళ్లపైనే ఉంది. పల్లె, పట్టణాల కలబోతతో కూడిన ఈ లోక్సభ స్థానంలో మూడు ప్రధాన పార్టీలే కాదు.. ముగ్గురు సంపన్నులు పోటీ పడుతుండటమే ఇందుకు కారణం.గులాబీ కోటలో కమలం పువ్వును వికసింపజేయాలని బీజేపీ.. హస్తం హవా కొనసాగించాలని కాంగ్రెస్ భాస్తోంది. 2009లో మినహా ఇప్పటివరకు ఇక్కడ ఏ ఎన్నిక వచ్చినా కారుదే హవా. ఈసారి ఎలాగైనా కారు స్పీడ్కు బ్రేకులు వేయాలని బీజేపీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి. బలమైన అభ్యర్థులను బరిలోకి దించాయి. అయితే ఒకసారి గెలిచిన వారు రెండోసారి విజయం సాధించిన చరిత్ర లేకపోవడంతో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అంచనాలకు అందవు.. వ్యూహాలకు చిక్కరు అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ, అనుబంధ పరిశ్రమలకు నెలవైన చేవెళ్ల లోక్సభ స్థానంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓటర్లే కాదు.. ఉత్తరాది ఓటర్లు కూడా ఉన్నారు. వారిలో ముస్లింలు 15 శాతం, ముదిరాజ్లు 15 శాతం, మాదిగలు 15.71 శాతం, గౌడ్లు 9.50 శాతం, మాలలు 7.86 శాతం, యాదవులు 7.86 శాతం, లంబాడీలు 6.57 శాతం, రెడ్లు 5 శాతం, కమ్మలు 3.43 శాతం, లింగాయత్లు 3.36 శాతం, మున్నూరుకాపులు 3 శాతం ఓటర్లు ఉన్నట్లు అంచనా.అభ్యర్థుల గెలుపోటములను ముస్లింలు, ముదిరాజ్లే డిసైడ్ చేయనున్నారు. అయితే ఓటర్ల తీరు అంచనాలకు అందడం లేదు. రాజకీయ వ్యూహాలకు కూడా చిక్కడం లేదు. 2009 నుంచి ఇప్పటివరకు జరిగిన ఈ మూడు ఎన్నికల్లో ఇదే అంశం స్పష్టమైంది. 2009లో కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్రెడ్డి ఇక్కడ గెలవగా ఆ తర్వాత ఆయన మళ్లీ ఈ స్థానం నుంచి పోటీ చేయలేదు. 2014లో బీఆర్ఎస్ నుంచి ప్రస్తుత బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ మధ్య ఉత్కంఠ పోరు నెలకొనగా కాంగ్రెస్ అభ్యర్థి ఎస్. జైపాల్రెడ్డి 18,532 ఓట్ల ఆధిక్యంతో జితేందర్రెడ్డిపై విజయం సాధించారు. ఇక్కడ 64.5 శాతం పోలింగ్ నమోదైంది. ఇద్దరి అభ్యర్థుల మధ్య ఓట్ల తేడా 1.7 శాతమే కావడం గమనార్హం. మొత్తం ఓట్లు: 16,81,664 పోలైన ఓట్లు: 10,83,490 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం ఎస్.జైపాల్రెడ్డి కాంగ్రెస్ 4,20,807 38.80 ఏపీ జితేందర్రెడ్డి టీడీపీ 4,02,275 37.102014 ఎన్నికల్లో 60.20 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో నోటాకు 10,018 ఓట్లు రాగా టీఆర్ఎస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి 73,023 ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థి పటోళ్ల కార్తీక్రెడ్డిపై గెలిచారు. మొత్తం ఓట్లు: 23,02,163 పోలైన ఓట్లు: 13,00,194 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం కొండా విశ్వేశ్వర్రెడ్డి టీఆర్ఎస్ 4,35,077 33.10 పి.కార్తీక్రెడ్డి కాంగ్రెస్ 3,62,054 27.50 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య గెలుపు దోబూచులాడింది. చివరికి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి 1.1 శాతం ఓట్ల తేడాతో విజయం సాధించారు. నోటాకు 9,244 ఓట్లు పోలయ్యాయి.మొత్తం ఓట్లు: 21,85,179 పోలైన ఓట్లు: 13,15,862 అభ్యర్థి పార్టీ వచ్చిన ఓట్లు శాతం జి.రంజిత్రెడ్డి టీఆర్ఎస్ 5,28,148 40.60 కొండా విశ్వేశ్వర్రెడ్డి కాంగ్రెస్ 5,13,831 39.05 ముగ్గురూ కోటీశ్వరులే.. కొండా విశ్వేశ్వర్రెడ్డి (బీజేపీ) రూ.4,490 కోట్లు గడ్డం రంజిత్రెడ్డి (కాంగ్రెస్) రూ.869.77 కోట్లుకాసాని జ్ఞానేశ్వర్ (బీఆర్ఎస్) రూ. 520.70 కోట్లు అభ్యర్థులు వారే.. పార్టీలే వేరు ప్రస్తుతం బరిలో నిలిచిన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు గతంలో వేర్వేరు పార్టీల నుంచి తలపడిన వారే. ప్రస్తుతం వారు మళ్లీ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన సంప్రదాయ కాంగ్రెస్ ఓటు బ్యాంకుతోపాటు రాజేంద్రనగర్, మహేశ్వరం, చేవెళ్ల, శేరిలింగంపల్లి, అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ముస్లిం ఓటర్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు హామీని ఎన్నికల్లో ప్రధానాస్త్రంగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రధాని మోదీపైనే భారం వేశారు. మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి వంటి అర్బన్ ఏరియాల్లో ఉన్న బీజేపీ కేడర్, మోదీ అభిమానులను ఆయన టార్గెట్గా ఎంచుకున్నారు. చేవెళ్ల, పరిగి, వికారాబాద్, తాండూరులో వ్యక్తిగత పరిచయాలను నమ్ముకున్నారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, శాసనమండలి సభ్యుడు కాసాని జ్ఞానేశ్వర్ పోటీ పూర్తిగా బీసీ ఓటర్లనే నమ్ముకున్నారు. లోక్సభ స్థానంలో 16.50 లక్షల బీసీలు ఉంటారని, వారే తనను గెలిపించనున్నారనే ధీమాతో ఉన్నారు. -
అలాగైతే తప్పుకుంటా
కరీంనగర్ టౌన్, సిరిసిల్ల: రుణమాఫీపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల తీరుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను ఎన్నికల్లో పోటీ నుంచే తప్పుకుంటా... నిరూపించకపోతే కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న 17 మంది అభ్యర్థులు ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు సిద్ధమా?’’అంటూ సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్ నేతలు తన సవాల్ ను స్వీకరించి డేట్, టైం, వేదిక నిర్ణయిస్తే.. వచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. శనివారం కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సోదరుడు కోడూరు మహేందర్ గౌడ్తోపాటు తెలంగాణ ఉద్యమకారుడు కుమార్ తమ అనుచరులతో కలిసి బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్బంగా వారందరికీ కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహా్వనించారు. బీజేపీ ఏది మాట్లాడినా మతతత్వమని ముద్రవేసే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇతర మతస్తుల ముందు హిందూ మతాన్ని హేళన చేసేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కుట్రలతో నన్ను ఓడించాలని చూస్తుండ్రు కరీంనగర్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి చీకటి ఒప్పందాలతో తనను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయని బండి సంజయ్కుమార్ ఆరోపించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో శనివారం పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అభ్యర్థి ఓటుకు రూ.వెయ్యి పంచి గెలవాలని యత్నిస్తున్నారని నిందించారు. ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని, ఆయన తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వెధవ అంటే తన దృష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వరి్ధల్లు’అని అర్థమన్నారు. పరారీలో దోచుకున్న కుటుంబం మొన్నటివరకు బోయినపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించిందని, కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారని సంజయ్ ఆరో పించారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉందని, వత్తాసు పలికిన పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారిందన్నారు. కేసీఆర్కు దోచిపెట్టడం తప్ప.. కుటుంబానికి దాచిపెట్టడం తప్ప వినోద్కుమార్ సాధించేదేమీ లేదని సంజయ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, ‘సెస్’మాజీ చైర్మన్ అల్లాడి రమేశ్ పాల్గొన్నారు. -
రేవంత్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్, సిద్దిపేటజోన్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి నుంచి దింపేస్తారనే భయం రేవంత్రెడ్డికి పట్టుకుందని, అందుకే ఇచ్చిన హామీలు, పరిపాలనపై మాట్లాడాల్సిన ఆయన అసహనంతో తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే ప్రధాని మోదీని సీఎం బడేబాయి అంటున్నారని, రేవంత్రెడ్డి ఓ ఫైటర్ అని బండి సంజయ్ పొగుడుతున్నారని, రేవంత్రెడ్డి బీజేపీలోకి రావాలని ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరు బీ టీమ్నో అర్థం అవుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దోస్తీకు బోలెడు కారణాలు ఉన్నాయని, కరీంనగర్తోపాటు అనేక సీట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్నారు. నన్ను తిట్టినా ఫర్వాలేదు.. హామీలు అమలు చేయండి: హరీశ్ ‘‘నేను కొత్త డిమాండ్లను అమలు చేయమని అనలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడుగుతున్నా. దానికి మీరు. మీ మంత్రులు నన్ను తిడుతున్నారు. నన్ను ఎంత తిట్టినా, ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా.. హామీలు అమలయ్యే వరకు అడుగడుగునా నిలదీస్తా’’అని హరీశ్రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నాడు ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు ఒట్టు అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్ మేరకు అమరవీరుల స్తూపం వద్దకు తాను రాజీనామాతో వస్తే రేవంత్ మొఖం చాటేశారని విమర్శించారు. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలుసని, పదవులు ముఖ్యం కాదని, ప్రజా ఆకాంక్షలే ముఖ్యమని పేర్కొన్నారు.గతంలో వచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరితే రేవంత్రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి మోసం చేసి పారిపోయారని విమర్శించారు. అప్పట్లో కిషన్రెడ్డి రాజీనామా చేయలేదని అలాంటి వారు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు అని మండిపడ్డారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని, లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా సరిపోతుందంటూ అందుకు కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్ ఆరోపించారు.
Pagination
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- కొత్త ఇంట్లోకి 'జబర్దస్త్' కమెడియన్.. వీడియో వైరల్
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
- స్టార్ హీరోయిన్ నుంచి కాంట్రవర్సీల వరకు.. సమంత గురించి ఇవి తెలుసా?
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
Advertisement